మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీసు మీద కాంగ్రెస్ కార్యకర్తల దాడినీ ఖండిస్తూ రాయికల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ మరియు మండల నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడతూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీసు మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు ఈ దాడికి తెగపడడం విచారకరం.రాష్ట్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకే రక్షణ లేకుంటే, సాధారణ ప్రజల సంగతి ఏంటో అర్థం అవుతుంది. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుంది. ప్రతిపక్షం పై దాడులు చేస్తూ, అధికార పక్షంకు అండగా నిలవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం.రేవంత్ రెడ్డి కేవలం కాంగ్రెస్ పార్టీకి సీఎం కాదు - తెలంగాణ రాష్ట్రానికి అని గుర్తుంచుకోవాలి. రైతులకు రుణమాఫీ సక్రమంగా చేయలేక దాన్ని దృష్టి మళ్లించడానికి దాడులను మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమంలో ప్రజల కొరకు అనేకసార్లు పదువులను లెక్క చేయకుండా రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి హరీష్ రావు పోలీసులు ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు రక్షణ ఇచ్చిన విధంగానే ప్రజాస్వామ్య పరిరక్షణ కు తోడ్పాడాలి. కేసీఆర్ పాలనను సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలి. గత పదేళ్ల పాలనలో ఎక్కడ ప్రతిపక్షం పై దాడులు జరగలేదు. అభివృద్ధి, సంక్షేమమే ఎజెండగా కేసీఆర్ పాలన సాగించారు. హరీష్ రావు కార్యాలయం పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల మహిళ అధ్యక్షురాలు స్పందన,పట్టణ అధ్యక్షుడు అనిల్,కౌన్సిలర్లు శ్రీధర్ రెడ్డి,మహేష్ గౌడ్,మాజీ ఏ ఎం సి చైర్మన్ ఉదయ శ్రీ, మండల మాజీ వైస్ ఎంపీపీ మహేశ్వర్ రావు,మాజీ ఏఎంసి వైస్ చైర్మన్లు కొల్లూరి వేణు,బర్కం మల్లేష్,మండల మైనార్టీ అధ్యక్షుడు ఎం.డి చాంద్ పాషా,మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు నీరటి శ్రీను,మండల నాయకులు సురేందర్ నాయక్,రత్నాకర్ రావు,కంటి గంగారాం,సాగర్ రావు,ప్రతాప్ రెడ్డి,రొట్టె శ్రీనివాస్,మండల యూత్ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.