సీఎం రేవంత్ రెడ్డి మరొక పదేళ్లు సీఎం గా ఉండాలని, దానికి వాతావరణం సహకరించలని కోరుతు సమ్మక్క సారక్క ల వరకు యాత్ర నిర్వహిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత ఓయూ జేఏసీ చైర్మన్ ఒరుగంటి కృష్ణ అన్నారు.ఆదివారం సాయంత్రం ఓయూ నుండి సమ్మక్క సారక్క వరకు ఒరుగంటి కృష్ణ ఆధ్వర్యంలో పాదయాత్ర ను ఆర్ట్స్ కళాశాల వద్ద నుండి ప్రారంభించారు.గత ప్రభుత్వం రాష్ట్ర ఖజాన మొత్తం ఖాళీ చేసి కుటుంభం కుటుంభం మొత్తం ఆస్తులు సంపాదించుకొని ఆర్ధిక వ్యవస్థను దివాళా తీయించిన గొప్ప కుటుంభం కేసీఆర్ అన్నారు. ఇవ్వాళ్ళ గాడి తప్పిన ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేస్తు ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు చిత్తశుద్ధితో అమలు చేస్తున్న దూరదృష్టి గల సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు మానుకొని అహంకారం అనుచుకొని బి ఆర్ ఎస్ నేతలు వ్యహరించకుంటే ప్రజలు బుద్ది చెప్పడం తథ్యం అన్నారు.కార్యక్రమంలో సురేష్, లాల్ ,యాదగిరి, నరసింహ, సురేష్, సాయి, యాదగిరి, నగేష్, వంశీ, తో పాటు ఓయూ విద్యార్థులు పాల్గొన్నారు. ( పాదయాత్ర చేస్తున్న ఒరుగంటి కృష్ణ )
Comments 0