|
modi add 1

ఉస్మానియా యూనివర్సిటీ నుండి మేడారానికి పాదయాత్ర

------------------------------------------- మరో పదేళ్లు రేవంత్ రెడ్డి గారు CM గా ఉండి తెలంగాణ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనీ ఓయూ నుండి మేడారం కు పాదయాత్ర చేస్తు వస్తున్న ఓయూ jac చైర్మన్ ఓరుగంటి కృష్ణ మిత్ర బృందం ను ఈ రోజు భువనగిరి నందు కలిసిన నాగారం మునిసిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ కిలారి శ్రీనివాస్ యాదవ్, దాసరి రామ్ రెడ్డి కలిసి శాలువా పూలమాలతో సత్కారించి అభినందనలు తెలపడం జరిగింది

By NYALAKONDA ANIL DESAI | February 20, 2024 | 0 Comments

మేడారం సమ్మక్క సారక్క జాతర విశేషాలు

"దేశంలోనే అతి పెద్ద గిరిజనజాతర" ఎవరీ సమ్మక్క - సారక్కలు? రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర మన తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి పది కోట్ల మందికి పైగా హాజరు అవుతారని అంచనా. ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా, కేవలం తెలంగాణలోనే గాక అఖిల భారత దేశంలోనే వనదేవతలుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్క. "దేశంలోనే అతి పెద్ద గిరిజనజాతర"గా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది.మన రాష్ట్రము నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిషా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్దీ భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరను మన తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది.ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 1996 లో రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది. ఎవరీ సమ్మక్క-సారక్కలు? నేటి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండల ప్రాంతములోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు వేటకని వెళ్లినప్పడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడు. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులూ, సింహాలూ ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెని దైవాంశ సంభూతురాలిగా భావించారు. కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకునేవారు. సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది. ఆమె చేత్తో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట. ఆమెను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి పెళ్ళి చేసాడు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు, మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు "పగిడిద్దరాజు" కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు, అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తుతాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కాని సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది, వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాప రుద్రుడు ఆశ్చర్య చకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యంలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కానీ ఆ ప్రాంతములో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జాతర విశేషాలు జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు.దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగి పోతారు.మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యద్ద స్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు. గిరిజన వాళ్ళె కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు సుమారు కోటికి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర, ఈ జాతర ఆసియా లోనే అతి పెద్ద జాతర.

By NYALAKONDA ANIL DESAI | February 21, 2024 | 0 Comments

బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ గారు విడుదల చేసిన పత్రికా ప్రకటన.

