రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామానికి చెందిన విజేత స్పోర్ట్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు గ్రామంలో జనాభా 3500 పైగా ఉందని , వృద్ధులు, రైతులు, కార్మికులు షుగర్,ఆస్తమా,బిపి వ్యాదులతో బాధపడుతున్నారు. సరైన రవాణా సౌకర్యాలు లేవు.అలాగే చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రాథమిక పాఠశాలకి, హైస్కూల్ కి విద్యార్థిని విద్యార్థులు వస్తున్నారని పల్లె దవాఖాన ఏర్పాటు చేసినట్లయితే మా గ్రామ ప్రజలకు మరింత సౌకర్యమైన వైద్య సేవలు అందుతాయని అన్నారు. కావున భూపతిపూర్ గ్రామానికి పల్లె దవాఖాన మంజూరు చేయాలని వడ్డే లింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి కస్తూరి సతీష్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు సోమ రమేష్ రెడ్డి, మామిడాల నాగరాజు, గుండోజీ నరేష్,చిట్టెటి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.
Comments 0