దున్నే వాడిదే భూమి, కంపనీలో పని చేసేవాడిదే ఉత్పత్తి లాంటి సొగసైన అందమైన నినాదం తో సామాన్యుల బుర్రల్లో ఆశలు నింపి తమ గల్లాలు నింపుకున్న సిద్ధాంతం ఏదయినా ఉంది అంటే అది కమ్యునిజం సిద్దాంతం ఒక్కటే. కాని చరిత్రలోకి తొంగి చూస్తే నక్షలిజమ్ పేర మన దేశం లోనే కాకుండా ఆ సిద్ధాంతం మొదలైన రష్యా చైనా లో కూడా ఆ సిద్ధాంతం ఒక విఫల సిద్దాంతంగా మిగిలి పొయింది. కాని ఇప్పటికీ మన దేశం లో కుహనా కమ్యునిజం వాదులు కమ్యునిజం సోషలిజం అంటూ నీతి వాక్యాలు చెబుతూ అమాయకుల బుర్రలు నింపేస్తునే ఉంటారు. మనలో కూడా చాలామంది వారి మాటలు నమ్మి కమ్యునిజం సిద్దాంతం మంచిదే కానీ ఆచరణ సాద్యం కానిది అని అంటూ ఒకరకమైన బ్రమలో మాట్లాడుతూ వుంటారు. మరి మంచి సిద్దాంత మైతే అది పుట్టిన చోట కూడా ఎందుకు విఫల మైనది. అలాగే కమ్యూనిజాన్ని అనుసరించిన దేశాలు కమ్యునిజం స్థానం లో కర్పోరేటికరణ ఎందుకు చేసారు. మావోయిజం పేరిట రైతుకు ఇచ్చిన భూమిని మల్లి ఎందుకు లాక్కున్నారు మల్లి ఎందుకు రైతులకు హక్కులు కల్పించారు వ్యవసయవిధానం లో కర్పోరేటికరణ ఎందుకు తీసుకు వచ్చారు అంటే సమాధానాలు చెప్పరు. అసలు ఈ సమాచారం ఎందుకు సమాజానికి తెలియనివ్వరు అనేది కోట్ల రూపాయల ప్రశ్న . దీనికి తోడు కొందరు మేధావుల ముసుగులో యువత నక్సలిజం వైపు మరలె విదంగా పాటలు నృత్యాలు కవితలు కథలు కాకరకాయలు రాసి యువత నక్షలిజమ్ వైపు వెళ్ళేల ప్రేరేపిస్తుంటారు . అలంటి వారిలో ప్రధాన మైన వ్యక్తి గద్దర్ వరవరరావు విమలక్కలు . గద్దర్ గురించి తెలియని వారు మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు వుండరు ఈ విషయంలో అంతటి ప్రాముక్యత సాధించు కున్నారు. గ్రామగ్రామాన తిరిగి తన ఆటపాటలతో యువతను ఉద్రేక పరచారు . దీంతో అయన పాటల మూలంగా వేలాది మంది యువత నక్షలిజమ్ ప్రబావానికి గురై అడవుల పట్టారనే విమర్శలు అనేకం ఉన్నాయి. అలగే శ్రీశ్రీ లాంటి వారు పేదలు, ఆకలి కలయికలతో ఎన్నో కవితలు రాయడం మూలంగా యువత ఒకవిదమైన ప్రబుత్వ | రాజ్యవ్యతిరేక బావనకి లోనయ్యారు . అలగే అరుణోదయ కలమండలి పేరుతో విమలక్క లాంటి వారు కూడా ఇక్కడ అర్బన్ నక్సల్ కింద మనం మాట్లాడుకోవచ్చు. నాడు అంటే నక్షలిజమ్ భారత దేశం లో ప్రవేశించే క్రమంలో అంటే 1967 లో మొదటగా నక్షల్బరిలొ ప్రారంబమై మన దేశం లో దాదాపు 20 రాష్ట్రాల్లో 182 జిల్లాల్లో దాని ప్రబావం చూపినప్పటికీ ఇప్పుడు ఛత్తీస్ ఘడ్ , జార్ఖండ్ ,ఒడిష ,వెస్ట్ బెంగాల్ ,బిహార్ ,తెలంగాణా , ఆంధ్రప్రదేశ్ ,మహారాష్ట్ర లలో 18 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది . అదికూడా నేదో రేపో అంతం కానుంది ఈమేరకు ఈ దేశపు హోంమంత్రి అమిత్ షా 2026 డిసెంబర్ నాటికి నక్షలిజమ్ లేకుండా చేస్తామని ప్రకటించారు. అయితే నేడు