మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సెక్యులరిజం’ మీకు మర్కజ్ రవి అనే పేరు గుర్తుందా? మర్కజ్ అంటే ముస్లిముల మతపరమైన సమావేశం. రవి అనేది సాధారణంగా హిందువులు పెట్టుకునే పేరు. అలాంటిది ఆ రెండింటికీ ముడి ఎలా పడింది? తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికగా చెప్పుకునే ఈనాడు, మర్కజ్ సమావేశానికీ రవి అనే వ్యక్తికీ ముడి పెట్టింది. ‘మర్కజ్ రవి’ కథ: కోవిడ్ మహమ్మారి ప్రారంభ దశలో ఉన్న సమయంలో, అంటే 2020 మార్చి 13న ఢిల్లీలో జరిగిన ముస్లిముల సమావేశం (మర్కజ్) జరిగింది. దానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి కొన్ని వేలమంది వెళ్ళారు. వారిలో చాలామందికి కరోనా వ్యాధి సోకింది. వారి ద్వారా మరికొన్ని వేల మందికి ఆ మహమ్మారి సోకింది. అలా ఢిల్లీ వెళ్ళిన వారిలో హైదరాబాద్ అమీర్పేట్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. సహజంగానే, అతనొక ముస్లిం వ్యక్తి. మార్చి 13న జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆ వ్యక్తి, మార్చి 18న హైదరాబాద్కు తిరిగి వచ్చాడు. 14 రోజుల హోం క్వారంటైన్లో ఉన్నాడు. క్వారంటైన్ పూర్తయిన కొద్ది రోజులకు పరీక్షలు చేసినప్పుడు అతనికి అనూహ్యంగా కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. అతని ద్వారా మరెంతో మందికి ఆ మహమ్మారి సోకింది. 12 ఆ సంఘటనకు సంబంధించి ఈనాడు పత్రిక ప్రచురించిన వార్తలో ఆ వ్యక్తి పేరు ‘రవి’ అని రాసింది. మర్కజ్ కోసం ‘రవి’ ఢిల్లీ వెళ్ళి వచ్చాడనీ, అతనికి కోవిడ్ సోకిందనీ రాసుకొచ్చింది. అయితే మర్కజ్ అంటే ముస్లిముల మతపరమైన సమావేశం అన్న సంగతిని మాత్రం రాయలేదు. ఆ సమావేశానికి వెళ్ళిన వ్యక్తి ఒక ముస్లిం అని రాయలేదు. బాధితుల పేర్లు బైటపెట్టకూడదు అనే నియమం ప్రకారం సదరు కోవిడ్ సోకిన వ్యక్తి పేరును మార్చి రాసారు, ఆ విషయాన్ని వెల్లడించారు. అయితే ముస్లిం వ్యక్తికి హిందూ పేరు పెట్టడం దేనికి సంకేతం? అతను వెళ్ళిన సమావేశం ముస్లిం మతానికి సంబంధించినది అన్న విషయం మెజారిటీ ప్రజలకు తెలియని తెలుగు రాష్ట్రాల్లో చెలామణీలో ఉన్న ఆ దినపత్రిక, సదరు వ్యక్తికి హిందూ పేరు పెట్టడం వల్ల జనాల్లో ఏ రకమైన అభిప్రాయం కలుగుతుంది? నిందితుల పేర్లు దాచడం దేనికి? హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల్లోని పత్రికల్లో ముస్లిం ప్రాబల్యం ఉండే ప్రాంతాల్లో కొన్ని రకాల నేర వార్తలు ప్రచురితమవుతుంటాయి. వాటిలో ఒక తాంత్రికుడు మహిళలకు దయ్యాలు వదులుస్తానని నమ్మించి వారిని లైంగికంగా లోబరచుకోవడం, వేధించుకోవడం లాంటి వార్తలు తరచుగా కనిపిస్తాయి. హైదరాబాద్ పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో అలాంటి వార్తలు వెలుగు చూస్తుంటాయి. అలాంటి వార్తలను నిశితంగా చూస్తే, చాలా వరకూ కేసుల్లో సదరు తాంత్రికుడు ముస్లిం వ్యక్తి అయి ఉంటాడు. కానీ పత్రికలు మాత్రం ఉద్దేశ పూర్వకంగా తాంత్రికుడు, బాబా అనే పదాలు ఉపయోగించి, ఆ వార్తను ప్రచురిస్తాయి. అలాంటి సంఘటనలు సర్వసాధారణం అయిపోయాయి. ‘కొన్ని రకాల వార్తల్లో బాధితుడి పేరు బైటపెట్టకూడదు’ అనే నియమం మంచిదే. కానీ ఆ పేరు హిందువుదే ఎందుకు అయి ఉంటుంది? ఏ క్రైస్తవ పేరో లేక ముస్లిం పేరో అయి ఉండవచ్చు కదా… అలా మాత్రం జరగదు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి మర్కజ్ కరోనా కేసులో బాధితుడి పేరు బైట పెట్టకూడదంటే ఏ అబ్దుల్ అనో కరీం అనో నయీం అనో పెట్టవచ్చు కదా… అలా రాయలేదు. అలాగే తంత్రగాళ్ళు, దొంగ బాబాలు అని రాసే బదులు ఫకీర్, మౌల్వీ, మౌలానా అనే పదాలు వాడవచ్చు కదా. అలాగే క్రైస్తవ పాదరీల అకృత్యాల గురించి రాసేటప్పుడు కూడా మతగురువు అని రాస్తారు. అదంతా ఏంటంటే… హిందూ మత పెద్దలు దొంగలు, మోసగాళ్ళు, నేరగాళ్ళు అని పరోక్షంగా ప్రచారం చేయడం… హిందూ మతానికి చెందిన వాళ్ళ గురించి స్వయంగా హిందూ మతస్తులలోనే నమ్మకం లేకుండా చేయడం. అది ఉద్దేశపూర్వకమా, యాదృచ్ఛికమా అన్నది చెప్పడం కష్టమే. కానీ మౌలికంగా పాఠకుల మనసుల్లో హిందూ మతం అంటే ఒక రకమైన తేలిక భావం, చులకన భావం, క్రమంగా హిందుత్వం అంటే విముఖత కలిగేలా అలాంటి వార్తలు ఉంటున్నాయి. ఈ రకమైన ప్రచారం కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామమే. రకరకాల నేరాలకు పాల్పడిన ముస్లిం పీర్లు, మౌలానాలు, ఫకీర్లను తాంత్రికుడు లేక బాబా అని వ్యవహరిస్తూ వార్తలు రాసిన సందర్భాలు కోకొల్లలు. అలాంటి రాతలను చదివే పాఠకుల మనసుల్లో హిందూ మతగురువుల పట్ల విద్వేష భావం పెచ్చరిల్లుతుంది. అలాంటి కొన్ని ప్రధానమైన సంఘటనల వివరాలు చూద్దాం…. (1) మంద్సౌర్, మధ్యప్రదేశ్: ముబారక్ మన్సూరీ అనే వ్యక్తి చేతబడి, బాణావతి వంటి వాటిని వదిలిస్తాననే సాకుతో హిందూ మహిళలను లొంగదీసుకునేవాడు. వారితో అనునయంగా మాట్లాడి ప్రేమ ముగ్గులోకి దింపేవాడు. బాధిత మహిళలకు తెలియకుండా వారికి మత్తు పదార్ధాలు ఇచ్చేవాడు. వారు తెలివి కోల్పోయాక వారిని మానభంగం చేసేవాడు. అలా కనీసం 50 మంది మహిళలను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 2025 మే 20న ఒక బాధిత మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో పోలీసులు మే 22న అతని ఇంట్లో సోదాలు చేసారు. ఆ రోజే అతన్ని అరెస్ట్ చేసారు. మే 24న కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కణ్ణుంచి జైలుకు పంపించారు. మంద్సౌర్ జిల్లాలో సంచలనం కలిగించిన ఈ కేసు గురించి మే 29న ప్రముఖ హిందీ పత్రిక దైనిక్ భాస్కర్ ఒక కథనం ప్రచురించింది. ‘‘తాంత్రికుడి వేటుకు బలైన 40-50 మంది మహిళలు’’ అన్నది ఆ కథనం శీర్షిక. ఎంపీ 44 న్యూస్ అనే స్థానిక న్యూస్ ఛానెల్ కూడా అలాగే హెడ్లైన్ పెట్టింది. ‘‘భర్తపై పిచ్చివాడు అనే ముద్ర వేసి మహిళను లైంగికంగా వేధించిన తాంత్రికుడు’’ అన్నది ఆ ఛానెల్ శీర్షిక. స్టేట్ మిర్రర్ అనే పత్రిక ‘‘మంత్ర తంత్రాల పేరుతో ప్రేమ వల : 40-50 మంది హిందూ మహిళలపై అత్యాచారం చేసిన తాంత్రికుడు’’ అనే కథనాన్ని ప్రచురించింది. (2) మేరఠ్, ఉత్తరప్రదేశ్: చేతబడి వదిలిస్తానంటూ రషీద్ ఖాన్ అనే వ్యక్తి 17 ఏళ్ళ హిందూ బాలికను లొంగదీసుకున్నాడు. ఆ అమ్మాయి తెచ్చిన కొన్ని లక్షల రూపాయల నగదు, ఆభరణాలూ, విలువైన వస్తువులూ తీసుకున్నాడు. తర్వాత ఈ అమ్మాయిని వదిలిపెట్టి పరారైపోయాడు. అతని అకృత్యాలు వెలుగు చూడడంతో, రషీద్ ఖాన్ పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు ఈ యేడాది జనవరి 25న అతన్ని, అతని సహాయకులు ముగ్గురినీ అరెస్ట్ చేసారు. ఆ సంఘటన గురించి ఈటీవీ భారత్ 2025 జనవరి 11న కథనం ప్రసారం చేసింది. దానికి ‘‘మేరఠ్లో మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన మంత్రగాడు, మంత్ర తంత్రాల పేరిట నగదు, నగలతో పరారీ’’ అని హెడ్లైన్ పెట్టింది. అదే రోజు ‘దైనిక్ భాస్కర్’ పత్రిక దాదాపు అలాంటి పతాక శీర్షికతోనే కథనం ప్రచురించింది. ‘‘మేరఠ్లో మైనర్ అమ్మాయి కిడ్నాప్, దుష్టశక్తుల నుంచి కాపాడే పూజల పేరుతో లొంగదీసుకున్న మంత్రగాడు, 6 లక్షల నగదు, ఆభరణాలూ ఎత్తుకుపోయాడు’’ అని ఆ శీర్షిక. ఆజ్తక్ ఛానెల్ 2025 జనవరి 12న కథనం ప్రసారం చేసింది. దాని హెడ్లైన్ ‘‘మైనర్ అమ్మాయిని లేపుకుపోయిన మంత్రగాడు, అతనికి ఆరుగురు పిల్లలు’’. అదే రషీద్ ఖాన్ కేసు గురించి టీవీ9 భారత్వర్ష్ 2025 జనవరి 13న కథనం ప్రసారం చేసింది. దాని శీర్షిక ‘’17 ఏళ్ళ అమ్మాయిని మంత్రగాడు అర్ధరాత్రి పిలిపించుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మర్నాడు పెద్ద గొడవ జరిగింది. ఎందుకో తెలుసా?’’ ఆ కథనానికి సంబంధించిన థంబ్నెయిల్లో పట్టుపంచె కట్టుకున్న ఓ వ్యక్తి ఓ అమ్మాయి నెత్తిమీద చెయ్యి పెట్టి ఉన్నట్లు ప్రచురించారు. దాన్ని చూస్తే ఓ హిందూ మాంత్రికుడు అమ్మాయిని ఏదో చేస్తున్నాడు అనే ఉద్దేశం కలిగేలా ఉంది. ఇంకా మరిన్ని మీడియా సంస్థలు ఆ కథనం గురించి అలాగే ప్రచారం చేసాయి. నిజానికి రషీద్ ఖాన్ ముస్లిమే తప్ప హిందువు కాదు. హిందూ బాలికలను ఆకట్టుకుని ప్రలోభపెట్టి వారిని లొంగదీసుకుని నగలు, నగదు ఎత్తుకుపోవడం అతని పద్ధతి. మీడియా సంస్థలు మాత్రం మైనర్ అమ్మాయిని ఎత్తుకుని పోయిన మాంత్రికుడు/మంత్రగాడు అన్న కోణంలో కథనం ప్రసారం చేసారు. (3) ఢిల్లీ: ఇది 2024 ఆగస్టు నాటి ఘటన. మహమ్మద్ షరీఫ్ అనే దుర్మార్గుడు 12ఏళ్ళ అమ్మాయిని శ్మశానంలోకి తీసుకెళ్ళి ఆ చిన్నారిని మానభంగం చేసాడు. ఆ చిన్నపిల్లకు దెయ్యం పట్టిందని, దానివల్లనే ఆమె తండ్రికి అనారోగ్యం కలిగిందని, ఆ దెయ్యాన్ని వదిలిస్తాననీ నమ్మబలికి ఆ బాలికను శ్మశానానికి తీసుకువెళ్ళాడు. వాడే ఒక దెయ్యంగా మారి ఆ చిన్నారి జీవితాన్ని బుగ్గిపాలు చేసాడు. పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి నిందితుడు షరీఫ్ను అరెస్ట్ చేసారు. మీడియా యధావిధిగా ఈ కేసు విషయంలో కూడా నిందితుడు ముస్లిం మతస్తుడు అనే విషయం తెలియకుండా జాగ్రత్త పడింది. అమర్ ఉజాలా ఆగస్టు 28న ప్రచురించిన వార్తకు ‘పన్నెండేళ్ళ బాలికపై మంత్రగాడి ఘాతుకం, తండ్రి జబ్బు నయం చేస్తానని చెప్పి దారుణం’ అని పతాకశీర్షిక ఉంచింది. ఇండియా టుడే పత్రిక కూడా అదేరోజు ‘చేతబడికి విరుగుడు పేరిట చిన్నారిపై శ్మశానంలో అఘాయిత్యానికి పాల్పడిన ఢిల్లీ మంత్రగాడు’ అనే శీర్షికతో వార్త ప్రచురించింది. ఏబీపీ న్యూస్ ఛానెల్ ఆగస్ట్ 29న ప్రసారం చేసిన వార్తకు ‘ఢిల్లీలో మంత్రగాడి దారుణం, శ్మశానంలో 12ఏళ్ళ చిన్నారి బాలికపై బలాత్కారం, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపు’ అని హెడ్లైన్ పెట్టింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ‘12ఏళ్ళ చిన్నారిని చిదిమేసిన 52ఏళ్ళ మాంత్రికుడి అరెస్ట్’ అనే శీర్షికతో వార్త ప్రచురించింది. దాని సోదర సంస్థ ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్’12 ఏళ్ళ అమ్మాయిని లైంగికంగా వేధించిన మంత్రగాణ్ణి పట్టుకున్న పోలీసులు’ అని హెడ్లైన్ పెట్టింది. (4) ముంబై, మహారాష్ట్ర: మెహదీ కాశిం షేక్ అలియాస్ మెహదీ హసన్ ఆరుగురు మైనర్ బాలికలు సహా ఏడుగురు అమ్మాయిలను రేప్ చేసాడు. ఈ కేసులో కూడా నిందితుడు మంత్రతంత్రాల పేరుతో జనాలను మోసం చేసాడు. నవంబర్ 2010లో నిందితుణ్ణి పోలీసులు అరెస్ట్ చేసారు. 2016 ఏప్రిల్లో జీవిత ఖైదు శిక్ష పడింది. ఆ వార్త గురించి 2016 ఏప్రిల్ 13న నవభారత్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. ‘‘ఆరుగురు మైనర్లు సహా ఏడుగురిని రేప్ చేసిన ‘బాబా’కు జీవిత ఖైదు’’ అన్నది దాని శీర్షిక. తర్వాత 2024 మార్చి 4న లైవ్ లా వెబ్సైట్లో ఆ ఘటన గురించి ఒక కథనం ప్రచురించారు. మెహదీ కాశిం షేక్కు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను బొంబాయి హైకోర్టు సమర్థిస్తూ తీర్పునిచ్చిన సందర్భం అది. అప్పుడు ప్రచురించిన ఆ కథనానికి ‘‘ప్రజల మూఢ విశ్వాసాల నుంచి లబ్ధి పొందే బాబా’’ అని హెడ్డింగ్ పెట్టింది. 2024 మార్చి 5న టీవీ9 భారత్వర్ష ఛానెల్ కథనం ప్రసారం చేసింది. దానికి ‘‘మంత్ర తంత్రాల తర్వాత రేప్ చేస్తాడు… ఆరుగురు చిన్నపిల్లలని రేప్ చేసిన మంత్రగాడు… ఇకపై జీవితమంతా జైల్లోనే’’ అని హెడ్లైన్ పెట్టింది. (5) ముంబై, మహారాష్ట్ర అబూబకర్ మొహమ్మద్ అలీ షేక్ పంథా చాలా తేడా. క్యాన్సర్ తగ్గించేస్తా అని హామీలు ఇచ్చేస్తాడు. అమెరికా వీసా ఇప్పించడానికి సాయం చేస్తా అంటాడు. మాటలతో కోటలు కట్టేస్తాడు. ఇతని బాధితుల్లో అత్యధికులు ముస్లిం మహిళలే ఉండడం గమనార్హం. 2024లో అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసారు. ఆ వార్తను హిందుస్తాన్ టైమ్స్ పత్రిక 2024 ఫిబ్రవరి 1న ప్రచురించింది. దానికి పెట్టిన శీర్షికలో యధావిధిగా మంత్రగాడు అని పేర్కొంది. ‘క్యాన్సర్ నయం చేస్తా, యుఎస్ వీసా ఇప్పిస్తా అంటూ మహిళలను మోసం చేసినందుకు మంత్రగాడి అరెస్ట్’ అన్నది ఆ శీర్షిక. (6) అమ్రోహా, యూపీ: గుర్తు తెలియని వ్యాధికి చికిత్స చేస్తామంటూ ఒక పదిహేనేళ్ళ బాలికను గ్యాంగ్రేప్ చేసారు నలుగురు దుర్మార్గులు. ఆ సంఘటన 2021 జులైలో జరిగింది. నిందితుల పేర్లు అఫ్జల్ మలిక్, తారిక్, అస్లమ్, జుల్ఫికర్. వాళ్ళు నలుగురూ ముస్లిములే అయినప్పటికీ హెడ్లైన్స్ చదివితే లేక వింటే ‘వాళ్ళెవరో హిందువులే ఆ ఘాతుకానికి పాల్పడ్డారు’ అని ప్రజలు పొరబడడం ఖాయం. 2021 జులై 6న ‘లైవ్ హిందుస్తాన్’ ఛానెల్లో ఈ నేరం గురించిన వార్త ప్రసారం చేసారు. ‘‘తంత్ర మంత్రాలతో రోగాలు తగ్గిస్తామంటూ అమ్రోహాలో బాలిక మానభంగం, నలుగురు దుండగులపై కేసు నమోదు, దర్యాప్తు మొదలు’’ అని హెడ్లైన్ పెట్టారు. అలా నేరస్తులను మాంత్రికులుగా పరిచయం చేయడం ద్వారా వారు హిందూ మతస్తులు అనే భ్రమ కలిగించారు. జులై 7న ఆజ్తక్లోనూ అదే రకమైన కథనం ప్రసారమైంది. ‘‘చికిత్స పేరుతో మైనర్ బాలికను గ్యాంగ్రేప్ చేసిన మాంత్రికులు, పరారీలో నిందితులు’’ అన్నది దాని హెడ్లైన్. జులై 7నే టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఈ కథనాన్ని ప్రచురించింది. ‘‘రోగంతో బాధపడుతున్న 15ఏళ్ళ అమ్మాయిపై బలాత్కారం చేసిన మంత్రగాడు, అతని శిష్యులు’’ అన్నది వారి హెడ్లైన్. టైమ్స్ నౌ ఛానెల్ కూడా తక్కువేమీ తినలేదు. ‘‘చికిత్స సాకుతో అమ్రోహా అమ్మాయిని రేప్ చేసిన మేరఠ్ మంత్రగాడు’’ అనే హెడ్లైన్తో జులై 7న కథనం ప్రసారం చేసింది. (7) లఖ్నవూ, ఉత్తరప్రదేశ్: 2020లో లఖ్నవూ నగరంలో ఓ మజార్లో సెక్స్ రాకెట్ పట్టుబడింది. మజార్ అంటే అరబిక్లో సమాధి క్షేత్రం అని అర్ధం. ముస్లిములు తాము గొప్పవారిగా భావించే వారి సమాధులను పుణ్యక్షేత్రాలుగా భావించి అక్కడ ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి చోట పనిచేస్తున్న నాసిర్ అక్కడకు వచ్చే మహిళలను చికిత్స పేరిట లైంగికంగా వేధించేవాడు. అంతేకాదు, ఆ మజార్లోనే వ్యభిచార ముఠా కూడా నడుపుతూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. దాంతో పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసి నాసిర్ను అరెస్ట్ చేసారు. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఆ వార్తను ప్రచురించింది. షరా మామూలుగానే ఆ కథనానికి ‘‘మంత్రగాడి లైంగిక వేధింపుల వీడియో వైరల్ అవడంతో అరెస్టు చేసిన పోలీసులు’’ అనే హెడ్లైన్ పెట్టింది. (8) నయాపురా, మధ్యప్రదేశ్: 2020 జూన్ నెల. అంటే కోవిడ్ మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయం. మధ్యప్రదేశ్ రత్లాం జిల్లాలోని నయాపురా ప్రాంతంలో అస్లం అనే ఒక ముస్లిం గురువు ఉండేవాడు. అతను ఎవరి చేతి మీద ముద్దు పెట్టుకుంటే వాళ్ళకి కరోనా వైరస్ సోకదు అని ప్రచారం చేసుకున్నాడు. దాంతో అతన్ని నమ్మే భక్తులు ఎగబడి వెళ్ళారు. అతని చేతిని ముద్దాడి తమకు కరోనా వైరస్ సోకదు అనే నమ్మకంతో ఆనందంగా ఉన్నారు. అయితే, అస్లంకే కరోనా వైరస్ సోకినట్లు తెలిసింది. అంతే కాదు, కోవిడ్ మహమ్మారి కారణంగా అస్లం 2020 జూన్ 4న చనిపోయాడు. అస్లం మరణంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అతని దగ్గరకు వచ్చేవారి వివరాలు కనుక్కుని వారందరికీ టెస్టులు చేయించారు. ఆ పరీక్షల్లో 29మందికి కరోనా వైరస్ సోకిందని వెల్లడైంది. అస్లం సంఘటన తర్వాత నయాపురా, రత్లాం ప్రాంతాల్లో ఇలాంటి ముస్లిం గురువులు 37మందిని క్వారంటైన్ చేసారు. ఇంత ప్రమాదకరమైన సంఘటన విషయంలో కూడా సదరు వ్యక్తి ముస్లిం అన్న విషయాన్ని మీడియా యథాశక్తి దాచిపెట్టింది. ‘చేతి మీద ముద్దు పెట్టే బాబా’ అనే కోణానికే ప్రాధాన్యం ఇచ్చింది. బాబాలు, గురువుల్లో ఇలాంటి మోసగాళ్ళు మాత్రమే ఉంటారు అనే భావన ప్రజల్లో కలిగించేలా చేసింది. వారు ముస్లిములు అనే విషయాన్ని దాచిపెట్టడం ద్వారా హిందూ మత గురువులు, బాబాలు మాత్రమే అలాంటి పనులు చేస్తారని పరోక్షంగా అర్ధమయేలా చేసింది. ప్రభాత్ ఖబర్ పత్రిక ‘‘చేతిని ముద్దాడి కరోనాకు బాబా చికిత్స, ఆయన దగ్గరకు వెళ్ళిన 19మందికి కరోనా పాజిటివ్, ప్రజల్లో భయాందోళనలు’’ అనే శీర్షిక పెట్టింది. ఆజ్తక్ ఛానెల్ ‘‘చేతిమీద ముద్దుపెట్టి ‘వైద్యం’ చేసే బాబా కరోనాతో మృతి, 29మంది భక్తులకూ కరోనా పాజిటివ్’’ అని హెడ్లైన్ రన్ చేసింది. ఎన్డిటివి ఇండియా ఛానెల్ ‘‘చేతిమీద ముద్దుతో చికిత్స చేసే మంత్రగాడు కరోనాతో మృతి, ఆయననుంచి 23మందికి సంక్రమించిన కోవిడ్, మరో 37మంది బాబాలను క్వారంటైన్ చేసిన యంత్రాంగం’’ అని శీర్షిక ఉంచింది. (9) నదియా, పశ్చిమ బెంగాల్: బెంగాల్లోని నదియా జిల్లా కామ్ఠాల్బేరియా గ్రామంలో అల్పనా బీబీ అనే ఒక ఆడ ముస్లిం ఫకీర్ ఉండేది. మంత్రతంత్రాలతో చికిత్స చేస్తానంటూ ఆమె ప్రజలను ఆకట్టుకునేది. 2019 సెప్టెంబర్లో అర్ఫినా బీబీ అనే మహిళ తన పిల్లలను అల్పనా బీబీ దగ్గరకు తీసుకువెళ్ళింది. పదేళ్ళ పిల్లవాడు జాన్ నబీ షేక్, ఆరేళ్ళ పిల్లవాడు జహంగీర్ షేక్లకు ఆమె చికిత్స చేసింది. అయితే జాన్ నబీ షేక్ చనిపోయాడు. జహంగీర్కు ఒళ్ళంతా గాయాలయ్యాయి. పిల్లలను తీసుకువెళ్ళడానికి వచ్చిన తల్లిదండ్రులు ఆ విషయం తెలిసి నిర్ఘాంత పోయారు. ఆ పిల్లల శరీరాలను తనిఖీ చేస్తే… వాళ్ళ వీపుల మీద కాలిన గాయాలు ఉన్నాయి. ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే అల్పనా బీబీ చికిత్ పేరిట ఆ పిల్లల వీపుల మీద వేడివేడి నూనె పోసింది. దాని మీద కారం చల్లింది. ఆ మంట తట్టుకోలేక జాన్ నబీ షేక్ ప్రాణాలు వదిలేసాడు. విషయం బైటపడేసరికి కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితురాలు అల్పనా బీబీని అరెస్ట్ చేసారు. మీడియా తన పని తాను చేసుకుంటూ పోయింది. నిందితురాలి ఉనికిని దాచిపెట్టి ఓ మంత్రగత్తె అంటూ ముద్ర వేసేసింది. ‘‘పశ్చిమ బెంగాల్లో మైనర్ బాలుడి మరణం, మంత్రగత్తె అరెస్ట్’’ శీర్షికతో హిందుస్తాన్ టైమ్స్ పత్రిక వార్త ప్రచురించింది. ‘‘తంత్ర పూజల కారణంగా పశ్చిమ బెంగాల్లో పదేళ్ళ బాలుడి మరణం’’ అని ఎన్డీటీవీ ఛానెల్ కథనాన్ని ప్రసారం చేసింది. ‘‘పదేళ్ళ బాలుడి మరణంతో మంత్రగత్తె అరెస్ట్’’ అని ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది. యథావిధిగా ఈ మీడియా సంస్థలన్నీ నిందితురాలు ముస్లిం మహిళ అన్న విషయాన్ని దాచి పెట్టాయి. (10) బిలాస్పూర్, ఛత్తీస్గఢ్: 2019 మే నెలలో సంఘటన ఇది. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్కు చెందిన ఒక 34 ఏళ్ళ మహిళకు భర్తతో విభేదాలు వచ్చాయి, అతను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా మరికొన్ని కుటుంబ సమస్యలూ ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం ఆమె అస్లం ఫైజీ అలియాస్ సుహైల్ రజా అనే 28 ఏళ్ళ మౌల్వీని ఆశ్రయించింది. అతను ఆవిడ సమస్యను పరిష్కరిస్తానని మాటిచ్చాడు. ఆ క్రమంలో మౌల్వీ దగ్గరకు వెడుతుండేది. దాన్ని అలుసుగా తీసుకున్న ఆ మౌల్వీ, ఆ మహిళను బెదిరించి ఆమెపై అఘాయిత్యం చేసాడు. కొన్ని రోజుల్లోనే ఆమె సమస్యలు పరిష్కారమైపోతాయి అని మభ్యపెట్టాడు. మౌల్వీ చెప్పిన గడువు గడిచిపోయినా ఆ మహిళ భర్త తిరిగి రానూ లేదు, ఆమె కుటుంబ సమస్యలూ పరిష్కారం కాలేదు. మౌల్వీ తనను మోసం చేసాడనీ, శారీరకంగా వాడుకున్నాడనీ అర్ధమయ్యాక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మౌల్వీని అరెస్ట్ చేసారు. ఈ వార్తను నయీ దునియా పత్రిక 2019 మే 26న ప్రచురించింది. యధావిధిగా, మహిళపై అఘాయిత్యం చేసిన మంత్రగాడు అని రాసుకొచ్చింది. అంతే కాదు, ఆ కథనానికి వాడిన బొమ్మలో రుద్రాక్షలు ధరించి, పట్టుబట్టలు కట్టుకుని నుదుట కుంకుమ బొట్టు పెట్టుకున్న వ్యక్తి చిత్రాన్ని ప్రచురించింది. అంటే హిందూ మంత్రగాడు మహిళను లోబరచుకుని బలవంతంగా ఆమెను అనుభవించాడు అనే అర్ధం వచ్చేలా ఆ కథనం చెప్పకనే చెప్పింది. (11) హర్యానా: గుర్గావ్ సమీపంలోని సోహ్నా గ్రామానికి చెందిన దీన్ మొహమ్మద్ అలియాస్ దీనూ వయసు 65 ఏళ్ళు. అతనికి ముగ్గురు భార్యలు, పది మంది సంతానం ఉన్నారు. 2002లో అతను స్థానిక గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగానూ పని చేసాడు. తనకు దెయ్యాలు భూతాలను వదిలించగల శక్తి ఉందని, అనారోగ్యాలను బాగు చేస్తానంటూ చెప్పుకుంటూ దీనూ ఆడవాళ్ళను ఆకట్టుకునేవాడు. వాళ్ళను లైంగికంగా వేధించేవాడు. తమ చెడు అనుభవాల గురించి బైటకు చెప్పుకోలేని మహిళలు మౌనంగా ఉండిపోయారు. 2016లో ఒక 19 ఏళ్ళ యువతికి అనారోగ్యంతో బాధ పడుతుంటే తల్లిదండ్రులు ఆమెను దీనూ దగ్గరకు తీసుకువెళ్ళారు. యువతి అనారోగ్యాన్ని తగ్గిస్తాననే వంకతో దీనూ ఆమెను పలుమార్లు బలాత్కరించాడు. అంతే కాదు, ఆ యువతిని చికిత్స కోసం తీసుకువెళ్ళిన ప్రతీసారీ ఆమె తండ్రి దగ్గర నుంచి రూ. 5వేలు వసూలు చేసేవాడు. చివరికి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు 2016 జులై 31న సదర్ గుర్గావ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. దాని ఆధారంగా పోలీసులు దీన్ మొహమ్మద్ను, అతనికి సహకరించిన దరాబ్ ఖాన్ అనే అనుచరుణ్ణీ అరెస్ట్ చేసారు. ఈ నేర వార్తను మీడియా యధావిధిగా మంత్రగాడు, మాంత్రికుడు చేసిన నేరం అనే కోణంలోనే ప్రచురించింది. పైగా రుద్రాక్ష మాలలు ధరించి, బొట్టు పెట్టుకున్న మనిషి బొమ్మలు ముద్రించడం ద్వారా నేరస్తుడు ఒక హిందూ మంత్రగాడు అనేలా ప్రజల్లోకి విషయం వెళ్ళేలా చేసారు. ఇంక పతాక శీర్షికల్లో కూడా మంత్రగాడు అనే పద ప్రయోగంతో ఎవరో హిందువే నేరానికి పాల్పడ్డాడు అనే భావం కలిగేలా రాసుకొచ్చారు. బిజినెస్ స్టాండర్డ్, ఇండియాటుడే పత్రికలు ‘‘హర్యానాలో టీనేజ్ యువతిని రేప్ చేసిన మంత్రగాడి అరెస్ట్’’ అని హెడ్లైన్ పెట్టాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా ఒకడుగు ముందుకువేసి ‘‘పదిమంది పిల్లల తండ్రి అయిన గుర్గావ్ మంత్రగాణ్ణి యువతి రేప్ కేసులో అదుపులోకి తీసుకున్నారు’’ అని రాసుకొచ్చింది. ఉపసంహారం: ఈ వార్తలన్నీ చూస్తే మనకు అర్ధమయ్యేది ఒకటే. ఈ దేశపు మీడియాకు హిందువులంటే ప్రేమ లేదు. ముస్లిములు చేసిన అకృత్యాలను సెక్యులరిజం ముసుగులో దాచి పెడతారు. చాలా సందర్భాల్లో మాత్రం హిందువులే ఆ నేరాలకు పాల్పడ్డారా అనే అనుమానాలు కలిగేలా చేస్తారు. అలాంటి సంఘటనల విషయంలో పాత్రికేయులు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది.