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమరశంఖం పూరించింది. కేంద్రంలో నరేంద్ర మోదీ గారు మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించేలా, రాష్ట్రంలోని 17కు 17 సీట్లలో విజయం సాధించే లక్ష్యంతో విజయసంకల్ప యాత్రను ప్రారంభించింది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చి, నరేంద్ర మోదీ గారిని మూడోసారి ప్రధానమంత్రిని చేసే యజ్నంలో తెలంగాణ ప్రజలను భాగస్వాములను చేసేలా, తెలంగాణలో అన్ని పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించేందుకు ప్రజల ఆశీర్వాదం తీసుకునేలా చేపట్టిన విజయసంకల్ప యాత్రకు అద్భుత స్పందన లభించింది. ఎక్కడికెళ్లినా పెద్దఎత్తున జనం తరలివచ్చారు. 4 క్లస్టర్లలో జరిగిన విజయసంకల్ప యాత్రలో ఆద్యంతం మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు తరలివచ్చి మద్దతు తెలిపారు. అన్ని నియోజకవర్గాల నుంచి అంచనాలకు మించి భారతీయ జనతా పార్టీకి స్పందన లభిస్తోంది. విజయసంకల్ప యాత్రల్లో కేంద్ర మంత్రి, బీజేపీ రథసారధి కిషన్ రెడ్డి గారు, ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ గారు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ గారు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారు, మాజీ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు, ఇతర నాయకులు ఆయా క్లస్టర్ల పరిధిలో పాల్గొన్నారు. కార్నర్​ మీటింగులకు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పదేళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రతిపక్షాల వైఫల్యాలను విజయ సంకల్ప యాత్రలతో ప్రజలకు వివరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ, అవినీతి రాజకీయాలను ఎండగట్టారు. తెలంగాణ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించి, మద్దతు కూడగట్టారు. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్. ఇస్ బార్...చార్ సౌ పార్ అనే నినాదాలతో దారిపొడవునా బీజేపీ శ్రేణులు, ప్రజలు హోరెత్తించారు. యాత్రల ప్రారంభం.. కొమురం భీం క్లస్టర్ : ఆదిలాబాద్ జిల్లా బాసర అమ్మవారి ఆశీస్సులతో యాత్ర ప్రారంభమైంది. ముథోల్‌ నియోజకవర్గంలోని భైంసాలో యాత్ర ప్రారంభోత్సవానికి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ యాత్రలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ గారు, ఎంపీ సోయం బాపురావు గారు, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి గారు, రామారావు పటేల్ గారు, పాయల్ శంకర్ గారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ గారు, తదితరులు పాల్గొన్నారు. రాజరాజేశ్వరి క్లస్టర్: వికారాబాద్ జిల్లా చేవెల్ల పార్లమెంటు నియోజకవర్గంలోని తాండూరులో కేంద్రమంత్రి కేంద్ర మంత్రి బీఎల్ వర్మతో కలిసి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ గారు విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో శాసనసభ్యులు వెంకటరమణారెడ్డి గారు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు, తదితరులు పాల్గొన్నారు. భాగ్యనగర్ క్లస్టర్: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి ఆశీస్సులతో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఈ యాత్రను గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గారు ప్రారంభించారు. ఈ యాత్రలో బీజేపీ మాజీ శాసనసభ్యులు ఈటెల రాజేందర్ గారు, ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గారితో పాటు తదితరులు పాల్గొన్నారు. కృష్ణమ్మ క్లస్టర్ : నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా గ్రామంలొ కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల గారితో కలిసి కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణ గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి గారు, రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ గారు, తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మొత్తం 4 క్లస్టర్లలో జరిగిన విజయసంకల్ప యాత్రలలో దారిపొడవునా ప్రజలు భారీగా తరలివచ్చి మమేకం అయ్యారు. భారతీయ జనతా పార్టీకి అపూర్వ మద్దతు తెలిపారు. పార్టీ నాయకులకు మంగళహారతులతో స్వాగతం పలికి, ఆశీర్వాదం తెలిపారు. మండుటెండలో కూడా తరలివచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ బీజేపీ నాయకులు బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీని విజయపథాన నడిపించేందుకు పార్టీ శ్రేణులు నూతనోత్తేజంతో కదం తొక్కాయి. భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయసంకల్ప యాత్రకు జనం ఇంతపెద్దఎత్తున తరలివచ్చి మద్దతు తెలపడం చూస్తుంటే.. తెలంగాణలో అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో కాషాయ జెండా రెపరెపలాడటం ఖాయమనడానికి నిదర్శనంగా కనపడుతోంది. ఈ సందర్భంగా... రేపటి నుంచి మరో పదిరోజుల పాటు కొనసాగనున్న విజయ సంకల్ప యాత్రలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని నరేంద్ర మోదీ గారిని మూడోసారి ప్రధానిగా చేసుకునే సంకల్పంలో ప్రతి ఒక్కరం భాగస్వామ్యమవ్వాలని దుగ్యాల ప్రదీప్ కుమార్ గారు పిలుపునిచ్చారు.

By NYALAKONDA ANIL DESAI | February 21, 2024 | 0 Comments

మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి

కుంభమేళా శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు కన్నెపెల్లి లో సారలమ్మ ప్రధాన పూజారిని పరామర్శించిన మంత్రి సీతక్క శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసి మ్యూజియం లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం -నేటి నుంచి మహా ఘట్టం వనం నుండి జనం లోకి వన దేవతలు -భక్తులకు దర్శనం ఇబ్బందులు లేకుండా క్యు లైన్లు ఏర్పాటు చేశాం -సామాన్య ప్రజలే మకు విఐపి వీవీఐపీలు లు -మేడారం వచ్చే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పిస్తుంది -ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకుంటారు

By NYALAKONDA ANIL DESAI | February 21, 2024 | 0 Comments

మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి

మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి -ఆదివాసి కుంభమేళా శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు కన్నెపెల్లి లో సారలమ్మ ప్రధాన పూజారిని పరామర్శించిన మంత్రి సీతక్క శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసి మ్యూజియం లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం -నేటి నుంచి మహా ఘట్టం వనం నుండి జనం లోకి వన దేవతలు -భక్తులకు దర్శనం ఇబ్బందులు లేకుండా క్యు లైన్లు ఏర్పాటు చేశాం -సామాన్య ప్రజలే మకు విఐపి వీవీఐపీలు లు -మేడారం వచ్చే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పిస్తుంది -ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకుంటారు

By NYALAKONDA ANIL DESAI | February 21, 2024 | 0 Comments

భారీ భద్రత మద్య మేడారం హుండీల లెక్కింపు

హనుమకొండ జిల్లా మేడారం మహా జాతరకు సంబంధించి భక్తుల సమర్పించిన కానుకలను దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో భారీ భద్రత నడుమ సీసీటీవీ నిఘాలో నేడు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. సుమారు 518 హుండీలను 10రోజులపాటు లెక్కించనున్నారు. కాగా లెక్కించిన నగదును ఏ రోజుకు ఆ రోజు బ్యాంకులో జమ చేయనున్నఅధికారులు. ఈసారి మేడారం ఆదాయం పెరగొచ్చు అని అధికారులు అంచనా వేస్తున్నారు...

By NYALAKONDA ANIL DESAI | February 29, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1