బడ్జెట్‌లో విద్యారంగానికి పెరిగిన ప్రాధాన్యత పై హర్షం ఆర్.యు.పి.పి.టి జగిత్యాల జిల్లా శాఖ రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను గురువారం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు గతం కంటే పెరగడాన్ని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు జగిత్యాల జిల్లా పక్షాన స్వాగతిస్తున్నామని జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్ తెలిపారు. 275891 కోట్ల బడ్జెట్ లో 21389 కోట్లు 7.75 శాతం విద్యారంగానికి కేటాయించడం, గత సంవత్సరం 6.7శాతం మాత్రమే కేటాయించారని, పాఠశాల విద్యకు 17931.42 కోట్లు గత సం. 16092 కోట్లు, ఉన్నత విద్యకు 2959.10 కోట్లు, 3001 కోట్లు, సాంకేతిక విద్యకు 487.64 కోట్లు కేటాయించారని మొత్తంగా విద్యారంగానికి కేటాయింపులు పెరిగినప్పటికీ కాంగ్రెస్ మానిఫెస్టోలో పేర్కొన్నట్లుగా 15% కెటాయించలేకపోయారని, అయితే ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ గురుకుల విద్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి నిధులు కెటాయించటం హర్షణీయని, మెగా డియస్సీ నిర్వహించాలని, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, అన్ని పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేస్తామని నిర్ణయించటం, ప్రతి మండలంలో అత్యాధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు రూ.500 కోట్లు ప్రతిపాదించడం మంచి నిర్ణయమని, ఈ పాఠశాలలు మండలానికి ఒకటి కాకుండా జనాభా ప్రాతిపదికన అవసరమైనచోట అదనంగా ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలలనే పబ్లిక్ స్కూల్స్ గా మార్చి అభివృద్ది చేయాలని భాషా పండితుల కు పదోన్నతులు కల్పించాలని, ఇప్పుడిస్తున్న ఐదు శాతం ఐ.ఆర్. మరో 25 శాతం కలిపి 30 శాతం ఇవ్వాలని కోరారు.