|
modi add 1

అక్రమంగా అర్ధరాత్రి మట్టి తవ్వకాలు...

రాయికల్ పట్టణ పెద్ద చెరువు ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా సారవంతమైన చెరువు మట్టిని అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్నారు. కొందరు అక్రమార్కుల కన్ను దీనిపై పడింది ఇష్ట రాజ్యాంగ తవ్వకాలు జరిపి చెరువు ఆకృతిని దెబ్బతీస్తున్నారు సోమవారం అమావాస్య అదునుగా చేసుకొని అధికారుల కండ్లు కప్పి రాత్రి సమయంలో యథెచ్చగా చెరువు గర్భంలోని మట్టిని కొల్లగొడుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా జెసిబి లతో తవ్వి టాక్టర్లలో అనువైన ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు, ఇరిగేషన్ రెవెన్యూ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే యథేచ్చగా చెరువుల్లో మట్టిని తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

By Gantyala Praveen | June 16, 2026 | 0 Comments

తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుడికి ప్రభుత్వ అండ ఎప్పుడు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో చురుకుగా పాల్గొని యువత, విద్యార్థులు, ప్రజల్లో చైతన్యం కల్పించిన ఉద్యమకారుడు,రెండు సంవత్సరాల క్రితం కాలు కోల్పోయిన దివ్యాంగుడు మల్లారెడ్డి నేడు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. 70 సంవత్సరాల వయస్సు దాటినా, దివ్యాంగుడిగా జీవనం సాగిస్తున్నప్పటికీ ఆయనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం లేదా పెన్షన్ అందకపోవడం స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది.తెలంగాణ ఉద్యమ సమయంలో రాయికల్ ప్రాంతంలో ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లడంలో మల్లారెడ్డి కీలక పాత్ర పోషించినట్లు స్థానికులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర సాధన కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను ఉద్యమం వైపు ఆకర్షించిన ఆయన, ప్రస్తుతం వృద్ధాప్యం మరియు దివ్యాంగత్వంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి గౌరవించాలని, ముఖ్యంగా మల్లారెడ్డికి తక్షణమే దివ్యాంగుల పెన్షన్ మంజూరు చేసి ఆర్థిక భరోసా కల్పించాలని కోరుతున్నారు. ఉద్యమ సమయంలో సమాజం కోసం సేవలందించిన వ్యక్తి నేడు సహాయం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి మల్లారెడ్డి పరిస్థితిని పరిశీలించి తగిన సహాయం అందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టే క్రమంలో ఉద్యమకారుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

By Gantyala Praveen | June 16, 2026 | 0 Comments

లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీకాలనీ అధ్యక్షురాలిగా డా. శరణ్య యాదవ్ ఎన్నిక

జూన్ 21న జిల్లా మాజీ గవర్నర్ డా. విజయ రేకులపల్లి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీకాలనీ నూతన అధ్యక్షురాలిగా డా. శరణ్య యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2026–2027 సంవత్సరానికి నూతన కార్యవర్గ ఎన్నికలను లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్లు కావేటి రాజగోపాల్, భాస్కర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించగా సభ్యులు ఏకగ్రీవంగా డా. శరణ్య యాదవ్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుత అధ్యక్షులు లయన్ మేకల మారుతి యాదవ్ పదవీకాలం జూన్ 30తో ముగియనుంది. ఆయన నాయకత్వంలో 2025–2026 సంవత్సరంలో క్లబ్ నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలను గుర్తించిన లయన్స్ ఇంటర్నేషనల్, ఆయనను హంగర్ రిలీఫ్ (ఆకలి నివారణ కార్యక్రమాలు) విభాగానికి జిల్లా క్యాబినెట్ చైర్‌పర్సన్‌గా నియమించింది. నూతన కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా అబ్బు కేశవ రెడ్డి, కోశాధికారిగా టీవీ సురేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్లుగా దుబ్బాక సత్యరెడ్డి, బుద్ధర్తి బుచ్చన్న పటేల్ తదితరులు ఎన్నికయ్యారు. వివిధ విభాగాల కోఆర్డినేటర్లు, చైర్‌పర్సన్లు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లను కూడా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జూన్ 21న సెంటినరీకాలనీలోని సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు క్లబ్ ప్రతినిధులు తెలిపారు. జిల్లా మాజీ గవర్నర్ డా. విజయ రేకులపల్లి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ నాయకులు మాట్లాడుతూ.. పేద ప్రజలకు సేవలు అందించడంలో లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. సమాజ సేవపై ఆసక్తి ఉన్నవారు క్లబ్‌లో చేరి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. నూతన అధ్యక్షురాలు డా. శరణ్య యాదవ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సభ్యుల సహకారంతో 2026–2027 సంవత్సరంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి క్లబ్‌ను మరింత బలోపేతం చేస్తానని పేర్కొన్నారు.

