గోదావరిఖనిలోని 34 వ డివిజన్ జవహర్ నగర్ లో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన తోకల కళ్యాణి వాళ్ళ అమ్మ కీర్తిశేషులు తోకల లక్ష్మి సంవత్సరికం సందర్భంగా పెద్దదిక్కు లేని నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులను అందజేసిన శ్రీ సీతారామచంద్ర స్వచ్ఛంద సేవ సంస్థ. సంస్థ సభ్యులు అయిన గడ్డం వాసంతి వెంకటేష్ అన్నయ్య అయినటువంటి కీర్తిశేషులు గడ్డం నాగరాజు జ్ఞాపకార్ధంగా 50 కేజీల బియ్యం ఒక నెల సరిపడు నిత్య అవసర సరుకులు నిరుపేద కుటుంబానికి చెందిన తోకల కళ్యాణి కుటుంబానికి అందజేయడం జరిగింది. ఇంత చక్కటి కార్యక్రమానికి సహకరించిన గడ్డం వాసంతి వెంకటేష్ కుటుంబానికి శ్రీ సీతారామ చంద్ర స్వచ్ఛంద సేవా సంస్థ వారు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మాతంగి శివరాజ్ మిట్టపల్లి అశోక్ చందా చంద్రమోహన్ మద్దెల తిరుపతి పసునూటి నరేందర్ ఊటుకూరి రాజు శ్రీనివాస్ గడ్డం శివాజీ అలుగోజు రాజు చారి కాసర్ల సదా శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.