అక్రిడేషన్ పాలసీకి ఇంత జాప్యమా? * వెంటనే ప్రకటించి అర్హులందరికీ వెంటనే కార్డులివ్వాలి * డబ్ల్యూజేఐ జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ డిమాండ్ * జర్నలిస్టుల సమస్యలపై ముఖ్యమంత్రిని కలుస్తాం * పాత చట్టాలను సవరించాలి హైదరాబాద్: తెలంగాణలో జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇచ్చే విధివిధానాలను వెంటనే ప్రకటించి , అర్హులైన అందరికీ వీలైనంత త్వరగా కార్డులు ఇవ్వాలని వర్కింగ్ జర్నలిస్ఠ్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ డిమాండ్ చేశారు. అక్రిడేషన్ పాలసీని సరళీకృతం చేయాలని సూచించారు. ఏడాది నుంచి ఈ అంశాన్ని తేల్చకపోవడం సమంజసం కాదన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పటిష్ఠమైన ఇన్సూరెన్స్ , ఆసుపత్రులలో ఉచిత చికిత్స, ఆరోగ్య కార్డులు తదితర అంశాలతో పాటు తెలంగాణ పాత్రికేయుల సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసి త్వరలో వినతిపత్రం ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైళ్లు, విమానాల టికెట్లలో జర్నలిస్టులకు రాయితీ ఇవ్వాలని, టోల్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయాలని తాము పోరాడుతున్నట్లు తెలిపారు. సెప్టెంబరులో దిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించి, ఈ అంశాలపై ప్రధాని మోదీకి విన్నవిస్తామని చెప్పారు. జర్నలిజం ప్రింట్ మీడియా నుంచి మొదలై వివిధ రూపాలకు విస్తరించినందున పాత చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ ప్రక్రియలో పాత్రికేయులకూ భాగస్వామ్యం కల్పించాలని కోరారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, గెజిటెడ్ అధికారులకు కల్పించే సౌకర్యాలను జర్నలిస్టులకు వర్తింపజేయాలన్నారు. జర్నలిస్టులు నిష్పక్షపాతంగా ఉంటేనే సమాజంలో వారిపట్ల గౌరవం పెరుగుతుందన్నారు. వారు దేశహితం కోసమే పని చేయాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో పాత్రికేయుల పాత్ర కీలకమని అన్నారు. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా పనిచేస్తున్నా సామాజిక అంశాల్లో జర్నలిస్టులు వెనకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో ఐక్యత లేకపోవడమే అందుకు కారణమన్నారు. ఆర్థిక భద్రత, ఉద్యోగ భద్రత తదితర అంశాల్లో వెనకబడి జర్నలిస్టులు వెనకబడి ఉన్నారని, దేశమంతా ఇదే స్థితి ఉందన్నారు. వారి పక్షాన పోరాడేందుకే వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) ఆవిష్కరించిందన్నారు. ప్రస్తుతం దేశంలోని 16 రాష్ట్రాల్లో పాత్రికేయుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని, దేశంలోని అన్ని రాష్ట్రాలలో తమ సభ్యులు ఉన్నారని సంజయ్ ఉపాధ్యాయ తెలిపారు. జాతీయ స్థాయిలో బీఎంఎస్ కు అనుబంధంగా పని చేస్తున్నామని, త్వరలో నేపాల్ కు కూడా విస్తరించబోతున్నట్లు వెల్లడించారు. నేడు విద్యా సదస్సు, పాత్రికేయులకు పురస్కారాలు జాతీయ విద్యావిధానం-2020, మీడియా పాత్ర అనే అంశంపై డబ్ల్యూజేఐ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఉస్మానియా యూనివర్సిటీలో జాతీయ సెమినార్ నిర్వహించనున్నట్లు డబ్ల్యూజేఐ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నందనం కృపాకర్ తెలిపారు. సాయంత్రం 5 గంటలకు ఉత్తమ జర్నలిస్టులకు పురస్కార ప్రదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. జర్నలిస్ఠులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. డబ్ల్యూజేఐ రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్, ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అనిల్ దేశాయ్, సిద్ధిరెడ్డి శ్రీనివాసరెడ్డి , కార్యదర్శి క్రాంతి, హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు బాలకృష్ణ పాల్గొన్నారు.