*ఒక పత్రిక 10 వేల సైన్యం తో సమానం... *వాదాల పేరుతో వాస్తవాలు మరుగున పడుతున్నాయి.. ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ జి... 1948 లో ప్రారంభమై 77 ఏళ్ళుగా వెలుబడుతున్న ఏకైక జాతీయవాద పత్రిక, గర్వించదగిన తెలుగు వార పత్రిక జాగృతి అని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ జితెలిపారు.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్ ) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వార పత్రిక జాగృతి పాఠకుల ఆత్మీయ సమ్మేళనము బుధవారం రోజున సాయంత్రం కరీంనగర్ పట్టణంలోని కలెక్టరేట్ ఎదురుగా గల రెవెన్యూ గార్డెన్స్ లో జరిగింది. ఇట్టి ప్రోగ్రాం కు ముఖ్య వక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ తెలుగు పత్రికల చరిత్ర నిస్సందేహంగా ఘనమైందన్నారు. ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమంలో పత్రికలు ప్రముఖపాత్రనుపోషించాయన్నారు. ఆ రోజుల్లో ఆంధ్ర పత్రిక, కృష్ణ పత్రిక, ఇండియన్ ఎక్స్ ప్రెస్ , ఆంధ్రప్రభ లాంటి ఎన్నో పత్రికలు ఉండేవని , ఆ తర్వాత ఈనాడు , ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు వచ్చాయన్నారు. నేడు మీడియా రంగం ఎంతో విస్తరించిందన్నారు. డిజిటల్ , సోషల్ మీడియా తో వేగంగా సమాచార వ్యాప్తి జరిగే పరిస్థితులు వచ్చాయన్నారు. ఒక పత్రికపదివేలసైన్యంతోసమానమన్నారు. కానీ నేడు వాదాల పేరుతో వాస్తవాలు మరుగున పడిపోతున్నాయన్నారు. భారతీయత మీద వక్ర భాష్యాల విషపుజల్లులుకురుస్తున్నాయన్నారు. ఏ పత్రిక అయినా సదాశయంతోనే ప్రారంభమవుతుందని, అర్థవంతమైన పేరు , ఆదర్శనీయమైన ప్రయాణం రెండు కన్నులుగా సాగిన పత్రికల జాడ చరిత్ర లో ఒకింత తక్కువేనన్నారు. జాతీయ భావజాలం తో, ధర్మం, రక్షణ కోసం ఈ మట్టి పరిమళంతో వేలుబడుతు , ఎన్నో అటు పోట్లను ఎదుర్కొని 77 ఏళ్లుగా నిలబడిన ఏకైక వార పత్రిక జాగృతి యే నన్నారు. ప్రధానంగా జాతీయతకు సుదూరంగా ఉండే ప్రభుత్వాల ఏలు బడిలో కత్తి సాము చేసిన ఘనత జాగృతి దే న్నారు. జాగృతి ముఖ్యంగా జాతీయ భావాజాలను వ్యాప్తం చేసిందని, ప్రజల అవసరాలను గుర్తించి, ఎన్నో రచనలు చేసి సమాజాన్ని జాగృతం చేసే ప్రయత్నాలు చేసిందన్నారు. గడిచిన ఏడున్నర దశాబ్దాలుగా జాగృతి స్వరాజ్య సమరయోధుల పోరాట ఆశయాన్ని ఆవిష్కరించడానీకే శ్రమిస్తుందన్నారు. ఇలాంటి పత్రికను మరింత ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రజలతో మమేకమవుతూ సమాజం కోసం పలువిధాలపాటుపడుతుందన్నారు.. నేడు దేశంలోని సామాజిక రంగాల్లో ప్రవేశించి, ఒక జాతీయ శక్తిగా సంఘం ఎదిగిందన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ బాధ్యులు కట్ట రాజగోపాల్, డాక్టర్ చక్రవర్తుల రమణాచారి. దురిశెట్టి నిరంజన చారి , పాక సత్యనారాయణ, ఎలగందుల సత్యనారాయణ, కిషన్ జి, బాలరాజు , తడగోప్పు ల శంకరయ్య, గీకూరి శ్రీనివాస్ , మహేశ్వర్ , పుల్లూరి రామారావు , మురళీజీ , పరుశరాం జి తదితరులు పాల్గొన్నారు.
12న తెలంగాణ స్థానిక పత్రికల డిమాండ్లపై రాష్ట్రస్థాయి సదస్సు అక్రిడిటేషన్లు, ప్రకటనల కేటాయింపులో స్థానిక పత్రికలకు తీరని అన్యాయం డబ్ల్యూజేఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో స్థానిక పత్రికల పట్ల వివక్ష కొనసాగుతోందని బిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ అన్నారు. అక్రిడిటేషన్లు, రేట్ కార్డ్ విషయంలో తెలంగాణ స్థానిక పత్రికల యాజమాన్యాలకు అన్యాయం జరుగుతూ వచ్చిందని ఆరోపించారు. బుధవారం కరీంనగర్ డబ్ల్యూజేఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్వరాష్ట్రం ఏర్పడితే తమకు న్యాయం జరుగుతుందని స్థానిక పత్రికల యాజమాన్యాలు భావించాయని, అయితే గడచిన పదేళ్ల కాలంలో స్థానిక పత్రికల పరిస్థితులు మరింత దిగజారి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రాపకంతో, పైరవీలతో కొందరు మాత్రమే పెద్ద పత్రికల ముసుగులో లబ్ధి పొందారని, విలువలతో నిత్యం పత్రికలు వెలువరిస్తున్న వారికి మాత్రం తీరని అన్యాయం జరిగిందని అన్నారు. 12 న స్థానిక పత్రికల హక్కుల సాధనకై సదస్సు ఈనెల 12వ తేదీన హైదరాబాద్ నాగోల్ లోని శుభం కన్వెన్షన్ హాలులో 'తెలంగాణ స్థానిక పత్రికల యాజమాన్యాలు- అక్రి డిటేషన్లు- రేటు కార్డు' విషయంలో జరుగుతున్న అన్యాయాలపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సదస్సులో స్థానిక పత్రికల యాజమాన్యాల నుండి సలహాలు, సూచనలు తీసుకొని వాటిని క్రోడీకరించి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోనున్నట్లు చెప్పారు. స్థానిక పత్రికల యాజమాన్యాలకు గుర్తింపు, గౌరవం దక్కేంతవరకు డబ్ల్యూజేఐ పోరాడుతుందన్నారు. స్థానిక పత్రికలకు జరుగుతున్న అన్యాయాలను సరిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అనునిత్యం ప్రభుత్వంతో ప్రాతినిధ్యం జరుపుతామని స్పష్టం చేశారు. 12వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే తెలంగాణ స్థానిక పత్రికల యాజమాన్యాల సదస్సుకు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో పత్రికలు నిర్వహిస్తున్న ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ లోకి... వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, అక్రిడికేషన్ సమస్యల పరిష్కార కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా తాడూరు కరుణాకర్, యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా,అక్రిడిటేషన్ కమిటీ రాష్ట్ర సభ్యునిగా శివనాద్రి ప్రమోద్ కుమార్, రాష్ట్ర జాయింట్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బెజ్జంకి నరేష్ లను నియమిస్తూ నియామక ఉత్తర్వులు అందజేశారు.
ఈ సాధారణ ఎన్నికల్లో ఒక్క పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో హిందుత్వంపై తీవ్రస్థాయిలో విషం కక్కుతున్నాయి. ఇది ముమ్మాటికి సరికాదు. ఈ దేశ అస్తిత్వాన్ని, మెజారిటీ ప్రజల మనోభావాలను కాల రాసే విధంగా మాట్లాడటం.. వ్యంగంగా చలోక్తులు విసరడం.. తీవ్ర స్థాయిలో హిందుత్వంపై, అయోధ్య రామ మందిర్ పై విమర్శలు గుప్పించడం అనేది దుర్మార్గం. ఓటు బ్యాంకు రాజకీయాలకు పెద్దపీట వేస్తూ.. హిందువుల గుండెలపై గుణపాల దించే స్థాయిలో తీవ్ర పదజాలాలను ఉపయోగించడం ఏమాత్రం భావ్యం కాదు. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు.."అసలు హిందుత్వం బలపడితే ఈ నేతలకు భయం ఎందుకు..? " అని హిందూ సమాజం హిందూ విరోధినిధులను ప్రశ్నిస్తోంది. ఇటీవల భువనగిరి బహిరంగ సభలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడుతూ.. అయోధ్య శ్రీరాముడి అక్షింతల పంపిణీ.. ప్రసాదం వితరణ.. శ్రీరామనవమి రోజు కాషాయ జెండాల అలంకరణ.. దేవుడి ఊరేగింపులు.. దేవుడి తీర్థప్రసాదాలు పంపిణీ పై హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా మాట్లాడారు. కాషాయ జెండాలు మన పొలాలకు నీరు తీసుకొస్తాయా.. కడుపు నింపుతాయా..? అంటూ వ్యంగంగా విమర్శించారు. అదే సందర్భంలో ముస్లింలను ప్రసన్నం చేసుకునేందుకు నేను సెక్యులర్ ను అంటూనే ఉర్దూ లో మాట్లాడుతూ హిందుత్వంపై బురదజల్లారు. రంజాన్ సందర్భంగా తోఫా పంపిణీ చేశాను అని, తనకు తాను కితాబిచ్చుకున్నారు. అంటే రంజాన్ కు తోఫా ఇస్తే సెక్యులరిజం.. శ్రీరామనవమి రోజు ప్రసాదం పంపిణీ చేస్తే మతోన్మాదమా..? అంతకుముందు బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడుతూ.. "జైశ్రీరామ్ నినాదాలు కడుపు నింపుతాయా.. ఉద్యోగాలు ఇస్తాయా..? " అంటూ హిందుత్వాన్ని, హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడిని చులకన చేసే విధంగా మాట్లాడి, తన మనసులోని హిందూ వ్యతిరేకతను ప్రదర్శించాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి భారత్ ను హిందూ దేశంగా మారుస్తున్నారని.. రాజ్యాంగాన్ని రద్దు చేసి, మనువాద ధర్మాన్ని తీసుకువస్తారని