ఈ నక్షలిజమ్ అర్బన్ నక్సలిజం గ మారడమే కాకుండా నాటి దున్నే వాడిదే బూమి నినాదం నుండి పని చేసే వాడిదే కంపని లాభం అనేంతగా ఎదిగింది . కాని దీనికి ఏ సమాజాన్ని రెచ్చగొట్టి విప్లవం తీసుకు రావాలని చూసారో ఆ సమాజం నుండే మద్దతు కరువు అవడం తో ఇప్పుడు కొత్తగా కులాల పేరుతో మతాల పేరుతో కుల అంతరాల పేరుతో వీరి బావజాలం ప్రవహిస్తోంది. అది అలా ఉన్నప్పటికీ అసలు ఈ మావోయిజం లెనినిజం నక్సలిజం పుట్టిన రష్యా చైనల్లోనే కనుమరుగయ్యింది. అసలు ఈ నక్సలిజం కారణంగా రష్యా చైనాల్లో 1917 నుండి 1930 వరకు దాదాపు 10 కోట్ల ప్రాణాలు గాల్లో కలిసి పొయ్యాయి. మొదట సోషలిజం కమ్యునిజం పేరుతో కారల్ మార్క్స్ విదానాలంటూ 1920 , 1930 ప్రాంతాల్లో భూమి కలెక్ట వైజేషణ్ పేరుతో రైతుల దగ్గరి నుండి భూములను లాక్కుని ప్రభుత్వం దగ్గరే పెట్టుకొని వ్యవసాయం చేయించారు. దీంతో ఉక్రెయిన్ లో తీవ్ర కరువు సంభవించి ఆకలితో కూడా లక్షలాది మంది చనిపోయ్యారు . దీనికి కారణం భూమి ప్రభుత్వం దగ్గర వుండడం తో ఎవరు సరయిన పద్దతిలో పని చెయ్యక పోవడమే. కాని చేసినట్లుగా దొంగ లెక్కలు చూపించి ప్రజా ధనాన్ని మాత్రం కాజేశారు . కానీ మార్కెట్లో నిత్యావసర సరుకులు లేకపోవడం తో ఆకలితో లక్షలాది మంది చని పొయ్యారు. ఇక చైనాలో కూడా లెనిన్ మావోల ప్రబావం తో సోషలిజం పేర 1953-1958 మావో జెడాంగ్ సమానత్వం పేరిట ప్రజల భూములు లాక్కోబడ్డాయి. ప్రజలు తమ భూములు ఇవ్వడానికి నిరాకరించడం తో రక్తపుటేరులు పారించి బలవంతంగా భూములు లాక్కున్నారు . ఇక్కడ కూడా సేం రష్యాలో జరిగినట్లుగానే ఆహారకొరత ఏర్పడింది. మొదట్లో కొంత మెరుగ్గా అనిపించినా 1978 నాటికి పరిస్థితి దిగజారిపోయింది. వ్యవసాయ ఉద్యోగులు అందరు కూడా దొంగ లెక్కలు చూపించి ప్రజా ధనాన్ని కాజేశారు. చేసేది లేక చైనా తిరిగి భూములను లీజుకు ఇచ్చే పద్ధతి తీసుకు వచ్చి ఈ విషయం లో ప్రవేటు బాగస్వామ్యాన్ని కలిపింది. కాని ప్రస్తుతం అటు రష్యాలో కాని ఇటు చైనా లో కాని వ్యవసాయ భూములన్నీ కూడా కార్పొరేట చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు చైనా రష్యాలలో సామాన్య రైతులు వ్యవసాయం చేయలేక కార్పోరేట్ సంస్థలకు తమ భూములను అమ్మేసుకుంటున్నారు దీంతో ఇప్పుడు vరష్యాలో వ్యవసాయ భూములలో గణనీయమైన భాగం పెద్ద వ్యవసాయ సంస్థలు మరియు కార్పొరేట్ హోల్డింగ్స్ వద్ద ఉంది. 2023 నాటికి, 73 ప్రధాన సంస్థలు 17.4 మిలియన్ హెక్టార్ల భూమిని నియంత్రిస్తున్నాయి, ఇందులో టాప్-5 సంస్థలు 4.4 మిలియన్ హెక్టార్లను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు, Prodimex, Rusagro, Miratorg వంటి సంస్థలు పెద్ద ఎత్తున భూములను కలిగి ఉన్నాయి. చైనాలో కూడా 1978 డెంగ్ సంస్కరణల తర్వాత, చిన్న రైతు ఫామ్లు (0.5 హెక్టార్) పెద్ద సంస్థలకు లీజ్ చేస్తున్నాయి. 