రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీడీవో గా బి. చిరంజీవి బాధ్యతలు స్వీకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ నుండి రాయికల్ మండలానికి బదిలీ పై వచ్చి బాధ్యతలు స్వీకరించినారు. ఈ సందర్భంగా ఎంపీడీవో చిరంజీవి మాట్లాడుతూ ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా వచ్చి తమకు తెలియజేయాలని వాటిని పరిష్కరించే దిశగా తాము కృషి చేయడం జరుగుతుందని అన్నారు. మండలంలోని అధికారులు ప్రజాప్రతినిధులు సహకరించాలని అన్నారు.