మాట్లాడటం ఏమాత్రం క్షమార్హం కాదు. రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఖమ్మం సభలో మాట్లాడుతూ శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వేడుకలను ప్రస్తావించడం.. దేవుళ్ళ పేరుతో ర్యాలీలు తీసి ఓట్లు దండుకుంటున్నారని విమర్శించడం రాజకీయ దిగజారుడు తనమేనని చెప్పక తప్పదు. తన పార్టీ గెలుపు కోసము, ముస్లింల మెప్పు కోసము హిందుత్వంపై విషం చిమ్మడం ఘోరం. ఈ దేశాన్ని హిందూ దేశంగా మారుస్తారని ముస్లింలను రెచ్చగొట్టి ఓట్లు పొందే దుర్మార్గపు మాటల వెనక వారి హిందూ ద్వేషం కనబడుతోంది. అంతకుమించి తమ పార్టీ అగ్ర నేతల( హిందూ విరోధులు) మెప్పు కోసం తాపత్రయపడుతూ మాట్లాడిన మాటలే ఇవి. ఇటలీ భావజాలం గల నేతలను ప్రసన్నం చేసుకునేందుకు రేవంత్ గారు హిందుత్వాన్ని ఘనంగా పెట్టడం ఏమాత్రం తగదు. హిందుత్వాన్ని విమర్శిస్తే మరిన్ని మార్కులు పడతాయనే దురాలోచనలతో మాట్లాడటం హిందూ సమాజం హర్షించదు. మతం ఆధారంగా విడిచిపోయిన భారత్ భూభాగంలో నేడు హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి. హిందువుల ఆనవాళ్లు మాయమయ్యాయి. ప్రస్తుతం కాశ్మీర్, బెంగాల్, కేరళ ,అస్సాం తదితర ప్రాంతాల్లో హిందువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. నేడు మిగిలి ఉన్న ఈ మాత్రం భారత్ ను కూడా కబళించడమే కాంగ్రెస్ లక్ష్యమా ..? అని హిందూ సమాజం ప్రశ్నిస్తోంది. కమ్యూనిస్టుల విషయం వేరే చెప్పక్కర్లేదు. ఈ రాత్రికి రాత్రే హిందుత్వాన్ని అంతం చేయాలనేది వారి ప్రధాన లక్ష్యం. వీటికి తోడు మజిలీస్ పార్టీ విషయం తెలిసిందే. పోలీసులు పక్కకు జరిగితే "15 నిమిషాల్లో హిందువులను అంతం చేస్తా"మని మజిలీస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు ప్రపంచానికి సుపరిచితమే. అయితే ఈ నేతల ఆలోచన సరళి పరిశీలిస్తే.. హిందుత్వం బలపడితే మన మనుగడ ప్రశ్నార్థకం అనే బెంగ బలంగా పట్టుకున్నట్టు ఉంది. అందుకే అవకాశం వచ్చిన ప్రతి సందర్భాన్నీ ఉపయోగించుకొని, హిందుత్వాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అందుకు బదులుగా సేక్యులర్ అంటూ చక్కటి తేనె పూసిన కత్తిని వాడుతున్నారు. ఈ దేశంలో హిందుత్వాన్ని సమాధి చేయాలనుకునే నేతల మాటలను ఎన్నికల కమిషన్ సుమోటోగా స్వీకరించి, చట్టపరమైన తగు చర్యలు తీసుకోవాలి. మెజారిటీ ప్రజల అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్న ఆయా పార్టీలు, నేతలపై చట్టపరమైన చర్యలకు వెనకాడకూడదు. హిందుత్వం బలపడితేనే భారత్ కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ప్రపంచంలో ఒకే ఒక్క హిందూ దేశంగా ఉన్న భారత్ ను కూడా కబళించాలనే కుట్రలకు నేడు బిజెపి మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతునిస్తున్నాయి. ఈ చర్యలతో హిందుత్వాన్ని ప్రమాదంలోకి తోసేసేందుకు నేతల కుట్రలు ఫలిస్తే ఇక అంతే సంగతులు..! "భారతదేశంలో హిందువులు కూడా ఉండేవారు" అని చరిత్రలో రాసుకోవాల్సిందే తప్ప చేసేదేముండదనే విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి. ఇలాంటి ఓటు బ్యాంకు రాజకీయాల వల్లనే ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్ , ఆఫ్గనిస్తాన్ తదితర భూభాగాలను మతం ఆధారంగా భారతదేశం కోల్పోయిన విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ రాజకీయ కుట్రల కారణంగా మిగిలి ఉన్న భారత భూమిని కూడా హిందువులకు దూరం చేసే కుట్ర బలంగా సాగుతోంది. దీనిపై రాజకీయాలకు అతీతంగా అందరూ ఆలోచించాలి. హిందుత్వాన్ని, కాషాయ జెండాలను, హనుమాన్ జయంతిని, శ్రీరామనవమి వేడుకలను అవమానాలు, అప్రతిష్టపాలు చేస్తున్న నేతలకు బుద్ధి చెప్పాల్సిందే. లేదంటే హిందుత్వ మనుగడ ప్రశ్నార్థకమే.! ఓట్ల కోసం హిందూ ధర్మాన్ని పణంగా పెట్టడాన్ని విరమించుకోవాలని హిందూ సమాజం కోరుకుంటుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తొలిరోజుల్లో హిందూ జనాభా నిష్పత్తి శాతం.. నేడు రాజకీయ కారణాల కారణంగా ఉన్నటువంటి హిందూ జనాభా నిష్పత్తి శాతం.. హిందువుల సంఖ్య రోజురోజుకు ఎంత మేరా తగ్గుతూ వస్తోందో బోధపడుతుంది. హిందూ సమాజంలో చాలామంది మతం మారినప్పటికీ హిందువులుగా రికార్డుల్లో చూపిస్తున్నారు. కానీ వాస్తవంగా హిందువుల జనాభా పరిగణిస్తే భయంకరమైన వాస్తవాలు బయటపడతాయి. కాబట్టి ఉన్న కొద్దిపాటి హిందూ సమాజాన్ని కూడా కాలరాసే కుట్రలను కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టు, తదితర సెక్యులర్ పార్టీలుగా చెప్పుకునే అన్ని రాజకీయ పార్టీలు ఈ దారుణాన్ని మానుకోవాలి. ఐదు శతాబ్దాల నాటి మరకలను చెరిపి, ఇప్పుడిప్పుడే అయోధ్యలో రామ మందిరం నిర్మించుకున్నామని, ఆ రామ మందిరాన్ని చూసి ఓర్వలేకపోవడం, విమర్శలు గుప్పించడం వంటి దుర్మార్గపు పనులు చేయ వద్దని హిందూ సమాజం అభ్యర్థిస్తోంది. ముస్లింల ఓట్లతో గద్దెనెక్కి హిందూ సమాజాన్ని అంతం చేయాలని చూడటం ఈ రాజకీయ నాయకులకు సరికాదని హిందూ సమాజం హెచ్చరిస్తుంది. భవదీయ పగుడాకుల బాలస్వామి ప్రచార ప్రసార ప్రముఖ్ విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్రం 9912975753 9182674010
ఇటీవల వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో అందర్నీ సమదృష్టితో చూడాల్సిన సాక్షాత్తు కులపతి సమక్షంలో రాముడిని తిట్టే *సమూహం* ఒక సమావేశం పెట్టుకుంది. అందులో ప్రజాస్వామ్యం, భావవ్యక్తీకరణ అన్న పదాలు సర్వసాధారణంగా ఉపయోగించి రామాయణాన్ని సనాతన ధర్మాన్ని దుమ్మెత్తి పోసే పనికి పూనుకున్నారు. కానీ వాళ్ళ ఉద్దేశం మాత్రం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గ్రహించింది. ఆ సంఘం ప్రతినిధులు చెప్పినట్టుగా విద్యార్థులకు రామాయణం రాకపోవచ్చు కానీ రాముని పట్ల భక్తి ఉంది. మీరంతా రామాయణం ఆపోసిన పట్టారు కానీ రాముని ద్వేషిస్తారు. అంతే తేడా...!? సాహిత్య వేత్తలకు మాత్రమే రాముడిని తిట్టే అర్హత ఉందా? ఈ దురాగతాన్ని అడ్డుకునే అధికారం రామ భక్తులకు లేదా? చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి పెద్ద ప్రెస్ మీట్ పెట్టి రామదాసు లెవెల్ లో రామ భక్తుల్లా ఫోజులిస్తున్నారు... భావవ్యక్తీకరణ పేరుతో రాముని యొక్క వ్యక్తిత్వాన్ని విధ్వంసం చేయడమే ఈ విధ్వంస రచయితల ప్రధాన లక్ష్యం. మరి అంత భావవ్యక్తీకరణ మీద ప్రేమ ఉన్నవాళ్లయితే అదే వరంగల్లో సత్యనారాయణ అనే గుడి పూజారి దేవాలయం పైన మైకు పెడితే కొట్టి చంపాడు ఓ అన్యమతస్తుడు. ఆరోజు వీళ్లంతా వరంగల్లో ఉన్నారా? ఊడ్చుకు పోయారా ? అదే వరంగల్ కు దగ్గర్లో భైంసాలో జరిగిన హింస వీళ్ళ కవితలకు పనికి రాలేదా? వీళ్ళ పెన్నులకు జ్వరం వచ్చిందా? వీళ్ళ సెమినార్లకు ఏం మాయ రోగం వచ్చింది.? ఈ శుక్రనీతి ఇంకెన్నాళ్లు.. కేవలం హిందువులను తిట్టడానికి హిందూ ఇతిహాస పురాణాలను అవమానించడానికి అన్ని విశ్వవిద్యాలయాల్లో తిష్ట వేసుకున్న వామ పక్షులు చేస్తున్న ద్రావిడ ప్రాణాయామం ఇది... రామాయణ విషవృక్షం రాశారు ఇంకేం కావాలి? ఒకాయన సీతా జ్యోస్యం రాసాడు... ఇంకెన్నాళ్లు తిడతారు? పేరులో *విద్మహే* ఉన్నంత మాత్రాన గాయత్రీ మంత్రం అయిపోదు. ప్రతి విశ్వవిద్యాలయంలో పుట్టుకొస్తున్న ఈ మంథరలు, మారీచ సుభాహులు ... వేస్తున్న మారు వేషాలను... జ్ఞానం.. శీలం. ఏకత మనసు నిండా ఉన్న రామ భక్తులు ఎప్పుడు గమనిస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలలో ఈ అర్బన్ నక్సల్స్ హడావిడి ఇంత అంతా కాదు. వీళ్ళు వంద మంది ఉంటే మహాసభ అంటారు ఐదు మంది ఉంటే రౌండ్ టేబుల్ అంటారు. పాడిందే పాట గా హిందుత్వను తిట్టగానే హీరోలుగా మారిపోతామని భావిస్తారు. మతోన్మాదం.. ఫాసిస్ట్ వంటి పడికట్టు పదాలు వాడుతూ లోలోపల హైందవ విధ్వంసమే వీళ్ళ లక్ష్యం. గతంలో ఇది కనిపెట్టడం కష్టం అయ్యేది. ఇప్పుడు వీళ్ళ హిపోక్రసీ బయటపడిపోతుంది. పదిమంది మీపై భౌతిక హింసకు దిగారని బాధపడిపోతున్నారు. మరి కోట్ల మంది రామభక్తుల మనోభావాలపై మీరు చేస్తున్న గాయాలు ఎవరికి చెప్పుకోవాలి? హింస అంటే కేవలం శరీరపరంగా గాయపరచడం మాత్రమే కాదు మానసికంగా బాధ పెట్టడం కూడా అన్న నిర్వచనం ఉందన్న సంగతి ఈ మహా మేధావులకు తెలియదనుకోవాలా... తెలిసి చేస్తున్నారనుకోవాలా...? చర్య జరపడం వీళ్ళ వంతు. ప్రతి చర్య జరిగితే గగ్గోలు పెట్టి ప్రజాస్వామ్యం భావ స్వేచ్ఛా అనడం ఎంతవరకు కరెక్ట్.! రామాయణం పై మాట్లాడే అధికారం కేవలం విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లకు మాత్రమే ఉంది అని భావిస్తున్న వాళ్లు... అదే రామాయణం పై అనేక పరిశోధనలు చేసిన విశ్వవిద్యాలయ ఆచార్యులు ఎందరో ఉన్నారు. వీళ్ళలా విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాలు వెలగబెట్టకపోవచ్చు కానీ బయట ఎందరో రామాయణం పై పరిశోధన చేసిన వాళ్లు ఉన్నారు. వాళ్ళని పిలిచి సంవాదం పెట్టాల్సింది. అలా కాకుండా అర్బన్ నక్సల్స్ అంతా ఒకచోట చేరి సాహిత్యం పేరిట జరుగుపుతున్న ఈ విధ్వంసానికి ప్రజాస్వామ్యం ...