పాశ్చాత్య దేశాల నుండి వచ్చిన మేడేను బహిష్కరించి సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతిని కార్మిక దినోత్సవం గా జరపాలని భారతీయ మజ్దూర్ సంఘ్ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి పి మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నాడు జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో కూడా మే డే ను నిర్వహిస్తలేరు కానీ మనదేశంలో మాత్రం ఉనికి కోసం స్వలాభాల, రాజకీయాల కోసం కొంతమంది మే డేను నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రపంచ సప్త కులాలకు పనిముట్లు అందించిన ఆది గురువు విశ్వకర్మ ని కొనియాడారు. అలాంటి మహానుభావు ల జయంతిని నిర్వహించకుండా ఎక్కడో ఏదో జరిగిందని సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని స్వదేశం తిండి తింటూ విదేశీ పాట పాడుతున్నారని విదేశీ సిద్ధాంతాలను బలవంతంగా భారతదేశ కార్మికులపై రుద్దాలని చూస్తున్నారని విమర్శించారు. బ్రిటిష్ కాలం నాటి కార్మిక చట్టాలతో నేటికీ కార్మిక వర్గానికి న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతిని కార్మికులందరికీ సెలవు దినంగా ప్రకటించి అధికారికంగా భారత కార్మిక దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేశారు.
యు డైస్ వెరిఫికేషన్ పైన సమీక్షా సమావేశం * జనంగొంతు పెద్దపల్లి ఓదెల ఈరోజు తేదీ 21.04.2025 న మండల కేంద్రంలోని ఎం ఆర్ సి కార్యాలయం లో ప్రధానోపాధ్యాయుల మరియు డైట్ కాలేజ్ కరీంనగర్ శిక్షణ ఉపాధ్యాయుల సమీక్షా సమావేశం ఎర్ర రమేష్ మండల విద్యాధికారి ఓదెల ఆధ్వర్యం లో జరిగింది. ఓదెల మండలంలో ఎంపిక కాబడిన 20 ప్రభుత్వ పాఠశాలల లో కరీంనగర్ డైట్ కాలేజ్ శిక్షణ ఉపాధ్యాయులు కుమారి అఖిల మరియు కుమారి అమూల్య చే వెరిఫికేషన్ చేపించడం జరిగింది దీనిలో భాగంగా యు డైస్ లో నమోదు చేసిన సమాచారం క్రాస్ వెరిఫికేషన్ కోసం 20 పాఠశాలలను తేది 16.04.2025 నుండి తేది 21.04.2025 వరకు ప్రత్యక్షంగా పాఠశాల భవనాలు, తరగతి గదులు, మూత్రశాలలు, త్రాగునీరు, ల్యాబ్ పరికరాలు క్రీడా స్థలం, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు , మధ్యాహ్న భోజనం, వంటగది గార్డెన్ విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల వివరాలను సేకరించడం జరిగింది. కావున ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఓదెల మండల ఎం ఆర్ సి యందు డైట్ శిక్షణ ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ వారిని సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది వెంకటేష్ కుమార్ సి ఆర్ పి లు రజిత, ఓంకార్, రాజేందర్, తిరుపతిరావు, మరియు కాంప్లెక్స్ హెచ్ఎంలు సాంబయ్య, లక్ష్మీనారాయణ ,జ్యోతి ,మహేందర్ రెడ్డి ,అశోక్ ,నాగరాజ్ ,రమేష్ ,లు పాల్గొన్నారు.
జనం గొంతు పెద్దపల్లి ఓదెల* గత కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తు పత్రాలను ఎంపీడీవో కార్యాలయం లో ఇవ్వగలరు అని ఎంపీడీవో జి తిరుపతి తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం రోజున మండల పరిషత్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ చేసుకున్న దరఖాస్తు ఫామ్స్ తో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం మరియు ఏదైనా రంగంలో ప్రావీణ్యం ఉన్న సర్టిఫికెట్లు మరియు ఒక పాస్ పోర్ట్ సైజు ఫోటో సహా మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం 12 గంటలకు అందజేయగలరని ఎంపీడీవో తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని కార్మిక సంక్షేమమును పూర్తిగా విస్మరించిందని తెలంగాణ కన్స్ట్రక్షన్ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మోహన్ రెడ్డి విమర్శించారు.ఆదివారం నాడు కరీంనగర్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కార్మిక శాఖకు మంత్రి లేడని ఎద్దేవా చేశారు.కార్మిక శాఖ అధికారుల ఇష్టారాజ్యమైందని ఆరోపించారు.భవన నిర్మాణ కార్మికులకు చెందవలసిన నిధులను పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని,అందువల్ల కార్మికులకు కొత్త రూల్స్ పెట్టి లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కార్మిక శాఖ అధికారులు తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. సంవత్సరం కాలంగా బోర్డు నుంచి అందాల్సిన పథకాల రూపాయలు అందట్లేవని వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు.15 సంవత్సరాల నుండి కార్మికులకు కనీస వేతనం పెంపుకు నోచుకోవట్లేదని,ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ కార్మికుల కడుపు కొడుతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ,బి ఎం ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పప్పుల సురేష్,ప్రదీప్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కరీంనగర్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు