రాయికల్ మండలoలోని కిష్టంపేట,కుమ్మర్ పల్లి, ఆయోధ్య, గ్రామాలలో సోమవారం రోజున ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో ముందస్తు రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సేవా బస్తీలలో పురుషులకు, మహిళలకు, పిల్లలకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ధర్మ జాగరణ ప్రముఖ్ తిరుకోవెల సురేందర్ మాట్లాడుతూ రక్షాబంధన్ అంటే రక్షణ, బాధ్యత లేదా సంరక్షణ యొక్క బంధం అని అన్నారు. ఈ రక్ష ఇంటింటికి వెళ్లాలన్న సంకల్పంతో ప్రతి ఇంటికి వెళ్లి ఈ రాఖీలను కడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమం లో శీలం సంతోష్, పాలికా శేఖర్, పడాల శ్రీనివాస్, అయోధ్య నుండి పసుపునూరి శ్రీనివాస్, కిష్టంపేట్ నుండి భోగ హరికృష్ణ, సిరిపురం సురేష్, ఆడెపు సురేష్, మరియు సమితి సభ్యులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.