2025 నాటికి, 30% వ్యవసాయ భూమి పెద్ద ఫామ్లలో చేరిపోయింది . ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నక్షలిజమ్ మన దేశం లోకి 1967 ప్రాంతం లో బెంగాల్ లోని నక్సల్ బరి లో మొదటగా కనపడి దేశం లోని 20 రాష్ట్రాలలోని 182 జిల్లాలకు పాకింది. మన తెలుగు ప్రాంతం లో ముఖ్యమైన వారిలో కొండపల్లి సీతారామయ్య ,నంబాల కేశవరావు .వెంపటాపు సత్యనారాయణ , ఆదిబట్ల కైలాసం , నల్ల యాది రెడ్డి , సుబ్బారావు పాణిగ్రాహి ,సంతోష్ రెడ్డి , శీలం నరేష్ , కట్టా రామచంద్ర రెడ్డి , సుజాత లాంటి వరెందరో కనపడుతారు. ప్రస్తుతం వీరి లో చాల వరకు పొలిసు ఎన్ కౌంటర్ లలో చని పొయ్యారు . నక్షలిజమ్ ఎక్కడ అయితే పురుడు పోసుకున్తుందో అక్కడ అభివృద్ధి అన్న మాటే ఉండదు. నక్షలిజమ్ సిద్ధాంతం మావో లెనినిజం సిద్ధాంతం ల పేరుతో దాదాపు 30 సంవత్సరాల పాటు బెంగాల్ ను పాలించిన జ్యోతి బసునే మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు బెంగాల్లో ఎలాంటి దరిద్రం వుందో మనం కళ్ళార చూస్తున్నాము . నక్సలిజం ఉనికి ఎక్కడ అయితే కనపడుతుందో అక్కడ ఒక రోడ్డు వేయనివ్వరు ఒక విద్యుత్ ఫెసిలిటి రానివ్వరు అంత చీకటి మయం. ఇలా అభివృద్ధి లేని ప్రజల జీవితాలు ఎలా బాగుపడతాయో చెప్పమంటే వీళ్ళ దగ్గర సమాదానం ఉండదు. తుపాకి అండన ప్రజలను కాపు కాస్తూ పైగా రాజ్యం హింసిస్తోంది అంటారు. అయిన దానికి కాని దానికి సాటి మనుషుల్ని చంపుకుంటూ వెళ్ళే వీళ్ళకు రాజ్యం హింసిస్తోంది అనే అర్హత ఎవరిచ్చారు . ఒకప్పుడు కమ్యునిజం ఏలిన ప్రపంచం లోని ఎన్నో దేశాలు సోవియట్ యూనియన్, చైనా , క్యుభా , వియత్నాం , ఉత్తర కొరియా , తూర్పు ఐరోపా దేశాలు , లాటిన్ అమరిక దేశాలు ఇప్పుడు ప్రజాస్వామ్యం వైపు నడుస్తున్నాయి . ఇదే మావోయిజం పుట్టిన రష్యా చైనాలో ఇప్పుడు నక్షలిజమ్ అంటే తూటాలతో జల్లెడ పడుతారు. కాని మన దేశం లో మాత్రం ఇంకా మేము తుపాకి తో రాజ్యాధికారం సాదిద్దామంటూ యువతను రెచ్చ గొడుతున్నారు . మందు పాతరలు పేల్చి సాటి మనుషులను రాక్షసుల మదిరి పొట్టన పెట్టుకుంటున్నారు. మనం ఇది వరకు కూడా వీడియోల్లో చర్చించుకున్నాము మన దేశం లో కేవలం నక్సలిజం కారణంగా దాదాపు 50 వేల మంది భారతీయులు చనిపోయ్యారు . ఇందులో చని పోయిన వారిలో 99.99 శాతం సామాన్య పేదలే ఉన్నారు. వీరంతా ఏమి పాపం చేసారు ఈ కమ్యునిజం నక్సలిజం సిద్దాంతాల కొరకు సామాన్యులు తమ ప్రాణాలు ఇస్తుంటే ఇదే సిద్దాంతాన్ని వాడుకున్నన్ని రోజులు వాడుకొని చివరకు జన జీవన స్రవంతి పేరుతో కోట్లాది రూపాయల ప్రజదనం పోగేసుకొని సామాన్యుడిల సన్నాయి నొక్కులు నొక్కడం దేనిని సూచిస్తుంది. ఇది యువత అర్ధం చేసుకుంటే నక్సలిజం లేదా మావోయిజం అనే మాట నోట్లోంచి వచ్చినా కూడా వాడిని అక్కడికక్కడే జనం ఉప్పు పాతర వేస్తారన్నది నగ్నసత్యం. న్యాలకొండ అనిల్ రావు దేశాయి సామాజిక విశ్లేషకులు 9912009171
దేశం పడి తేరగా తినడమే గాక అనేక నేరాలకు పాల్గొంటున్న విదేశీయులను భాహిష్కరించడానికి కేంద్రం రెడీ అవుతోంది . ఈ మేరకు రూపొందించిన నూతన విదేశీ వలస చట్టాలను వారిపై ప్రయోగించడానికి సిద్ధం అవుతోంది . ఇందుకుగాను నార్కోటిక్స్ రవాణా, ఇతర నేరాలతో సంబంధమున్న దాదాపు 16 వేల మంది విదేశీయులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం వీరందరూ నిర్బంధంలోనే వున్నారు. వీరందర్నీ దేశం నుంచి బహిష్కరించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తోంది. అయితే ఈ 16 వేల మంది జాబితాను ఇప్పటికే హోంశాఖ సంబంధిత సంస్థలకు కూడా అందించింది. మరో వైపు మన దేశంలో అక్రమంగా నివాసం వుంటున్న విదేశీయులకు కఠిన శిక్షలు విధించే కొత్త చట్టం సెప్టెంబర్ 2 న అమలులోకి వచ్చింది. దీని ప్రకారం తప్పుడు పత్రాలతో దేశంలోకి వచ్చిన విదేశీయులకు కనిష్టంగా రెండేళ్లు, గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష వుంటుంది. అలాగే లక్ష నుంచి పది లక్షల వరకు జరిమానా కూడా విధిస్తారు. ఇలాంటి అక్రమ పాత్రలతో దేశం లోకి జొరబడిన వారి సంఖ్య దాదాపు 6 కోట్ల వరకు ఉందని ఒక అంచనాగా ఉంది.
ఒక్కరి కోసం అందరు... అందరి కోసం ఒక్కరు...! .. మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హాన్మాండ్లు మనమంతా ఐక్యంగా ఉండి సమస్యలు ఎదురైనప్పుడు ఒక్కరి కోసం అందరు .. అందరి కోసం ఒక్కరుగా కలిసికట్టుగా *ముందుకు సాగాలని మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హాన్మాండ్లు అన్నారు . రాయికల్ పట్టణ పద్మశాలి సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారణ మహోత్సవం కార్యక్రమం పట్టణంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ హాజరై 2025 -27 సంవత్సర నూతన అధ్యక్షులుగా భోగ రాజేశం,ఉపాధ్యక్షుడిగా దాసరి గంగాధర్,ప్రధాన కార్యదర్శిగా కడకుంట్ల నరేష్,కోశాధికారిగా ఆడెపు నర్సయ్య లచే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత సంవత్సరం చేపట్టిన సేవా కార్యక్రమాలను అభినందించారు.సంఘ సభ్యులను సమన్వయం చేసుకునేందుకు సంఘంలో చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని సభ్యులకు సమాచారం అందిస్తూ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా తెలపాలని సూచించారు.మనందరం ఐక్యంగా ఉంటే భవిష్యత్తులో సంఘ అభివృద్ధికి ప్రభుత్వం నుండి నిధులు పొందేందుకు తోడ్పడుతుందన్నారు.సంఘం ఎన్నికలు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కోసం మాత్రమేనని తదనంతరం అందరం కలిసికట్టుగా ఐక్యంగా ఉండి ఆర్థికంగా,సామాజికంగా,రాజకీయంగా ఎదగాలన్నారు.