ప్రజల నుండే నేరుగా అభిప్రాయాలను సేకరించి మేనిఫెస్టో రూపొందిస్తున్నాం...* *రైతులతో సమావేశమైన బీజేపీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్* సమాజంలోని అన్ని వర్గాల ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించి అతి త్వరలో బీజేపీ పక్షాన ప్రజా మేనిఫెస్టోను విడుదల చేస్తామని మేనిఫెస్టో కమిటీ సభ్యులు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి కుటుంబ పార్టీల మాదిరిగా నాలుగు గోడల మధ్య మేనిఫెస్టోను రూపొందించబోమని, ప్రజల నుండి నేరుగా అభిప్రాయాలను సేకరించిన తరువాతే ప్రజాకర్షక మేనిఫెస్టోను రూపొందించి విడుదల చేస్తామన్నారు. ‘రైతన్నలారా... పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా అతి త్వరలో మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నాం. వ్యవసాయ రంగానికి సంబంధించి ఏ అంశాలను మేనిఫెస్టోలో చేర్చాలనే అంశంపై నేరుగా రైతుల నుండి అభిప్రాయాలను సేకరిస్తున్నాం... మీరేం కోరుకుంటున్నారో మీ అభిప్రాయాలను చెప్పండి’ అంటూ కరీంనగర్ జిల్లా రైతులతో బీజేపీ జిల్లా రైతాంగాన్ని కోరారు. ఈరోజు మధ్యాహ్నం ఎంపీ కార్యాలయంలో రైతులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్, జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు రైతులు తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోవడంవల్ల వ్యవసాయం చేయడం చాలా ఇబ్బందిగా మారిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్. కుమార్ మాట్లాడుతూ...ఇప్పటి వరకు యువత, రైతుల అభిప్రాయాలను సేకరించామని, ఈనెల 5లోపు కార్మికులు, మహిళలు సహా అన్నివర్గాల ప్రజల అభిప్రాయాల సేకరణను పూర్తి చేస్తామని తెలిపారు.
Comments 0