మాదకద్రవ్య రహిత సమాజం నిర్మిద్దాం అంటూ రాయికల్ పట్టణం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు సోమవారం ప్రతిజ్ఞ చేశారు. నవ ముక్త్ భారత్ అభియాన్ క్రింద ఐక్యమై భారతదేశ యువత ను నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు విద్యార్థులు పూనుకోవాలని ఉపాధ్యాయులు సూచించారు . ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గట్టు రమేష్ నర్సయ్య, ఉపాధ్యాయులు జొంగోని రాజేశం పి.రాజశేఖర్ చెరుకు మహేశ్వర శర్మ కె.ప్రశాంత్ లక్కాడి రాజరెడ్డి వేల్పుల గంగారాజం పుర్రె శ్రీనివాస్ మండలోజు రవీందర్ అయిత పద్మ ఏనుగు రజిత విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు