రాయికల్ మండలoలోని కిష్టంపేట,కుమ్మర్ పల్లి, ఆయోధ్య, గ్రామాలలో సోమవారం రోజున ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో ముందస్తు రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సేవా బస్తీలలో పురుషులకు, మహిళలకు, పిల్లలకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ధర్మ జాగరణ ప్రముఖ్ తిరుకోవెల సురేందర్ మాట్లాడుతూ రక్షాబంధన్ అంటే రక్షణ, బాధ్యత లేదా సంరక్షణ యొక్క బంధం అని అన్నారు. ఈ రక్ష ఇంటింటికి వెళ్లాలన్న సంకల్పంతో ప్రతి ఇంటికి వెళ్లి ఈ రాఖీలను కడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమం లో శీలం సంతోష్, పాలికా శేఖర్, పడాల శ్రీనివాస్, అయోధ్య నుండి పసుపునూరి శ్రీనివాస్, కిష్టంపేట్ నుండి భోగ హరికృష్ణ, సిరిపురం సురేష్, ఆడెపు సురేష్, మరియు సమితి సభ్యులు పాల్గొన్నారు.