విద్యార్థులకు విద్య పట్ల ప్రోత్సాహం,విద్య ఉపకరణాల కల్పన,ఆరోగ్యం,నిరుపేదలకు ప్రోత్సాహం లాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.అనంతరం నూతన అధ్యక్షులు భోగ రాజేశం మాట్లాడుతూ సంఘ సభ్యులు సహకారంతో పద్మశాలి సేవా సంఘ అభివృద్ధికి నిరంతరం పాటుపడతానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు తాటిపాముల విశ్వనాథం,హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ దాసరి గంగాధర్,రాష్ట్ర కార్యదర్శి జక్కుల చంద్రశేఖర్,మాజీ కార్యదర్శి మామిడాల లక్ష్మీనారాయణ మాజీ ఉపాధ్యక్షులు శ్రీరాముల సత్యనారాయణ, సిరిపురం రఘు,మాజీ కోశాధికారి నర్సయ్య ఫోపా అధ్యక్షులు ఎలిగేటి రాజ్ కిషోర్,పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు సామల్ల సతీష్,ఉపాధ్యక్షులు సింగని సతీష్,ప్రధాన కార్యదర్శి *ఆడెపు రాజీవ్,కోశాధికారి బొమ్మ కంటి నవీన్,సంయుక్త కార్యదర్శి అనుమండ్ల తేజ ,గంట్యాల ప్రవీణ్ పోప సభ్యులు దాసరి రామస్వామి,గాజంగి రాజేశం, సింగని రాందాస్,సామల్ల గంగాధర్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రాయికల్ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో గురువారం ముందస్తు రక్ష బంధన్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా చిన్నారులు వివిధ రకాలైన వృత్తుల వేషధారణలో వచ్చి అలరించారు. పాఠశాల ప్రిన్సిపల్ జే వేణుగోపాల్ రావు మాట్లాడుతూ రక్షాబంధన్ అంటే సోదరి సోదరుల అనుబంధమే కాకుండా ఆరోగ్యకరమైన సమాజం కోసం పాటుపడాలని విద్యార్థులకు సూచించారు. రక్షా బంధన్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది సోదర ప్రేమ, రక్షణ మరియు బాధ్యతలను గుర్తుచేసే ఒక ముఖ్యమైన సందర్భం. ఈ పండుగను జరుపుకోవడం ద్వారా, మనం మన కుటుంబ సంబంధాలను బలోపేతం చేసుకోవాలి, అలాగే సమాజంలో సోదర భావాన్ని పెంపొందించుకోవాలి. మనదేశంలో ఇంత ప్రశాంతంగా ప్రతి ఒక్కరు జీవిస్తున్నారంటే దానికి నిరంతరం శ్రమించే కొన్ని వృత్తులు వారి త్యాగాలను విద్యార్థులకు వివరించారు. ప్రతి విద్యార్థి దేశ రక్షణకై సమాజ సేవకై పాటుపడాలని వివరిస్తూ రక్షాబంధన్ సందర్భంగా ప్రతి విద్యార్థి తన ఇంటి వద్ద ఒక మొక్కను నాటాలని ప్రిన్సిపల్ వేణుగోపాల్ రావు విద్యార్థులకు సూచించారు తదనంతరం తరగతి విద్యార్థులు అందరూ ఒకరికి ఒకరు రాఖీ కట్టుకొని "నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనిద్దరం దేశానికి రక్ష "అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ గారు జే తిరుపతి రావు గారు, ప్రిన్సిపల్ జె వేణుగోపాల్ రావు ,ఉపాధ్యాయులు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలిచింది "చేనేత" కళ అని రాయికల్ పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు భోగ రాజేశం అన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాయికల్ పట్టణంలోని పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ చెమట చుక్కల్ని చీరలుగా మలచి.. మనిషికి నాగరికతను అద్దింది నేత కార్మికులని పేర్కొన్నారు.దేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.ప్రాచీన కాలం నుంచే మన దేశంలో మగ్గాల ద్వారా చేనేత ఉత్పత్తి జరిగిందని మొదట్లో ఈ విధానంతో వస్త్ర ఉత్పత్తికి చాలా సమయం పట్టేదన్నారు. ఇంగ్లాండ్ కు చెందిన జాన్ కే 1733 లో ఫ్లై షటిల్ ను కనిపెట్టాక మగ్గం ద్వారా వస్త్రాల ఉత్పత్తి సామర్థ్యం బాగా పెరిగింది అన్నారు.1801 లో జోసెఫ్ ఎం జాకార్డ్ పెద్ద డిజైన్లు రూపొందించే పరికరాన్ని తయారు చేయగా ప్రస్తుతం చేనేత రంగంలో ఉపయోగిస్తున్నారని ఆ పరికరాన్ని జాకార్డ్ గా పిలువ పడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులుగా దాసరి గంగాధర్, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల నరేష్,కోశాధికారి ఆడెపు నర్సయ్య,పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు సామల్ల సతీష్,ఉపాధ్యక్షులు సింగని సతీష్,ప్రధాన కార్యదర్శి ఆడెపు రాజీవ్,కోశాధికారి బొమ్మ కంటి నవీన్,సంయుక్త కార్యదర్శి గంట్యాల ప్రవీణ్,మాజీ అధ్యక్షులు తాటిపాముల విశ్వనాథం,మ్యాకల కాంతారావు,గాజంగి అశోక్,బొమ్మ కంటి గోపాల్, సభ్యులు మచ్చ నారాయణ,మామిడాల లక్ష్మీనారాయణ,వాసం స్వామి,దాసరి గంగాధర్,దిలీప్,లక్ష్మీనారాయణ,ప్రభాకర్,గంగన్న,మధు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రాయికల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ రాయికల్ వారి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించి సుమారు 50 మంది బాలింతలకు మరియు గర్భిణీ స్త్రీలకు పండ్లు మరియు బ్రెడ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాయికల్ మున్సిపల్ మాజీ చైర్మన్ లయన్ మోర హనుమాన్లు మాట్లాడుతూ బిడ్డకు సరిపడా పాలు ఉండాలంటే గర్భంతో ఉన్నప్పుడే తల్లి పౌష్టికాహారం తీసుకోవాలని. ప్రోటీన్లు ఉండే పాలు, చేపలు, గుడ్లు, పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని. దీనివల్ల బిడ్డకు సరిపడా పాలు పుష్కలంగా లభిస్తాయని,తల్లికి కలిగే ప్రయోజనాలు బిడ్డకు ముర్రుపాలు పట్టడం వల్ల గర్భధారణ తర్వాత రక్తస్రావ ప్రమాదం తగ్గి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్లో రొమ్ము, అండాశయ క్యాన్స ర్లు, మధుమేహం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుం ది. జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. ఊబకాయం నుంచి