భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న పాశ్చాత్య పోకడలలో కొత్తగా వచ్చి చేరిన మరో అనాగరిక సాంప్రదాయమే, డింక్ కల్చర్. డింక్ అంటే డ్యూయల్ ఇన్కమ్ బట్ నో కిడ్స్. అంటే భార్య భర్త ఇద్దరు సంపాదిస్తారు. కానీ పిల్లలు కనడానికి ఇష్టం ఉండదు. భారతజాతి మనగడకు ప్రతి బంధకంగా మారుతున్న కొత్త దురాచారం మరియు ప్రకృతి విరుద్ధమైన ప్రయత్నం ఇది. సజీవుల ప్రాథమిక లక్షణాలు ఏడు విధాలుగా ఉంటాయి. అవి 1. పెరుగుదల. 2. చలనం 3. ఆకలి లేదా ఆహారాన్ని స్వీకరించడం. 4. శ్వాసక్రియ.5. విసర్జన.6. ప్రేరణ- ప్రతిస్పందన లేదా క్షోభ్యత.7.ప్రత్యుత్పత్తి నాగరికత అభివృద్ధి చెందింది అని భావించే ప్రస్తుత తరుణంలో, శాస్త్ర సాంకేతిక ప్రగతి మానవ జీవన గమనాన్ని తిరోగమన లేదా ప్రకృతి నియమానికి విరుద్ధంగా తీసుకెళ్తుంది. పిల్లలు కలగకుండా కుటుంబ నియంత్రణ పాటించటం. ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు,ఆపై అసలే వద్దు. అనే కుటుంభనియంత్రణ ప్రచారంతో ఎక్కువ ఆకర్షితులు మరియు ప్రభావితులు అయింది హిందువులు మాత్రమే. అందుకే స్వాతంత్రానంతరం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం హిందూ జనాభాను తగ్గించడానికి విసిరిన పాచికలో బలి అయింది హిందువులే. ఏ యుద్ధం,రక్తపాతం లేకుండానే పథకం ప్రకారం హిందూ జనాభాను తగ్గించగలిగారు. గర్భధారణ జరగగానే ఆరోగ్యం శిశు క్షేమం కోసం ఎప్పటికప్పుడు వైద్యున్ని సంప్రదించటంలో తప్పులేదు. కాని అధికంగా మందులు వాడటం వలన పుట్టిన శిశువుల్లో క్షోభ్యత మందగించటం, తద్వారా హిందూ జనాభా క్రియా హీనంగా మారటం జరుగుతోంది. హిందూ జనాభాను తగ్గించాలనుకునే సెక్యులర్ ముసుగులో ఉన్న వైద్యులు హిందువులపై పన్నే కుట్రలో రెండు రకాలు ఉంటాయి 1. ప్రసవ సమయంలో చేసే పెద్ద ఆపరేషన్ లేదా సిజేరియన్. 2. వివిధ కారణాలతో గర్భసంచిని తొలగించటం. ఇలా ఎలాంటి అలజడి లేకుండానే హిందూ జనాభాను తగ్గించే ప్రయత్నం విజయవంతం అవుతూనే ఉంది. ధనార్జనే ధ్యేయంగా పనిచేసే కొందరు డాక్టర్లు మరియు డయాగ్నోస్ సెంటర్స్ లింగ నిర్ధారణ పరీక్షలు చేసి తల్లి గర్భంలో కనుక ఆడపిల్ల ఉంటే వెంటనే బ్రూనహత్యలకు ఉసిగొల్పుతున్నారు. ఈ విధానం వలన హిందూ జనాభాలో లింగ అసమతౌల్యం ఏర్పడి ఆడ, మగ జనాభా నిష్పత్తిలో తీవ్ర తేడాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం PNDT ప్రీ నాటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్ అనే చట్టం 1994 లో చేసింది. 2003లో ఈ చట్టానికి మరికొన్ని సవరణలు చేసి ముందస్తు లింగ నిర్ధారణ పరీక్షలను నిషేధించడం జరిగింది కానీ డబ్బుకు కక్కుర్తి పడే కొందరు గర్భస్థ శిశువు ఆడపిల్ల అని తెలియగానే బ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు ఈ హత్యలకు శిశువు యొక్క తల్లిదండ్రులు కూడా కారణమే. ఈ అనాగరిక విధానాల వల్ల కొన్ని ఉన్నత వర్గాల లేదా అగ్రవర్ణాల కుటుంబాలలో ఆడపిల్లలే కరువయ్యారు. ఇప్పుడు ఆ కుటుంబాల పరిస్థితి అమ్మాయి దొరికితే చాలు అనే స్థాయికి చేరింది. హిందువుల మానసిక స్థితిలో మార్పు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. సంతానాన్ని ధనార్చనకు లేదా కెరియర్ కు అడ్డంకిగా భావించటం, ఆడపిల్లల్ని భారంగా భావించటం మానుకోవాలి. గర్భసంచి తొలగింపు, సరోగసి లేదా అద్దెగర్భం వంటి ప్రకృతి విరుద్ధమైన చర్యలకు దూరంగా ఉండాలి. అలాగే కొత్తగా వచ్చిన డింక్ కల్చర్ కి పూర్తి దూరంగా ఉండాలి. లేకపోతే హిందూ జనాభా పతనం తీవ్రం అవుతుంది. ఆకలి మనిషికి ఎంత అవసరమో, ప్రత్యుత్పత్తి అంతే అవసరమని హిందువులు గుర్తించాలి.లేదంటే హిందూ జాతి మనుగడ కష్టం అవుతుంది. సంతానం సమస్యలకు మూలం అనే సంకుచిత ధోరణి విడనాడాలి. కుటుంభ జీవనంలో ఉండే మాధుర్యం మరియు విలువ తెలుసుకోవాలి. వ్యక్తిగత ఇష్టాల కంటే సామాజిక కట్టుబాట్లు, సామాజిక జీవనం గొప్పదని తెలుసుకోవాలి. సంతానాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దటం. కుటుంబ బాంధవ్యాల అంతరార్థం, ప్రాధాన్యత తెలుసుకొని ఇల్లే ఇలలో స్వర్గసీమ అనే భావన, బాంధవ్యాలు, పిల్లలు గొప్ప అనే స్థితి ప్రతి హిందువులో ఏర్పడాలి. అని ఆశిస్తున్నాను. వ్యాసకర్త రుద్రోజు శ్రీనివాస్ సామాజిక కార్యకర్త కరినగర్ 505001 సెల్ నం.9440763351
Comments 0