**అడ్వకేట్స్ అసోసియేషన్ ఎన్నికలలో విజయం సాధించిన ప్రముఖ న్యాయవాది నర్రి స్వామిని ఘనంగా సన్మానించి అంబేద్కర్ ఫోటో తో సత్కరించిన లాయర్స్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ యాదవ్** హైదరాబాదులోని లాయర్స్ పోరమ్ పర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ పోరంపర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునుగోడు నియోజకవర్గ కాంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రముఖ హైకోర్టు న్యాయవాది నూతనంగా చౌటుప్పల్ కోర్ట్ బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో లైబ్రరీ సెక్రటరీగా విజయం సాధించిన నర్రి స్వామి కుర్మ గారిని ఘనంగా సన్మానించిన లాయర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ హైకోర్టు న్యాయవాది నాగుల శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా నాగుల శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ నర్రి స్వామి కుర్మ గారు చిన్నతనంలోనే గురుకుల విద్యాలయంలో విద్యనభ్యసించి ఎంతో ప్రతిభను కనబరిచి ఇంటర్మీడియట్ అయిపోవడంతోనే అనేక ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన వదిలేసి ఉన్నతమైన చదువులు చదవాలని బీఎస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేసుకుని ఎంబీఏ చేసి **లా** విద్య అభ్యసించి అంచలంచలుగా ఎదుగుతూ గత చౌటుప్పల్ మొట్టమొదటి కోర్టు బారసోసియేషన్ ఏర్పడినప్పుడు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా గెలుపొంది మరల రెండో పర్యాయం ఎక్స్క్యూటివ్ కమిటీ లైబ్రరీ సెక్రటరీగా ఎన్నికవ్వడం చాలా సంతోషకరం అందుకనే వారు అంబేద్కర్ అంత గొప్పవారు కావాలని అంచలంచలుగా ఎదగాలని శాలువాతో సన్మానించి అంబేద్కర్ ఫోటో పవకరించామని తెలియజేశారు ఇదేకాక నర్రి స్వామి కుర్మ 20 సంవత్సరాలుగా అనేకమైనటువంటి సామాజిక పోరాటాల నిర్వహించి విద్యార్థి నాయకుడిగా యువజన నాయకునిగా మరియు బిసి ఉద్యమ నేతగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు లాయర్స్ ఫోరమ్ పర్ సోషల్ జస్టిస్ దర్శి తరపున రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులకు సమస్యలు పరిష్కరించాలని ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు సన్మానం పొందిన అనంతరం తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రముఖ హైకోర్టు న్యాయవాది చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ లైబ్రరీ కార్యదర్శి నర్రి స్వామి కురుమ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి జరిగిన అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎన్నికలలో బడుగు బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులను గెలిపించుకోవడానికి అన్ని బారాసోసియేషన్లు తిరుగుతూనే నేను జన్మించిన మాతృభూమి మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ బారసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ లైబ్రరీ సెక్రెటరీగా ఎన్నికవ్వడం చాలా సంతోషకరం నన్ను చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ లైబ్రరీ కార్యదర్శి గా ఎన్నుకున్న న్యాయవాద కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని లాయర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్సిస్ రాష్ట్ర అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ యాదవ్ గారు శాలువాతో సన్మానించి భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోని బహుకరించడం చాలా సంతోషకరం.ఈ సన్మానాలు సమాజం పట్ల ప్రజల పట్ల న్యాయవాదుల పట్ల మరింత బాధ్యతను పెంచాయని మరింత బాధ్యతగా పనిచేస్తానని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో లాయర్స్ ఫోరమ్ రం పర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర నాయకులు సత్యనారాయణ, నాగేశ్వరరావు, రామారావు సుదర్శన్ నేత, ఓం ప్రకాష్ యాదవ్, సాయిబాబా యాదవ్, అనేకమంది వివిధ సామాజిక సంఘాల నాయకులు పాల్గొన్నారు