తప్పించుకోవచ్చు. గర్భదారణకు పూర్వం ఉండే బరువును మళ్లీ పొందవచ్చు. తల్లిపాలు పుష్కలంగా రావాలంటే గర్భిణిగా ఉన్నప్పటి నుంచి పోషక విలువల ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి సూచించారు. ఈ కార్యక్రమంలో డయాబెటిక్ డిస్టిక్ కోఆర్డినేటర్ బత్తిని భూమయ్య, రాయికల్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రమాదేవి , వాసం ప్రసాద్, వెంకట్ రెడ్డి, ప్రసాద్ ,సుధవేణి మురళి ,సాంబారు శ్రీనివాస్ ,మరియు డాక్టర్లు స్థానిక ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొన్నారు,
జగిత్యాల జిల్లాలోని జర్నలిస్టుల సంక్షేమానికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. మంగళవారం రాయికల్ పట్టణంలోని మార్కండేయ పద్మశాలి సంఘం భవనంలో జేఏసీ ఆధ్వర్యంలో ఐజేయు నూతన జిల్లా కార్యవర్గానికి ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చీటి శ్రీనివాస్ మాట్లాడుతూ, "జర్నలిస్టులకు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం,ఆరోగ్య కార్డులు,బీమా వంటివి అందించేందుకు కృషి చేస్తాను. జర్నలిస్టులు ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే వారధిలా పనిచేస్తున్నారు. కానీ వారి సమస్యలు మాత్రం ఇంకా పరిష్కారం కావడం లేదు. వాటిని అధికారులకు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాను," అని అన్నారు. రాయికల్కి చెందిన జర్నలిస్టులు ఐక్యతతో ఉన్నందుకు అభినందించిన ఆయన, ఇతర ప్రాంతాల్లో కూడా ఇది ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి, ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, అల్లె రాము, సంయుక్త కార్యదర్శి గుర్రం చంద్రశేఖర్, కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగిరెడ్డి రఘుపతి, ఇందూరి నరేష్, బూరం లక్ష్మణ్, పెరంబుదూరు శ్రీకాంత్, రాయికల్ ప్రెస్ జేఏసీ అధ్యక్షుడు వాసరి రవి, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల జగదీశ్వర్, సాంస్కృతిక కార్యదర్శి డాక్టర్ ఏ.ఎం. రాజు రెడ్డి, సంయుక్త కార్యదర్శి గంగాధరి సురేష్, సీనియర్ పాత్రికేయులు సింగిడి శంకర్, ముజాఫర్, బొంగోని శ్రీనివాస్, సింగని శ్యాంసుందర్, వాసం లింబాద్రి,గంట్యాల ప్రవీణ్, ఇమ్మడి విజయ్, తీగల గోపి, శ్రీను, వెంకటేష్, కిరణ్ రావు, నరేష్, శంకర్, షాకీర్, రమాపతిరావు, గంగాధర్, భీమరాజు, కళ్యాణ్, రషీద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
మెట్ పల్లి లో జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో అల్లీపూర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పదవతరగతి చదువుతున్న టి.అనూష షాట్పుట్ విభాగంలో ప్రథమ స్థానం సాధించి ఆగస్టు 3,4 తేదీలలో హన్మకొండలో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు ఎం. శ్రీనివాస్, పి. డి.కృష్ణ ప్రసాద్ తెలిపారు . ఎంపికైన విద్యార్థినిని ఉపాధ్యాయులు,గ్రామ పెద్దలు అభినందించారు.
