మల్యాల లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జనం గొంతు /మల్యాల ప్రతినిధి మల్యాల మండల కేంద్రంలో మంగళవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బ్లాక్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనమందరం మన రాజ్యాంగ విలువలను పాటిస్తూ దేశంలో శాంతి, అభివృద్ధి, సమృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో దొంగ ఆనందరెడ్డి, దారం ఆదిరెడ్డి, బత్తిని శ్రీనివాస్ గౌడ్,మ్యాక లక్ష్మణ్, బోట్ల ప్రసాద్, శనిగరపు తిరుపతి,తాళ్ల హరినాథ్, జలంధర్, నర్సయ్య,విశ్వనాథ్, గంగ స్వామి, నాంపల్లి, శ్రీనివాస్, ఇమామ్, తదితరులు పాల్గొన్నారు.