జగిత్యాల పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు దుమల గంగారం మాదిగ మాట్లాడుతూ.కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం చేసిన రిజర్వేషన్ రద్దు చేసి ఇటీవల కాలంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు చేసిన విషయం తెలిసిందే. జగిత్యాల జిల్లాలో జనాభా తమాషా ప్రకారం రెండు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వాల్సి ఉండగా ఒకటి ధర్మపురి ఎస్సీ కాగా జగిత్యాల నియోజకవర్గంలో రాయికల్ జగిత్యాల ప్రస్తుతం జనరల్ చేశారు.గత ప్రభుత్వ రాయికల్ మాదిగలకు మార్కెట్ కమిటీ అవకాశం ఇచ్చాన కొద్దిరోజుల్లోనే పదవిపోవడం జరిగింది. రాయికల్ లో అదే రిజర్వేషన్ ఉంచకుండా జగిత్యాల నియోజకవర్గనికి ప్రాతినిత్యం వహిస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రిజర్వేషన్ జనరల్ చేసి మాదిగలను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మమ్ములను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.జగిత్యాల నియోజకవర్గ నాలుగు మండల లో రెండు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండగా జగిత్యాల రాయికల్ జనరల్ కాగా అందులో ఒక మా మాదిగ సామాజిక వర్గానికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చి తన చిత్తశుద్ధి చాటుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. వివిధ మాధ్యమాల్లో ఎంపీకి పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది,ఈ రెండు మండలాల్లో ఏదో ఒకటి మా మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించకపోతే మిమ్మల్ని రానున్న రోజుల్లోఎంపీ కూడా ఓడ కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఎమ్మార్పీఎస్ జిల్లా పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్,ఉపాధ్యక్షులు బోనగిరి కిషన్,డివిజన్ అధ్యక్షులు నక్క సతీష్,ఎమ్మార్పీఎస్ నాయకులు బొల్లె అనిల్, దుమల గంగాధర్, సతీష్,తదితరులు పాల్గొన్నారు