పసుల శ్రావణ్,తోర్తి శ్రీనివాస్,మోగిలిపాలెం తిరుపతి,సత్యం తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్: వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా ( డబ్ల్యూ జే ఐ ) రూపొందించిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగం/దైనందినిని సోమవారం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సోమవారం రాత్రి శామీర్ పేటలోని తన నివాసంలో ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా వారు పాత్రికేయులకు, తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. డబ్ల్యూ జే ఐ కృషిని అభినందించారు. డబ్ల్యూ జే ఐ చేపట్టే అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. పాత్రికేయులకు, పంచాంగం/దైనందిని ఆవిష్కరణ కార్యక్రమంలో డబ్ల్యూ జే ఐ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నందనం కృపాకర్, అధ్యక్షుడు రాణాప్రతాప్ రజ్జూభయ్యా , ఉపాధ్యక్షుడు సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, అరుణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతాయత జర్నలిజం నేటి అవసరం * రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ * డబ్ల్యూజేఐ పంచాంగం ఆవిష్కరణ హైదరాబాద్: విలువలు, వాస్తవాలతో కూడిన బాధ్యతాయుతమైన జర్నలిజం ప్రస్తుత సమాజానికి అవసరమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభిప్రాయపడ్డారు. జర్నలిజం ప్రమాణాలను కాపాడేందుకు వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) ప్రతినిధులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అయన పేర్కొన్నారు. డబ్ల్యూజేఐ రూపొందించిన విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని ఆదివారం ఉదయం రాజ్ భవన్ లో ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పంచాంగాన్ని డబ్ల్యూజేఐ ప్రచురిండాన్ని ఆయన అభినందించారు. ఈ తరహా ప్రయత్నాలు సాంప్రదాయాలను సజీవంగా ఉంచడంలో, వాటిని నూతన తరం సులభంగా అర్థం చేసుకునేలా చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులకు, ప్రజలకు గవర్నర్ తెలుగు వత్సర శుభాభినందనలు తెలిపారు. * జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపిన కేంద్రమంత్రి * వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా ( డబ్ల్యూ జే ఐ ) రూపొందించిన పంచాంగాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ హైదరాబాద్ సిటీ కార్యాలయంలో విడుదల చేశారు. పంచాంగాన్ని అందంగా ముద్రించిన డబ్ల్యూ జే ఐ ని అభినందించారు. ఈ సంవత్సరంలో డబ్ల్యూ జే ఐ చేపట్టే అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తెలుగు జర్నలిజంలో డబ్ల్యూ జే ఐ ఒక ప్రత్యేకతను సంతరించుకోవాలని ... దేశహితానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అనతికాలంలోనే తెలంగాణలో డబ్ల్యూ జే ఐ వేగంగా పురోగమించడం శుభ పరిణామమన్నారు...ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.తెలిపారు. పంచాంగం/దైనందిని ఆవిష్కరణ కార్యక్రమాల్లో డబ్ల్యూ జే ఐ రాష్ట్ర సలహాదారుడు శ్రీ మురళీమనోహర్, గౌరవ అధ్యక్షుడు నందనం కృపాకర్, అధ్యక్షుడు రాణాప్రతాప్ రజ్జూభయ్యా , ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు బాలకృష్ణ పాల్గొన్నారు.
హైదరాబాద్: వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా ( డబ్ల్యూ జే ఐ ) రూపొందించిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగం/దైనందినిని రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు శుక్రవారం ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో డబ్ల్యూ జే ఐ ప్రతినిధులు వారిని కలిసి జర్నలిస్టుల సంక్షేమానికి యూనియన్ చేపట్ఠిన, చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. సమస్యల పరిష్కారానికి సహకరించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా మంత్రులు పాత్రికేయులకు, ప్రజలకు తెలుగు వత్సర శుభాభినందనలు తెలిపారు. సమస్యలపై పోరాటంలో తాము జర్నలిస్టుల వెంట కలిసి నడుస్తామని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ, ప్రధాన కార్యదర్శి నరేంద్ర భండారి, సీనియర్ ఉపాధ్యక్షుడు సంజయ్ సక్సేనాలు తమ సందేశాల్లో పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు , పాత్రికేయులకు వారు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పంచాంగం/దైనందిని ఆవిష్కరణ కార్యక్రమంలో డబ్ల్యూ జే ఐ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నందనం కృపాకర్, అధ్యక్షుడు రాణాప్రతాప్ రజ్జూభయ్యా , ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, కార్యదర్శి క్రాంతి ముదిరాజ్, నగర అధ్యక్షుడు బాలకృష్ణ పాల్గొన్నారు.
శాసనసభలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల అనంతరం రాష్ట్రంలో జర్నలిస్టుల లెక్కలు తీయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్, కార్యదర్శి శివనాద్రి ప్రమోద్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన పలువురు జర్నలిస్టులు టీయుడబ్ల్యూజే నుండి వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణలో చేరుతున్న సందర్భంగా ఆదివారం ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డబ్ల్యూజేఐ ఆధ్వర్యంలోని ప్రెస్ క్లబ్ కమిటీని ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ జర్నలిస్టులను గుర్తించడానికి ప్రాతిపదిక, ప్రమాణాలను కూడా ముఖ్యమంత్రి నిర్దేశిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో జర్నలిస్టుల స్థితిగతుల పరిశీలనకు ఉద్దేశించిన మీడియా అకాడమీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నప్పటికీ, దాని కర్తవ్య నిర్వహణలో వైఫల్యాలే ముఖ్యమంత్రి అసహనానికి కారణమై ఉంటుందని జర్నలిస్ట్ సమాజం భావిస్తోందన్నారు. రాష్ట్రంలో అసలు, సిసలు జర్నలిస్టుల లెక్కలు తీర్చే కార్యాన్ని ప్రభుత్వం, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మీడియా అకాడమీలలో ఎవరు నిర్వర్తిస్తారో అదే వేదికగా ముఖ్యమంత్రి ప్రకటిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా, వర్కింగ్ జర్నలిస్టుల చట్టంలో సవరణలకే దిక్కు లేనప్పుడు అవసరమైతే ఇక్కడ చట్టాలు తీసుకు వస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం బాగానే ఉన్నా, ఆచరణ సాధ్యమేనా అని ప్రశ్నించారు. జర్నలిస్టులను గుర్తించడానికి ఉన్న ప్రమాణాలు ఏమిటి? అందుకు అక్రిడిటేషన్ కార్డులే ప్రాతిపదికగా నిలుస్తాయా, సంస్థలు ఇచ్చే ఐడెంటి కార్డులు ప్రామాణికంగా నిలుస్తాయా అన్న విషయంపై కూడా స్పష్టత ఇస్తే బావుంటుందన్నారు. అన్ని వృత్తులు, సంఘాలలో అందరూ నిజాయితీపరులే ఉండాలని భావించడంలో అర్థం లేదని, అందుకు జర్నలిజం వృత్తి కూడా మినహాయింపు కాదన్నారు. అంతమాత్రాన మొత్తం జర్నలిస్టు సమాజాన్ని బజారున నిలబెడదామని అనుకోవడంలో అర్థం లేదన్నారు. అక్రిడిటేషన్ల నిబంధనలు తయారు చేయడానికి ప్రభుత్వం నియమించిన కమిటీ అధ్యక్షుని నిష్క్రియ ప్రియత్నంవల్ల ఈరోజుకు అందుకు సంబంధించి అడుగు ముందుకు పడలేదని, దీంతో ప్రతి మూడు నెలలకు ఒకసారి అక్రిడిటేషన్లను రెన్యువల్ చేయించాల్సిన దుస్థితి దాపురించిందని అన్నారు. మీడియా అకాడమీ పాలకవర్గానికి ప్రభుత్వం ఆమోదం ముద్ర వేసి ఏడాది పూర్తవుతున్నా, గ్రామీణ జర్నలిస్టుల శిక్షణ తరగతులు నిర్వహించలేని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు. ఈ వైఫల్యాల నుండి జర్నలిస్టు సమాజాన్ని దారి మరల్చేందుకు రాష్ట్రాలు తమకు మించిన సంఘం లేదని గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. తమది మొనగాడు సంఘమని ఒక నాయకుడు ఛాతి విరుచుకుంటున్నాడని, జర్నలిస్టులను మోసం చేయడంలో, వారిని అడ్డం పెట్టుకొని తాములబ్ది పొందడంలో వాళ్లది మొనగాడు సంఘమేనని తెలిపారు. డబ్ల్యూజెఐ సిరిసిల్ల బాధ్యుడు గంగు సతీష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముస్తాబాద్ మండల ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ఎన్నిక చేశారు. అధ్యక్షునిగా అబ్రమేని దేవేందర్, అధ్యక్షులుగా మేకర్తి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కారెడ్ల రాజ్ కిరణ్ రెడ్డి, కోశాధికారిగా ఏర్పుల రాజు ఎన్నికయ్యారు. డబ్ల్యూజేఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరు కరుణాకర్, రాష్ట్ర కార్యదర్శి శివనాద్రి ప్రమోద్ వారిని శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఆధార్ నమోదు కేంద్రాన్ని రాయికల్ మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ,మండల ప్రజలు ,విద్యార్థులు ఆధార్ నమోదు కేంద్రం లో అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆధార్ నమోదు కేంద్రం నిర్వాహకులు గంట్యాల ప్రవీణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.