సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థి జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించాడు.ఈ నెల 03వ తేదీ ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రి లో 7వ జాతీయ స్థాయి ఓపెన్ కరాటే,కుంగ్ ఫు చాంపియన్‌ షిప్‌ పోటీల్లో జి హర్షవర్ధన్ కట, కుమ్మిత్ విభాగంలో బంగారు పతకాలు సాధించాడు.ఐపీఎస్ పాఠశాల డైరెక్టర్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ విద్యార్థిని అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ స్వీయ రక్షణకు,ఆత్మ రక్షణకు కరాటే అవసరమన్నారు.