ఖని ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఫోటోగ్రాఫర్ అసోసియేషన్. గోదావరిఖని/జనంగొంతు/అంబటి సతీష్/9666033355/ ఈ రోజు గోదావరిఖని లోని స్థానిక గాంధీనగర్ లో గాలి సంతోష్ (సతీష్) నివసిస్తూ గత రెండు సంవత్సరాల నుండి క్యాన్సర్ వారితో బాధపడుతూ గత 13 రోజుల క్రితం క్యాన్సర్ వ్యాధితో మృతి చెందడం జరిగింది. చనిపోయిన ఫోటోగ్రాఫర్ గాలి సంతోష్( సతీష్) కుటుంబానికి అసోసియేషన్ ద్వారా₹ 33030/- ఆర్థిక సహాయం గోదావరిఖని ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా జమ చేసినటువంటి₹ 33030/- రూపాయలను వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. చనిపోయిన ఫోటోగ్రాఫర్ గాలి సంతోష్ కు ఇద్దరు చిన్నపిల్లలు కుమారుడు కుమార్తె, ఇట్టి ఆర్థిక సహాయం చేసిన కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ సలహాదారులు బైరం సతీష్, అధ్యక్షులు రెడ్డి భాస్కర్, ప్రధాన కార్యదర్శి శనిగరపు మల్లేష్ కోశాధికారి బండారి ప్రసాద్, అసోసియేషన్ సభ్యులు గూడూరు శ్యాంసుందర్ , దుస్స మహేష్, తోగటి శ్రీధర్, గూడెల్లి శ్రీనివాస్ , రామగిరి శ్రీనివాస్ గడమల్ల రఘు, మోర విక్రమ్, గూడూరు పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.