జనంగొంతు/గోదావరిఖని/అంబటి సతీష్ / భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారుల జాబితా సోమవారం సాయంత్రం ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ విడుదల చేశారు.పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన కాజీపేట శివాజీని ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించినారు. కాసిపేట శివాజీ గత 15 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ లో వివిధ బాధ్యతలో చురుకుగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి ఎంతో గాని కృషి చేసినందుకు గాను రాష్ట్ర కోశాధికారి నుండి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది అని శివాజీ తెలియజేశారు. ఈ బాధ్యతను అప్పగించినందుకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి మరియు రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.