రాయికల్ //జనం గొంతుప్రవీణ్. జి తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా DMHO గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమంలో జన జాగృతి కళావేదిక కళాబృందం రాయికల్ మండలంలోని గాంధీ చౌక్ వద్ద కళాకారులు పల్లె సుద్దులు పాటలు మాటలతో ప్రజల్ని చైతన్య పరిచారు కళాబృంద కళాకారులు గడ్డం రమేష్, గంగాధర్ నాయక్, కునమల్ల సుమన్,డప్పు స్వామి రూప ప్రదర్శన ఇచ్చారు సమాజంలో అన్ని మారుతున్న తరుణంలో మన ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వహిస్తున్నాము కచ్చితంగా ఐ సి టి సి కేంద్రానికి వెళ్లి అందరు పరీక్షలు చేయించుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని కళాకారులు తెలిపారు.