రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి జాన్స్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డేవలప్మెంట్ సొసైటి ఆధ్వర్యంలో '' జీర్ట్స్'' సేవ పురస్కార్ అవార్డ్స్ - 2024 ప్రదానోత్సవాన్ని మేడిపల్లి మండలం వెంకట్రావుపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జీర్ట్స్ స్వచ్చంద సంస్థ 17వ వార్షికోత్సవం సందర్భంగా చైర్మెన్ అంగడి ఆనంద్ జగిత్యాల జిల్లాలో వివిధ రంగాలలో విస్తృత సేవలు అందిస్తున్న 40 మందికి అవార్డులు ప్రధానం చేశారు.అందులో రాయికల్ పట్టణం నుండి కడకుంట్ల జగదీశ్వర్, ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి, బూరుగుల రాజేందర్, మొసరపు సంతోష్ మహితాపూర్ గ్రామం నుండి అజారుద్దీన్, గంగుల శ్రీనివాస్, ఆలూరు గ్రామం నుండి మెక్కొండ రాంరెడ్డి, ఎలిపెద్ది మల్లారెడ్డి, నర్సారెడ్డి లు అవార్డు తీసుకున్న వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వీరిని పలువురు అభినందించారు.