ప్రజా సంఘాలు అని పేరు పెట్టుకోవడం ఎందుకు? నిజంగా మీకు రంగనాథ రామాయణం ...భాస్కర రామాయణం... మొల్ల రామాయణం రామాభ్యుదయం... నిర్వచనోత్తర రామాయణం ...ఎర్రన రామాయణం... చివరకు వరంగల్లో పుట్టిన పండరీనాథ రామాయణం దేని పైన అయినా చర్చ చేయాల్సింది. సమఉజ్జీలతో కదా! ఫాసిస్టులు అనీ హిందువులను నిందిస్తున్న మీరు కనీసం ఇతర మతాల గురించి ఒక్క మాటైనా మాట్లాడగలరా? మీ సమూహ కేవలం ఒక మతాన్ని... దానికి సంబంధించిన పాత్రలను దూషించడం లక్ష్యాలుగా పెట్టుకుందా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం.!? మీరు రాముడినీ ఎంత తిట్టినా ఇవాళ అతి ఎక్కువ మంది వ్యూవర్షిప్ ఉన్న సీరియల్ రామాయణం. అతి ఎక్కువ మంది పాడుకున్న పాట హనుమాన్ చాలీసా. మీరు రాస్తున్న కవిత్వం.. కథలు మీ కొంపలో ఉన్న కుటుంబ సభ్యులైనా చదువుతున్నారా? మీలాగా ద్వేషించడానికి ఈ దేశంలో రామాయణ పారాయణం జరగడం లేదు. మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని గుణగణాలు మానవాదర్శంగా ఈ దేశం ఎప్పుడో స్వీకరించింది. సూర్యుడి పై ఉమ్మేసే ఈ పిచ్చి ప్రయత్నం మానుకుంటే రచయితలుగానైనా సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. అవార్డులు కొట్టేసి అప్పనంగా ఊరేగుతున్న మీరు 100 మందిని కూడా ప్రభావితం చేయలేకపోతున్నారు. జాబాలిని కూడా ఆదరించిన శ్రీరామచంద్రుడి వ్యక్తిత్వం పాజిటివ్ గా చదివితే మరింత గొప్పగా అర్థం అవుతుంది. మిగిలిపోయిన ఈ జీవితంలో కనీసం ఇప్పటికైనా రామాయణ పారాయణం చేయాలని కోరుతూ మావోను విడిచిపెట్టి మా రాముడిని గుండెలో నిలుపుకోవాలని... మార్క్స్ ను విడిచిపెట్టి కనీసం మల్లెమాల రామాయణం అయినా చదవాలని.. స్టాలిన్ ను సంకలోంచి దించి మొల్ల యొక్క రామభక్తిని అందుకోవాలని కోరుతున్నాం. ఒకవేళ రాముడు దేవుడని రామాయణం చదవడం మొదలుపెడితే తప్పకుండా ఇతడు దేవుడే అనిపిస్తాడు. లేదా రాముడు మానవుడని రామాయణం చదవడం మొదలుపెడితే తప్పకుండా అతనిలో దైవత్వం కనిపిస్తుంది... ఓ ప్రపంచ మేధావులారా... జగమెరిగిన రచయితల్లారా..! మంథర మారీచుల్లారా! రామాయణం చదవండి రామ భక్తి లో మునగండి. *@ శ్రీకౌస్తుభ.. ప్రముఖ సాహిత్య రాజకీయ విమర్శకులు...*
సమతమమత కొరకు సన్యాసిగా నిల్చి జైనమతబోధ జనులకొసగి సార్ధకమ్మునొంది వర్ధమానుండయ్యె శాంతికేతనంబు సమరసంబు జైన సంప్రదాయానికి మూలమైన సిద్ధాంతాన్ని ఆత్మవాదమని అంటారు. ఇందులో మనిషి క్రోధం, కామం, ఈర్ష్య, అసూయ మొదలైన వాటిని జయించాలి. ఇలా జయించిన వారికి జినుడు అని పేరు. ‘జినుడు’ అన్నమాట నుంచి వచ్చిన పదం జైనం. జినుడు అంటే జయించినవాడు అని అర్థం. జినుడు అయిన వ్యక్తి స్థాపించిన మతం కనుక దీనిని జైన సంప్రదాయం అంటారు. ఈ సంప్రదాయంలో 24 తీర్థంకరులు ఉన్నారు. వీరిలో 24 వ మరియు ఆఖరి తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. బీహార్లో వైశాలికి సమీపంలోని కుందల గ్రామంలో క్రీ.పూ. 599లో జ్ఙాత్రికుల క్షత్రియ కుటుంబానికి చెందిన సిద్దార్ధుడు, త్రిషలకు మహావీరుడు జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు మహావీరుడని నామకరణం చేశారు. అల్లారుముద్దుగా పెరిగిన మహావీరుడు తల్లిదండ్రులు అతడి 28వ ఏట మరణించగా, యశోధరను వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె జన్మించగా, తన 36 వ ఏట వర్ధమానుడు సన్యాసాన్ని స్వీకరించాడు. 12 ఏళ్లు పాటు కఠోర తపస్సు చేసి, వైశాఖ మాసం పదమూడో రోజున జృంభిక గ్రామంలో జ్ఙానోదయం కలిగింది. తరువాత మహావీరుడు జినుడు అయ్యాడు. తరువాత ముప్పై ఏళ్లు కోసల, మగధ రాజ్యాలతోపాటు తూర్పునకు వెళ్లి తన సిద్ధాంతాలను బోధించాడు. బింబిసారుడు, అజాత శత్రువు మొదలైన రాజులను కలుసుకున్నాడు. తన పర్యటనలో వర్ధమానుడు జైనతత్వాన్ని ప్రచారం చేశాడు.వ్యక్తి ఆనందానికి, సామాజిక జీవనానికి సంబంధించిన శుభ సందేశాన్ని ప్రబోధించాడు. వర్ధమానుని బోధనలలో సమత్వం మహావీరుడు సమస్తజీవులకు హితం కల్గించే సిద్ధాంతమే నిజమైన ధర్మమని ఉద్భోదించాడు.సాత్వికప్రేమతో కూడిన అహింసని ప్రచారం చేశాడు. ఆ కాలంలో జరుగుతున్న దురాచారాల్ని అరికట్టి సర్వసమతావాదాన్ని ప్రచారం చేశాడు. ఆయన కులం,గోత్రం,ధనం,మతం,హోదా మొదలైన వాటిని లెక్కచేయకుండా సమస్త ప్రజలకు సమత శాంతిని ప్రసాదించాడు. వర్ధమానుని బోధనల్లో ప్రధానమైనవి అహింస, సత్యం, అపరిగ్రహం, అస్తేయం, బ్రహ్మచర్యం. వీటిని పంచ వ్రతాలు అంటారు. బ్రహ్మచర్యం పాటిస్తూ హింస చేయకుండా, అబద్ధమాడకుండా, ఇతరుల ఆస్తిని కబళించకుండా, దొంగతనం చేయకుండా ఉండాలి. జైన మతానుసారం సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ జీవనం అనే మోక్ష మార్గాలను త్రిరత్నాలంటారు. త్రిరత్నాలు సామాజిక వ్యవస్థని, సౌబ్రాత్వ మార్గంలో నిలబెట్టే అద్భుత సాధనాలు. వ్యక్తులు సరైన ద్రుష్టి కల్గి ఉండి, సరైన జ్ఞానంతో, సరైన జీవనాన్ని గడపాలనేది వీటి అర్ధం. వీటిని పాటిస్తూ పంచవ్రతాలతో జీవించేవారికి కైవల్యం లభిస్తుందని మహావీరుడు బోధించేవాడు. తన బోధనల వ్యాప్తికి మహావీరుడు సాధు, సాధ్వి, శ్రావక, శ్రావిక అని చతుర్విధ సంఘాలను స్థాపించాడు. వర్ధమానుడు సిద్ధాంతాలను ప్రబోధించేందుకు ఒకచోటి నుండి మరోచోటికి నిరంతరమూ ప్రయాణం చేసేవాడు. ఆ సమయంలో ఎందరో అతణ్ని పరిహసించారు. సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆయన్ని బాధించేవారు, అవమానపర్చేవారు. అయినప్పటికీ సహనంతో సంస్కరణకు పూనుకున్నాడు. ఇంద్రభూతి, అగ్నిభూతి, వాయుభూతులనే మహాపండితులతో శాస్త్ర చర్చలు జరిపాడు."మానవ జాతికి విముక్తి కావాలంటే ప్రేమ,మమత,సమత- అనేవి అవసరం అన్నాడు మహావీరుడు. వర్ణం ప్రధానం కాదనీ, ఆధ్యాత్మిక ఉన్నతికి వర్ణంతో సంబంధం లేదనీ చాటి చెప్పాడు". తర్వాత వారే మహావీరుని ప్రముఖ శిష్యులుగా మారిపోయారు. మహావీరుని ఉపదేశాలను అక్షరబద్ధం చేసిన గౌరవం ఇంద్రభూతికే దక్కుతుంది. హరికోశి, మైత్రార్యుడు అనే శూద్రులు సైతం ఆయన శిష్యులలో ఉండేవారు. నిష్కారణంగా ఇతరులతో వైరభావం కలిగి ఉండేవాడు ప్రపంచంలోని అందరిలో అయోగ్యుడు అని ప్రవచించిన వర్ధమానుడు తన 72వ ఏట క్రీ.పూ.527లో పావాపురిలో దేహాన్ని త్వజించారు. అప్పటికే 23 మంది తీర్ధంకరులు ఉన్నా మహావీరుడు హాయంలోనే జైనమతానికి విశేష ప్రాధాన్యత లభించి, భారతదేశం నలుచెరుగులా వ్యాపించింది . 32ఏళ్ల పాటు సమతాధర్మంతో ప్రచారం జరిపిన మహావీరుడు జైనులకు ఆరాధ్యుడయ్యాడు.ఆయన నిజంగానే మహావీరుడు. కానీ యుద్ధాల్లో గెలిచిన క్షత్రియ వీరుడు కాదు.సమస్త ప్రజల హితం కోసం జీవించిన వీరుడు. అరిషడ్వర్గాలనీ జయించిన వీరుడు. ప్రతి ఒక్కరి హృదయాలయంలో కొలువైన దేవుడు! భారతీయ తాత్విక మతంగా విరాజిల్లుతున్న జైనం...సకల జనుల ధార్మికసమృద్ధి కోసమే!! సర్వ ప్రాణుల సమతా కేతనమే! ఆ కేతనం చేతబూని కార్యరంగంలోకి దూకుదాం... సామాజిక దురాచారమైన అంటరానితనాన్ని దూరం చేద్దాం. @ సాకి.