రాయికల్ మండల కేంద్రంలోని ప్రణుతి జూనియర్ కళాశాలలో గంజాయి, మత్తు పదార్థాల పైన, బెట్టింగ్ యాప్స్, మొబైల్ పైన విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించి, ప్రతి ఒక్క విద్యార్థి కూడా డ్రగ్స్ మాయలో పడకుండా ఉండాలి. మాదక ద్రవ్యాలను ఎట్టి పరిస్థితుల్లో సేవించరాదు. బెట్టింగ్ యాప్స్ కి ప్రతి ఒక్కరు కూడా దూరంగా ఉండాలి అని మరియు మన భారతదేశం ను డ్రగ్స్ లేని సమాజంగా మనమంతా కలిసి నిర్మిద్దాం. మీ దృష్టికి మత్తు పదార్థాలను స్వీకరిస్తున్నట్టు ఎవరైనా కనిపిస్తే వెంటనే మీ పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వండి లేదంటే డయల్ తెలంగాణ పోలీస్ 112 కాల్ చేసి సమాచారాన్ని తెలపండి. అలాగే మిలటరీ జాబ్స్ కి తెలంగాణ స్టేట్ పోలీస్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా మా సైనిక గ్రూప్ అండగా ఉంటుంది అని జగిత్యాల ఇంచార్జ్ పంచతి బాలరాజు తెలిపారు.ఈ సదస్సును పురస్కరించుకొని ఇటీవలే ఆర్మీ నుండి రిటైర్డ్ అయిన మాజీ సైనిక అధికారి భూపతిపూర్ గ్రామానికి చెందిన నూకల మల్లేశం గారిని ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తిరుపతి, మాజీ సైనిక అధికారి నూకల మల్లేష్, పోలీస్ కానిస్టేబుల్ మనోజ్, శ్రీ నేతాజీ యూత్ అధ్యక్షులు అస్లాం,నరేష్, మధు, రాజేందర్, వేణుగోపాల్, కే.శేఖర్, రాజశేఖర్, వినయ్, లెక్చరర్ బృందం పాల్గొన్నారు.
రాయికల్ మండలం అయోధ్య గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల ఆధార్ నమోదు, అప్డేట్ కొరకు ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటుచేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆధార్ నమోదు కేంద్రం సూపర్వైజర్ గంట్యాల ప్రవీణ్ మాట్లాడుతూ 5- 7 సంవత్సరాల పిల్లలకు ఆధార్ అప్డేట్ కు ఎటువంటి ఛార్జీ లేకుండా ఉచితంగా ఆధార్ అప్డేట్ చేయడం జరుగుతుందని తెలిపారు. 7 సంవత్సరాలు దాటిన విద్యార్థులకు సాధారణ రుసుముతో అప్డేట్ అదేవిధంగా గ్రామ ప్రజలు బయోమెట్రిక్ అప్డేట్, ఫోన్ నెంబర్,చిరునామా, పుట్టిన తేదీలో మార్పులు సాధారణ రుసుముతో చేయబడును అని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో అయోధ్య మాజీ గ్రామ సర్పంచ్ జీవన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమరేందర్, ఉపాధ్యాయులు రాజ్ మహమ్మద్, శ్రీనివాస్ ఇతర ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ గంగజల, గ్రామ కారోబార్ రాజేందర్ మరియు పాఠశాల విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.