అట్టర్ ప్లాప్ అయినా కాంగ్రెస్ ప్రభుత్వం... * కటింగ్ లేకుండా వడ్లను కొనుగోలు చేయాలి * పెద్దపల్లి పార్లమెంట్ సీటు బిజెపిదే * బిజెపి ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ పెద్దపల్లి,మే20 (జనం గొంతు): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ప్లాప్ అయ్యిందని బిజెపి పార్లమెంటరీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడిచిన వారు ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని,రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోయిందని,కళ్ళల్లో ఉన్న వడ్లను వేగవంతంగా కొనుగోలు చేయాలని,తడిచిన ధాన్యాన్ని, ఎలాంటి కోత లేకుండా కొనాలని,రైతులకు అండగా బిజెపి ప్రభుత్వం ఉంటుందని, జాతీయస్థాయిలో రైతులను ఆదుకునీ అనేక సబ్సిడీలు ఇచ్చిన ఘనత బిజెపి ప్రభుత్వానిది అని అన్నారు.అదేవిధంగా పార్లమెంటరీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ 10 సంవత్సరాల సుపరిపాలన పై విశ్వాసంతో ఓటు వేసిన ప్రజలకు,బిజెపి గెలుపు కోసం ప్రతి గ్రామ గ్రామాన పనిచేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సమావేశంలో బిజెపి పార్లమెంట్ కన్వీనర్ వెంకటేష్ గౌడ్, బిజెపి అసెంబ్లీ కన్వీనర్ దాడి సంతోష్, పార్లమెంట్ కో కన్వీనర్ లక్ష్మణ్ యాదవ్, తంగడ రాజేశ్వరరావు, పోసాని సంపత్ రావు, కావేటి రాజగోపాల్, మేకల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Comments 0