రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ పట్టణంలో గత 150 సంవత్సరాల క్రితం నుండి కొనసాగుతున్న చరిత్రక భీమన్న రథోత్సవం ఘనంగా జరిగింది ముందుగా ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి రథం ముందుంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ నిర్వహకుల పూజారులు అనంతరం రథోత్సవాన్ని జరిపించారు దావతోల్లు మేక పిల్లల్ని గావు పట్టగా భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ దావ వసంత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు పోరండ్ల గ్రామం నుండి కోడలుగా వచ్చిన భీమక్క అనే మహిళ భీమేశ్వరుని ప్రతిష్టించగా జాతర చిన్నగా ప్రారంభమై ఇప్పుడు జిల్లా కేంద్రంలోని అతిపెద్ద జాతరగా పేరుగాంచింది దాదాపు లక్షకు పైగా భక్తులు జాతరకు వచ్చినట్లు ఒక అంచనా ఉంది చిన్న పిల్లల కేరింతల మధ్య బొమ్మల తినుబండారాల దుకాణాలు, జాయింట్ వీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి సత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో సురక్షిత త్రాగునీటి సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దేవుని నర్సయ్య,రాజం,లింగయ్య, చిన్నరాజం,రాజన్న,రెడ్డి,రాజేందర్,కునారపు భుమేష్,శేఖర్ రాజు,లక్ష్మన్,హరీష్, పాల్గొన్నారు.
Comments 0