రాయికల్ మండలం లోని రామాజి పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేసి, పదోన్నతి,బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయుల కు పాఠశాల పక్షాన ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గజ్జెల నరేందర్ అధ్యక్షతన జరిగిన వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథులు గా గ్రామ మాజీ సర్పంచ్ లు బెజ్జంకి మోహన్,వాసరి రవి యాదవ్, ఎస్.ఎం.సి మాజీ చైర్మన్ కటుకం రమేష్ మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో బదిలీ సహజమని బదిలీపై వెళ్ళిన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు రామాజి పేట్ పాఠశాలకు ఎనలేని సేవలు చేసారని,మంచి ఫలితాలు తీసుకవచ్చారని అందరు గర్వించే మంచి దేశభక్తి, జాతీయ భావాలు కలిగిన విద్యార్థులను తయారు చేసారని అన్నారు. గ్రామస్తుడిగా పాఠశాల హిందీ పండితుడిగా,సామాజిక కార్యకర్త గా పని చేసిన స్వామి యాదవ్ చేసిన సేవలు మరువలేనివని,ఉత్తేజం నిర్వహణలో సేవాకార్యక్రమాలు నిర్వహించడంలో ప్రత్యేకమైన పాత్ర పోషించారని అన్నారు. అనంతరం పదోన్నతి,బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులైన వేల్పుల స్వామి యాదవ్,వల్వోజు శ్రీనివాస చారీ,తంగళ్ళపెల్లి సతీష్,అంజుంబేగం లను శాలువాలతో సత్కరించి మెమొంటో,పుష్పగుచ్చాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తెనుగు రమేష్,లక్ష్మీ కాంతం,ప్రతాప్ రెడ్డి, మైస శేఖర్,బూసి రమ, జ్యోతి,యశోద,పూర్వ విద్యార్ధులు,విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.