By Ambati Sathish kumar | June 15, 2026 | 0 Comments

ఎన్టీపీసీ అధికారులతో ఆర్జీ-3 జీఎం సమీక్ష సమావేశం బొగ్గు నాణ్యత, రవాణా అంశాలపై కీలక చర్చ

సింగరేణి రామగుండం-3 ఏరియా పరిధిలో బొగ్గు నాణ్యత, రవాణా అంశాలపై సోమవారం ఆర్జీ-3 జీఎం కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్జీ-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎన్టీపీసీ జనరల్ మేనేజర్ (ఓ & ఎం) మనీష్ అగర్వాల్‌తో పాటు ఇరు సంస్థల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొగ్గు సరఫరా, నాణ్యత ప్రమాణాలు, రవాణా ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై అధికారులు చర్చించారు. నాణ్యమైన బొగ్గును నిర్ణీత సమయంలో ఎన్టీపీసీకి రవాణా చేయడానికి పరస్పర సహకారం అవసరమని జీఎం సుంకర మధుసూదన్ పేర్కొన్నారు. సింగరేణి–ఎన్టీపీసీ మధ్య సమన్వయంతో పనిచేస్తూ బొగ్గు రవాణాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు. దీనికి స్పందించిన ఎన్టీపీసీ అధికారులు తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఓటు జీఎం ఎం. రామ్మోహన్, ఏరియా ఇంజనీర్ ఏ. ఉదయ భాస్కర్, నాణ్యత అధికారి ఆసిఫ్ యాసిన్, ఎన్టీపీసీ అధికారులు హేమంత్ షిండే, ప్రసాద్ మందడి, అటల్ గైక్వాడ్, రాధాకృష్ణ, దస్తగిరి, మహేష్ చమత్ తదితరులు పాల్గొన్నారు.

By Ambati Sathish kumar | June 15, 2026 | 0 Comments

ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించండి బేగంపేట హైస్కూల్ ఉపాధ్యాయుల ప్రచారం

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రచారం నిర్వహించారు. రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో సర్పంచ్ పల్లె ప్రతిమ పివీరావు ఆధ్వర్యంలో 9వ, 10వ తరగతి విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి బేగంపేట హైస్కూల్‌లో ప్రవేశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గణిత ఉపాధ్యాయులు మల్కా రాంకిషన్ రావు మాట్లాడుతూ తమ పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులకు గతంలో మాదిరిగానే విమానంలో విశాఖపట్నం విహారయాత్రకు తీసుకువెళ్లే అవకాశం కల్పిస్తామని తెలిపారు. అలాగే విద్యార్థుల కోసం ఉచిత రాకపోకల ఆటో సౌకర్యం అందిస్తున్నామని చెప్పారు. 10వ తరగతి విద్యార్థులకు రీడింగ్ కార్నర్ మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తూ విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఉపాధ్యాయులు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శైలజ, ఉపాధ్యాయులు మల్కా రాంకిషన్ రావు, పద్మజ, శ్రీనివాస్, సంపత్ కుమార్, గీతారాణి, మంగ, శ్రీదేవి, స్వరూప, పీఈటీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

