*-జలుబు చేసిన జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి.* *-అందుబాటులో ఉండని వైద్యులు, అందని వైద్యం.* *-నిధులు ఉన్న నిరుపయోగంగా సౌకర్యాలు,* *-నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని డిమాండ్.* *షేక్ సాబిర్ అలి,* సామాజిక కార్యకర్త. జమ్మికుంట ప్రభుత్వ 30పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రోగులకు అదనపు సౌకర్యాల ద్రుష్ఠ్య గతంలో ఆధునికరించటం జరిగింది. ఈ ఆసుపత్రికి చుట్టూ ప్రక్కల గ్రామాల నుండి నిత్యం అత్యవసర మరియు దీర్ఘకాలిక మరియు డయాగ్నస్టిక్ మరియు ప్రసూతి సంబంధిత వైద్యం విషయమై వందలాది మంది రోగులు వారి బంధువులు వస్తుంటారు. కానీ అధికారుల పర్యవేక్షణ లోపం మరియు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ పూర్తిస్థాయి వైద్య సేవలు, సౌకర్యాలు అందుబాటులో లేక రోగులు మరియు వారి బంధువులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందులో రోగులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేందుకు వైద్యులకు స్టాప్ క్వార్టర్స్ అందుబాటులో ఉన్న కూడా విధుల్లో ఉండి కూడా వైద్యులు అందుబాటులో లేని కారణంగా సకాలంలో వైద్యం అందక రోగులు ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసిన దుస్థితి. మరీ ముఖ్యంగా మార్చురి నిర్వహణ సరిగా లేక పోస్టుమార్టం కోసం సైతం ఆసుపత్రి డ్రెస్సింగ్ సిబ్బంది మరియు అటెండర్ లపై ఆధారపడాల్సిన దుస్థితి. ఈ సందర్భంగా వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా సరైన మానిటరింగ్ సిస్టం లేక ఆసుపత్రికి వెచ్చించాల్సిన నిధులలో సైతం అక్రమాలు జరుగుతున్నాయని తెలియుచున్నది. ఇట్టి విషయాలపై ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులచే క్షేత్ర స్థాయిలో విచారణ జరిపిస్తూ బాధ్యులపై శాఖపరమైన చర్యలతో పాటు ఆసుపత్రిని అప్గ్రేడ్ చేస్తూ ఆసుపత్రి యందు రోగులకు వారి బంధువులకు పూర్తిస్థాయి సేవలను కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆసుపత్రి అభ్యున్నతి మరియు రోగుల అవసరముల దృష్ట్యా రిలే దీక్షల ద్వారా సమస్యల సాకారానికీ ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
Comments 0