అయోధ్య శ్రీరామచంద్రుడి దర్శనార్థం వెళ్లే ప్రయాణీకుల సౌకర్యార్థం హైదరాబాద్, అయోధ్య మధ్యలో డైరెక్ట్ విమానాన్ని ప్రారంభించాలని ఫిబ్రవరి 26వ తేదీన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారికి లేఖ రాశాను. వారు వెంటనే స్పందించి.. రెండు నగరాల మధ్య విమానాల రాకపోకల కోసం వాణిజ్య విమాన సంస్థలతో (కమర్షియల్ ఎయిర్లైన్స్) మాట్లాడారు. దీని కారణంగా హైదరాబాద్, అయోధ్య మధ్యలో.. డైరెక్ట్ విమాన సేవలు ప్రారంభం కానున్నాయని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను. ఏప్రిల్ 2 నుంచి వారానికి మూడ్రోజుల చొప్పున మంగళవారం, గురువారం, శనివారం ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
తెలంగాణ కొత్త గవర్నర్గా శ్రీ సిపి రాధాకృష్ణన్ నియమితులయ్యారు. వీరికి అపారమైన సామాజిక అనుభవం గలదనే ఉద్రాదేశ్యం లో రాధాకృష్ణన్ గారిని గవర్నర్ గా నియమించినట్లు తెలుస్తోంది.
కరీంనగర్,మార్చ్ 17 (జనం గొంతు): ఘనమైన సంస్కృతీ వారసత్వాలను కలిగి ఉన్న భారతదేశం యొక్క నిజమైన చరిత్రను ప్రతి ఒక్కరు అధ్యయనం చేయాలని కరీంనగర్ జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి కుందారపు మహేశ్వర్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక వాగీశ్వరీ డిగ్రీ కళాశాలలో ప్రజ్ఞాభారతి, జాతీయ సాహిత్య పరిషత్, సమాచార భారతి సంయుక్తంగా నిర్వహించిన “గంగలో విషనాగులు” పుస్తక పరిచయ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.రాజీవ్ మల్హోత్రా, విజయ విశ్వనాథన్ సంయుక్తంగా రాసిన “స్నేక్స్ ఇన్ ది గంగ” గ్రంథాన్ని డా.బొమ్మరాజు సారంగపాణి తెలుగులో ‘గంగలో విషనాగులు’ పేరుతో ప్రభావవంతంగా అనువదించారని, ఇది ప్రతి భారతీయుడు చదువదగ్గ పుస్తకమన్నారు.భారత జాతిని బలహీనపరచడానికి జాతీయంగాను, అంతర్జాతీయంగాను దేశ వ్యతిరేక శక్తులు చేస్తున్న కుట్రల గురించి ఈ పుస్తకంలో పొందుపర్చారని ఆయన వివరించారు.అటువంటి కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ భారతజాతి అప్రమత్తంగా, సమైక్యంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.గ్రంథ రచయిత భారతదేశ చరిత్రలోని అనేక అంశాలను సాధికారికంగా నిరూపించారని ప్రశంసించారు.’గంగలో విషనాగులు’ పుస్తక రచయిత డా. బొమ్మరాజు సారంగపాణి మాట్లాడుతూ గంగ భారతదేశానికి ప్రతీక అని, విషనాగులు అంటే విచ్ఛిన్నకర శక్తులు అని, ఆ విచ్ఛిన్నకర శక్తులు మన సంస్కృతి మూలాలను దెబ్బతీసి, పరమ పావనమైన భారతదేశాన్ని విషతుల్యం చేయాలని చేస్తున్న ప్రయత్నాలను మనం బలంగా తిప్పికొట్టాలన్నారు. భారతదేశంలో చోటుచేసుకుంటున్న ప్రతి చిన్న అంశం శల్య పరీక్షకు గురి చేస్తున్న దుర్మార్గాలు నిరంతరం జరుగుతున్నాయన్నారు. భారతదేశంపై సంస్కృతి పరంగాను, సైద్ధాంతిక పరంగాను అంతర్జాతీయ విచ్ఛిన్నకర శక్తులు దాడి చేస్తున్నాయని,దేశానికి వ్యతిరేకంగా అతి పెద్ద యంత్రాంగం పనిచేస్తున్నదని, సామాన్యులకు ఈ విషయం తెలియదని, గంగలో విషనాగులు పుస్తకంలో ఈ విషయాలు సాధికారికంగా వివరించబడ్డాయన్నారు.భారతీయులను కులాలపరంగా మరింతగా విభజించి దేశాన్ని అనైక్యం చేసే సిద్ధాంతాలు వెలవడుతున్నాయని, వీటిని బలపర్చడానికి శత్రుదేశాలు నిధులు కూడా సమకూరుస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.అమెరికా లాంటి దేశాల్లో రేసిజం సిద్ధాంతాన్ని ముందు పెడుతూ, దానికి మూలంగా భారతదేశంలోని కుల వ్యవస్థను చూపిస్తూ హిందూ మతాన్ని రూపు మాపడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. ప్రజ్ఞాభారతి చైర్మన్ డా.ఎల్. రాజభాస్కర్ రెడ్డి సభాధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మహిళా డిగ్రీ కళాశాల పూర్వ ప్రధానాచార్యుల బూర్ల దక్షిణామూర్తి,ప్రాంత కార్యకారిణి సదస్యులు వడ్డి విజయ సారథి మాట్లాడారు. తదనంతరం నవయుగ భారతి బాధ్యులు రాంపల్లి మల్లికార్జున్ గారు రచించిన జాతి పునర్నిర్మాణ రథసారథులు పుస్తకాన్ని ఆర్. డి . వో కుందారపు మహేశ్వర్ ఆవిష్కరించారు.మల్లిఖార్జున్ పుస్తకం గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాభారతి ప్రధాన కార్యదర్శి మందల నగేశ్ రెడ్డి,, జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు గాజుల రవీందర్, సమాచార భారతి బాధ్యులు తడిగొప్పల శంకరయ్య, జె.సత్యనారాయణ రెడ్డి,వెచ్చ మురళి,కడార్ల విమల్ కుమార్, గంగాధర్,శ్రీకర్,పద్మశ్రీ,నీలగిరి అనిత,ఆదిమూలం విద్యాసాగర్, ఉట్కురి రాధాకృష్ణ,తిరుపతి రావు,రమేష్ రెడ్డి, డా.భాగ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పౌరసత్వ సవరణ చట్టం (CAA) గురించి ఇప్పుడు సర్వత్ర చర్చ జరుగుతోంది. దేశంలోని కొన్ని చోట్ల ఈ చట్టానికి వ్యతిరేకంగా, మద్దతుగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని, ముస్లింలకు వ్యతిరేకమని కొందరు అంటూంటే అవన్నీ కేవలం అపోహలని చాలామంది సమాధానమిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం ఎందుకు? ఏమిటి? దేశవిభజనే మూలం 1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చిందికానీ దేశం ముక్కలైంది కూడా. విభజనను ఎట్టి పరిస్థితిలోను ఒప్పుకునేదిలేదన్న కాంగ్రెస్ నాయకులంతా చివరికి ముస్లిం లీగ్ మొండి పట్టుదలకు తలవంచారు. దానితో తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ లు ఏర్పడ్డాయి. రాత్రికిరాత్రి లక్షలాది మంది హిందువులకు భారత్ పరాయి దేశమైపోయింది. తాముంటున్న దేశంలో వారు మైనారిటీలుగా మారారు. అనేకమంది భారత్ కు తరలి వచ్చేశారు. కానీ కొంతమంది అక్కడే ఉండిపోయారు. అలాంటి వారందరికి రక్షణ కల్పించడమేకాక సుఖశాంతులతో కూడిన జీవనాన్ని కలిగించడం తమ బాధ్యత అంటూ గాంధీజీ, నెహ్రూ వంటి నాయకులు గట్టిగానే చెప్పారు. 15 ఆగస్ట్, 1947న ఇచ్చిన తన ఉపన్యాసంలో జవహర్ లాల్ నెహ్రూ “రాజకీయ సరిహద్దుల మూలంగా మన నుండి వేరుపడిపోయిన మన సోదరసోదరీమణులు ఈ సంతోష సమయాన్ని మనతో పంచుకోలేకపోతున్నారు. వాళ్ళు ఎప్పటికీ మనవాళ్లే. వారి బాగోగులు ఎప్పటికీ మనవే…’’ అని అన్నారు. 15 నవంబర్, 1950లో పార్లమెంట్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయనే “విభజన సమయంలో ఇక్కడికి వచ్చిన వారందరికి పౌరసత్వం ఇవ్వాల్సిందే. అందుకు చట్టపరమైన అడ్డంకులు ఏవైనా ఉంటే చట్టాన్ని సవరించవలసిందే.’’ అని గట్టిగా నొక్కివక్కాణించారు. 26 సెప్టెంబర్, 1947న మహాత్మా గాంధీ కూడా ఇలా అన్నారు“పాకిస్థాన్ లో నివశిస్తున్న హిందువులు, సిక్కులకు అక్కడ సుఖంగా, శాంతిగా జీవించడానికి తగిన పరిస్థితులు లేవనిపిస్తే వారు వెంటనే నిరభ్యంతరంగా భారత్ కు రావచ్చును. అలాంటివారిని భారత్ తప్పక ఆహ్వానించాలి..’’ తూర్పు బెంగాల్ శరణార్ధులను ఉద్దేశించి మాట్లాడిన అప్పటి హోమ్ మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ “దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని అనేక త్యాగాలు చేసిన మన తోటివాళ్లు కేవలం భౌగోళికమైన సరిహద్దులు మారీనందువల్ల హఠాత్తుగా విదేశస్థులు అయిపోరు. ఈ విషయాన్ని మనం మరచిపోరాదు’’ అని చెప్పారు. 25 నవంబర్, 1947న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించిన తీర్మానంలో ఇలా పేర్కొన్నారు – “తమ మాన ప్రాణాలు, గౌరవాన్ని కాపాడుకునేందుకు పాకిస్థాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులందరికి భద్రత కల్పించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. వీరేకాదు ఇకముందు వచ్చేవారికి కూడా ఆశ్రయం కల్పించాలి.’’ నెహ్రూ – లియకత్ అలీ ఒప్పందం తమ దేశాల్లోని మైనారిటీ వర్గానికి రక్షణ కల్పించాలని భారత్, పాకిస్థాన్ ల మధ్య ఒప్పందం జరిగింది. భారత ప్రప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రధాని లియాకత్ అలీలు 1950 ఏప్రిల్ లో ఆ ఒప్పందంపై సంతకాలు చేశారు. దాని ప్రకారం : శరణార్ధులకు ఎలాంటి హాని తలపెట్టకూడదు ఎత్తుకుపోయిన స్త్రీలను, దోచుకున్న సొత్తును తిరిగి ఇచ్చివేయాలి బలవంతపు మతమార్పిడులకు గుర్తింపు ఇవ్వరాదు మైనారిటీల హక్కులను కాపాడాలి ఇలా ఒప్పందం కుదిరినా పాకిస్థాన్ మాత్రం దానికి విరుద్ధంగానే వ్యవహరించింది. తమ దగ్గర ఉన్న దళితులను భారత్ కు వెళ్లకుండా అడ్డుకుంది. “వాళ్ళు వెళ్లిపోతే కరాచీలో వీధులు, మూత్రశాలలు ఎవరు శుభ్రం చేస్తారు?’’ అని ప్రధాని లియాకత్ అలీ భారత హై కమిషనర్ ను ప్రశ్నించాడు. మైనారిటీలపై మారణకాండ ఇస్లామిక్ ఛాందసవాదం పెరగడం, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లు ఇస్లామిక్ రిపబ్లిక్ లుగా ప్రకటించడంతో ఆ రెండు దేశాల్లో మైనారిటీలపై దాడులు, అణచివేత పెరిగిపోయాయి. బలవంతపు మతమార్పిడులు, మైనర్ బాలికల అపహరణ, ప్రార్ధనామందిరాల విధ్వంసం, మత దూషణకు పాల్పడ్డారంటూ దాడి చేసి చంపివేయడం వంటివి నిత్యకృత్యమయ్యాయి. ముస్లిమేతరుల జీవితాలు దుర్భరంగా మారాయి. వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. 1947లో పాకిస్థాన్ ఏర్పడేనాటికి అక్కడ హిందువుల సంఖ్య మొత్తం జనాభాలో 15శాతం. కానీ 1998 వచ్చేనాటికి ఈ సంఖ్య 1.6 శాతానికి పడిపోయింది. 1951లో బంగ్లాదేశ్ లో ముస్లిమేతరుల జనాభా 22శాతం. అది 2011నాటికి 9.5శాతానికి తరిగిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఇదే పరిస్తితి. 1970నాటికి అక్కడ ముస్లిమేతరుల సంఖ్య 7.7లక్షలుంటే 2017నాటికి కేవలం 7వేల మంది మాత్రమే మిగిలారు. విపరీతమైన అణచివేతకు గురైన హిందువులు పెద్ద సంఖ్యలో భారత్ కు తరలివచ్చారు. అలా పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ శరణార్ధుల్లో ఎక్కువ శాతం దళితులే. ఆశ్రయం ఇవ్వాలన్నవారే మాట మార్చారు ఇలా శరణార్ధులుగా వచ్చిన, వస్తున్న ముస్లిమేతరులకు, ముఖ్యంగా హిందువులకు ఆశ్రయం కల్పించడం భారత్ కనీస బాధ్యత అయింది. కాంగ్రెస్ కు చెందిన నేతలు ఈ విషయాన్ని అనేకసార్లు అంగీకరించారు కూడా. 18 డిసెంబర్, 2003లో రాజ్యసభలో ప్రతిపక్షనేతగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ ఈ శరణార్ధులకు ఆశ్రయం కల్పించి పౌరసత్వాన్ని ఇవ్వాలంటూ అప్పటి ఎన్డీయే ప్రభుత్వాన్ని కోరారు. ద్విజాతి సిద్ధాంతాన్ని సమర్ధించి దేశ విభజనకు కారణమైన కమ్యూనిస్టులు కూడా పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో ముస్లిమేతరుల అణచివేతను చూసి చలించిపోయారు. మే 22, 2012న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఒక లేఖ వ్రాస్తూ సి పి ఐ (ఎం) ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ మతపరమైన అణచివేతకు గురై బంగ్లాదేశ్ నుంచి తరలివచ్చిన లక్షలాదిమంది శరణార్ధులకు ఆశ్రయం కల్పించాలని, పౌరసత్వం ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా షెడ్యూల్ కులాలకు చెందిన నామశూద్రులు, పొంద్రఖత్రియ, మాఝి మొదలైన వారికి వెంటనే రక్షణ కల్పించాలని కోరారు. ఇలా పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో వివక్షకు గురవుతున్న ముస్లిమేతరులకు ఆశ్రయం కల్పించి పౌరసత్వం ఇవ్వాలని కోరిన ఈ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలే ప్రస్తుతం అందుకు వీలుకల్పించే విధంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని తెస్తే గగ్గోలు పెట్టడం విచిత్రం. అది రాజ్యాంగ వ్యతిరేకమని, ముస్లిం వ్యతిరేకమని, మానవహక్కులకు వ్యతిరేకమంటూ నానా రాద్ధాంతం చేస్తున్నాయి. వీటి వైఖరి మూలంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో అల్లర్లు, హింస చెలరేగాయి కూడా. ఇంతకీ చట్టంలో ఏముంది? 1). పౌరసత్వ సవరణ చట్టం (CAA) 31 డిసెంబర్, 2014కు ముందు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలోని హిందూ, సిఖ్, బౌద్ధ, జైన, పార్శీ, క్రైస్తవ వర్గాలకి చెందిన వారెవరైనా భారత్ లో ప్రవేశించి ఉంటే వారిని ఈ చట్టం ప్రకారం అక్రమ చొరబాటుదారులుగా పరిగణించరు. 2) 1955 పౌరసత్వ చట్టాన్ని ఎందుకు సవరించారు? పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ల రాజ్యాంగం ప్రకారం ఇస్లాం ఆ దేశాల అధికారిక మతం. అందువల్లనే ఆ దేశాల్లో హిందువులు, సిఖ్, బౌద్ధ, జైన్, పార్శీ, క్రైస్తవ మతస్తులపై మతం పేరుతో అత్యాచారాలు సాగుతున్నాయి. మైనారిటీ వర్గానికి చెందినవారికి తమ మత సాంప్రదాయాలను అనుసరించే, ఆచరించే ప్రాధమిక హక్కు కూడా లేకుండా పోయింది. దానితో చాలామంది ఆ దేశాల నుంచి పారిపోయి భారత్ కు వచ్చేశారు. వారిలో చాలామంది దగ్గర సరైన గుర్తింపు పత్రాలు కూడా లేవు. ఒకవేళ ఉన్నా వాటి కాలవ్యవధి ఎప్పుడో పూర్తైపోయింది. ఇలాంటివారికి సరైన గుర్తింపు ఇవ్వడం కోసం 1955 చట్టానికి సవరణ చేయవలసి వచ్చింది. 3) విదేశస్థులకు పౌరసత్వాన్ని మంజూరు చేయడానికి ప్రత్యేకమైన చట్టం ఇప్పటికే ఉండగా ఈ మూడు దేశాల శరణార్ధుల కోసం ప్రత్యేక సవరణ ఎందుకు? 31 డిసెంబర్, 2014 ముందువరకు ఇక్కడకు వచ్చిన శరణార్ధులకు పౌరసత్వం ఇవ్వడానికి ఈ ప్రత్యేక సవరణ అవసరమైంది. ఈ సవరణల మూలంగా కేంద్ర ప్రభుత్వం వీరికి గుర్తింపు పత్రాలు అందించే వీలు కలుగుతుంది. చాలామంది శరణార్ధులు ఎంతోకాలం క్రితమే ఇక్కడికి వచ్చారు కాబట్టి వారికి పరిచ్ఛేదం 5 ప్రకారం వెంటనే పౌరసత్వం ఇవ్వడానికి ఈ సవరణ వీలు కల్పిస్తుంది. 4) భారత పౌరసత్వం లభించాలంటే ఈ శరణార్ధులు ఇక్కడకు వచ్చి ఎంతకాలం పూర్తైఉండాలి? పేర్కొన్న మూడు దేశాలకు చెందిన ఈ మైనారిటీ వర్గాలకు చెందినవారు కనీసం ఐదు సంవత్సరాలు(ఇది ఇంతకు ముందు 11 సంవత్సరాలుగా ఉండేది) భారత్ లో ఉంటున్నట్లు చూపగలిగితే దేశీయకరణ ప్రక్రియ ప్రకారం వారికి ఈ దేశ పౌరసత్వం లభిస్తుంది. 5) ప్రభుత్వం తెస్తున్న చట్ట సవరణలు ముస్లిం వ్యతిరేకమైనవా? కాదు. ఇవి కేవలం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లలోని మైనారిటీ వర్గానికి చెందినవారికి సంబంధించినవి మాత్రమే. ఈ సవరణలకు ప్రస్తుతం భారత్ లో ఉంటున్న ముస్లిం లుగానీ, మరే పౌరులకుగాని ఎలాంటి సంబంధం లేదు. మూడు దేశాలలో ఇస్లాం అధికారిక మతం కాబట్టి ఆయా దేశాలకు సంబంధించిన ముస్లింలను ఈ జాబితాలో చేర్చలేదు. ఎందుకంటే ఇస్లామిక్ దేశంలో ముస్లింలపై అణచివేత, అత్యాచారాలు జరిగే అవకాశం లేదు. 6) పౌరసత్వ సవరణ బిల్లు, 2019 భారత రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తోందా? ఈ విషయంలో సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఇలా చెప్పారు -“ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదు. అలాగే కొందరు చెపుతున్నట్లుగా అధికరణం 14,15 లను అతిక్రమించడం లేదు. దేశీయకరణ లేదా పౌరసత్వ గుర్తింపు ఇవ్వడంలో మూడు దేశాలలో అణచివేతకు గురైన మైనారిటీ వర్గానికి చెందినవారికి కలిగిస్తున్న ప్రత్యేక సదుపాయం, హోదా మాత్రమే. దీనికి ఇతర వర్గానికి చెందినవారి దేశీయకరణ లేదా పౌరసత్వ మంజూరు ప్రక్రియతో ఎలాంటి సంబంధం లేదు. ఈ సవరణలు అధికరణం 14ను ఏమాత్రం ఉల్లంఘించడం లేదు.’’ పౌరసత్వ సవరణ చట్టం ముస్లిం దేశాలుగా గుర్తింపు పొందిన మూడు దేశాలలోని మతపరమైన అణచివేతకు గురైన మైనారిటీ వర్గానికి చెందినవారికి మాత్రమే ఉద్దేశించినది. ఆయా దేశాల్లో అధికసంఖ్యాకులు(ముస్లింలు) మతపరమైన అణచివేతకు గురయ్యే అవకాశం లేదుకాబట్టి వారిని ఇందులో చేర్చలేదు. అలాగే ఈ చట్టం రాజకీయ, ఆర్ధిక శరణార్ధులకు సంబంధించినది కూడా కాదు. అందువల్ల కూడా ముస్లింలకు ఇందులో స్థానం కల్పించలేదు. ఆరోపణలు అర్ధరహితం కాబట్టి పై విషయాలను పరిశీలిస్తే పౌరసత్వ సవరణ చట్టం కేవలం కొందరికి కొత్తగా పౌరసత్వాన్ని కల్పించడానికి ఉద్దేశించినదేగాని ఎవరి పౌరసత్వాన్ని రద్దుచేయడం కోసం కాదని అర్ధమవుతుంది. అలాగే ఈ చట్టానికి, జాతీయ పౌర పట్టిక (NRC)కు సంబంధం లేదని కూడా తెలుస్తుంది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్రం అసోమ్ లో మాత్రమే జాతీయ పౌర పట్టిక ప్రక్రియను పూర్తిచేసింది. మిగిలిన దేశానికి సంబంధించి విధివిధానాలు ఇంకా రూపొందించలేదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటే CAA , NRCల గురించి విపక్షాలు చేస్తున్న ఆరోపణలు, చేస్తున్న ఆందోళన అర్ధరహితమైనవని స్పష్టమవుతుంది.