By Ambati Sathish kumar | June 15, 2026 | 0 Comments

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

రాజీ మార్గంలో వివాదాల పరిష్కారమే లోక్ అదాలత్ ప్రధాన లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ న్యాయపరమైన సమస్యలకు త్వరితగతిన పరిష్కారం పొందాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా వివాదాలు శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా పరిష్కారమవుతాయని తెలిపారు. రాజీకి అనుకూలమైన క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆస్తి వివాదాలు, బ్యాంకు బకాయిలు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు తదితర అంశాలను ఇరుపక్షాల చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. చిన్నచిన్న వివాదాల కోసం కోర్టుల చుట్టూ తిరిగి సమయం, ధనం వృథా చేసుకోకుండా న్యాయశాఖ అందిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పరిధిలోని పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది రాజీకి అనువైన కేసులను గుర్తించి, సంబంధిత వ్యక్తులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరేలా కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. లోక్ అదాలత్‌లో ఇరుపక్షాల అంగీకారంతో కుదిరిన రాజీ చట్టపరంగా తుది తీర్పుగా పరిగణించబడుతుందని తెలిపారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తల సమన్వయంతో కేసుల పరిష్కార ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు, పోలీసు శాఖ, న్యాయస్థానాలు సమన్వయంతో పనిచేస్తే చిన్న వివాదాలు పెద్ద సమస్యలుగా మారకముందే పరిష్కరించవచ్చని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.

By Ambati Sathish kumar | June 15, 2026 | 0 Comments

సమన్వయంతో పని చేసి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయాలి: డిప్యూటీ మేయర్ ఎల్లయ్య

కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ఆర్‌పీలు సమన్వయంతో పని చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు చేరేలా కృషి చేయాలని రామగుండం నగర డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 1, 2, 3, 4, 24 నుంచి 34వ డివిజన్లకు సంబంధించిన క్లస్టర్ స్థాయి వార్డు సభను సోమవారం ఎన్‌టీపీసీ పీటీఎస్‌లోని కాకతీయ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి అర్హులందరికీ ప్రయోజనాలు అందేలా చూడాలని సూచించారు. స్వచ్ఛ రామగుండం లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి వార్డు బాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాబోయే వర్షాకాలంలో ఎలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. సెల్‌ఫోన్ వినియోగం వల్ల పిల్లలు చెడు అలవాట్లకు గురికాకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణశ్రీ మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు. కాలువల పూడిక తొలగింపు, రోడ్ల గుంతల పూడ్చివేత, నీటి నిల్వలు నివారణ, శిథిల భవనాల తొలగింపు, పైప్‌లైన్ లీకేజీల మరమ్మతులు వంటి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రజలు పరిశుభ్రత పాటించి కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. ఈ సమావేశంలో ఏసీపీ ముడుత రమేష్ ట్రాఫిక్ నిబంధనలు, ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఎంఆర్వో రవీందర్ ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై వివరించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారి అతుల్య అంటువ్యాధుల నివారణ చర్యలపై, ఐసీడీఎస్ సీడీపీవో ఆలేఖ్య పటేల్ అంగన్‌వాడీ సేవలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, అసిస్టెంట్ కమిషనర్ సంపత్, ఏసీపీ శ్రీహరి, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు

By Ambati Sathish kumar | June 08, 2026 | 0 Comments

ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు క్షేత్రస్థాయిలో బందోబస్తును పరిశీలించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిశోర్ ఝా క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు, పోలీసు సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గాలు, కీలక కూడళ్లు, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన కమిషనర్, పర్యటన పూర్తయ్యే వరకు అధికారులు పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించాలని సూచించారు. పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, భద్రతా చర్యల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పోలీస్ కమిషనర్ వెల్లడించారు.

By Ambati Sathish kumar | June 01, 2026 | 0 Comments

రామగుండం నగర పాలక సంస్థలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఘన సన్మానం

రామగుండం నగర పాలక సంస్థలో శనివారం పదవీ విరమణ పొందిన సూపరింటెండింగ్ ఇంజినీర్ గురువీర, పబ్లిక్ హెల్త్ వర్కర్లు ఈదునూరి పోషం, కాదాసు రాజయ్య, తిప్పారపు ఐలయ్యలకు ఘనంగా సన్మానం నిర్వహించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కమిషనర్ జె. అరుణ శ్రీ, నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొని పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, ఉద్యోగులు తమ విధుల్లో నిబద్ధతతో పనిచేసి నగర అభివృద్ధికి విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. వారి సేవలను నగర పాలక సంస్థ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు.అనంతరం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

By Ambati Sathish kumar | May 30, 2026 | 0 Comments

మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు.. పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ మహంకాళి స్వామి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, బట్టలను పంపిణీ చేశారు. కొప్పుల శంకర్ మాట్లాడుతూ శ్రీధర్ బాబు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, న్యాయవాదులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

By Ambati Sathish kumar | May 30, 2026 | 0 Comments

Hot Categories

2
7
1