|
modi add 1

కేశవ్ బలీరాం హెడ్గేవార్ (ఏప్రిల్ 1, 1889 - జూన్ 21, 1940) (ఆర్. యస్. యస్.) వ్యవస్థాపకులు. (జూన్ 21న హెగ్డేవార్ వర్ధంతి సందర్భంగా)

యుగ ద్రష్ట 'హిందు చైతన్య శక్తి'కేశవ్ బలిరాంహెగ్డేవార్ మహాపురుషులు మరణించిన వారి బోధనలు కార్యశీలత‌ చూపిన మార్గం సమాజాన్ని ప్రభావితం చేస్తాయి.హిందూ సమాజ సంఘటనకు 'ఐక్యతకు వికసిత్ భారత్ లక్ష్య సాధనకు దిశ దశను నిర్దేశించిన హెగ్డే వార్ చూపిన మార్గం నేటికిఅనుసరణీయం. జన జాగృతి _డాక్టర్ హెగ్డేవార్. కొంతమంది మహాపురుషులు భవిష్యత్తునుగురించినదార్శనికత 'సత్యాన్ని అనుభవించి, తమధృడమైనఆత్మబలంతోను, ధృడ విశ్వాసంతోను ముందుతరాలకుమార్గదర్శనం చేస్తారు. కొంత మంది సమాజ హితమే లక్ష్యంగా తమ జీవన విధానాన్ని గడుపుతూ త్యాగం 'సమాజ సేవా 'జన జాగృతి కొరకు తమ జీవితాన్ని అంకితం చేసిన కారణ జన్ముడు కేశవ్ బలరాం హెగ్దేవార్. హిందూ సమాజానికి మార్గదర్శి_ డాక్టర్ 'హెగ్డేవార్. కొంత మంది థైర్య సాహసాలతో లక్ష్య సాధనకు పట్టుదల నిరంతరం చైతన్యం తోకృషి చేస్తూ ప్రతికూల పరిస్థితులలో సమాజానికి దారి చూపుతూ జీవిస్తారు. సమాజ చీకటిని పారదోలే దీపంగ వెలుగు నిస్తారు. డాక్టర్ హెగ్డేవార్ అదే మార్గంలో పయనించి హిందూసమాజానికిమార్గదర్శిగా నిలవడం గమనార్హం. డాక్టర్ 'జీ _ఒక ఆశాజ్యోతి గురూజీ వాఖ్య. ఏదో ఒకసామాజిక కార్యక్రమం స్వీకరించి చేయడం మొదలు పెట్టిన తర్వాత వచ్చిన కష్టాలను ఎదుర్కొనక నిరాశ' నిస్పృహలకు లోనయ్యే వారికి డాక్టర్ జీ జీవితం నుంచి ఒక ఆశాజ్యోతి 'దివ్య సందేశం ప్రాప్తమై ప్రేరణ లభించగలదు. .. __గురూజీ డాక్టర్ జీ _యువతపై ప్రభావం. డాక్టర్ జీ కార్య కుశలత 'దృఢ దీక్ష 'దేశభక్తి యువతను ప్రభావితం చేసింది . వారు మరణించిన తరువాత కూడా వారి దూరదృష్టి సమాజం అంతటికీ వెలుగునిస్తూ ఉంటుంది. అటువంటివారినే 'యుగ ప్రవక్త' లేక 'యుగ ద్రష్ట' అంటారు. 1925 సం" లో ఆర్ 'ఎస్' ఎస్ స్థాపన _డాక్టర్ 'హెగ్డేవార్. హిందూ జాతీయవాద సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వ్యవస్థాపకులు డా||హెడ్గేవార్ మహారాష్ట్ర నాగపూర్ పట్టణంలో 1925 వ సంవత్సరంలోస్థాపించారు. డాక్టర్జీ 'హెగ్డేవార్ పై జాతీయవాద ఉద్యమాల ప్రభావం డాక్టర్ హెగ్డేవార్ కాంగ్రెస్ సభ్యుడిగా బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం అనుభవించాడు. డాక్టర్ హెగ్డేవార్ 'స్వామి వివేకానంద 'లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ఆలోచనలకు ప్రభావితమై పరాయి పాలన నుండి దేశాన్ని విముక్తి చేసి ధర్మ రక్షణకు జరిగిన ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. అజాద్ హిందూ ఫౌజ్ లాంటి జాతీయవాద సంస్థల ఉద్యమాలు డాక్టర్ జీ నీప్రభావితంచేశాయి.అరబిందో లాంటి హిందూ సామాజిక ఆధ్యాత్మిక సంస్కర్త ల ప్రభావానికి లోనైన హెగ్డే వార్ 1921లో కిలాఫత్ ఆందోళనకు మహాత్మాగాంధీ ఇచ్చిన మద్దతు నచ్చక దేశ పరిస్థితుల దృష్ట్యా చెల్లచెదరైన హిందూ సమాజాన్ని ఏకం చేయాలని సంకల్పించాడు. కులాలు' జాతులు 'వర్గాలు' వర్ణాలు పేరుతో ఎవరికి వారే ఉంటున్న హిందూ సమాజాన్ని ఏకం చేయాలని సంకల్పించాడు. హిందూ ఐక్యత ధర్మ రక్షణ కొరకు 1925లో విజయదశమి రోజున కేవలం 5 గురు సభ్యులతో అర్‌'ఎస్' ఎస్ ను స్థాపించారు . ప్రపంచంలో అతిపెద్ద స్వచ్చంధ సంస్థ_ ఆర్ 'ఎస్' ఎస్. నాగపూర్ పట్టణంలో గుప్పెడు మందితో ప్రారంభమైన ఆర్' ఎస్' ఎస్ హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు విస్తరించింది. నేడు ప్రపంచంలో అతిపెద్ద స్వచ్చంధ సంస్థగా గుర్తింపు పొందింది . దేశం నలమూలల ప్రతి రోజు 80'000 శాఖలతో లక్షలాది స్వయం సేవకులు నిండు గుండెల్లో "భారత్ మాతాకీ జై"అంటూ ఐక్యతా నినాదాన్ని మంత్రాలుగా మలిచి ప్రతి వ్యక్తిలో జాతీయభావాలు నిరిపోశాడు. సంఘ శాఖల ద్వారా దేశభక్తులను తయారీని ప్రారంభించారు. ఆర్' ఎస్ 'ఎస్ హిందూ సమాజ ఐక్యతకు 'ధర్మ రక్షణకు జాతీయవాద పరివ్యాప్తికి నిరంతరం కృషి చేస్తుంది. జాతీయవాదం_ ధర్మ రక్షణ హిందూ ఐక్యత _ఆర్' ఎస్' ఎస్ లక్ష్యం. భారతీయుల్లో జాతీయవాదాన్ని ధర్మం కోసం హిందూ ఐక్యత కోసం జరిగిన ఎన్నో పోరాటాలకు ఆర్' ఎస్' ఎస్ స్ఫూర్తి. దేశం కోసం వ్యక్తుల్లో సమర్పణ భావాన్ని ప్రేరేపించడంలో ఆర్ 'ఎస్' ఎస్ మహత్తర పాత్రను పోషిస్తుంది. సమాజ సేవలో_ భాగస్వామ్యం. ఆర్ 'ఎస్ 'ఎస్ శాఖకు ప్రత్యక్షంగా రాకపోయినా పరోపక్షంగా అనేక క్షేత్రాల్లో ఎంతో మందిని సమాజ సేవలో దేశ మాత సేవలో తరింపచేస్తున్న గొప్ప సంస్థ ఆర్ 'ఎస్' ఎస్. దేశమేమిన్న _దేశమే సర్వస్వం_ఆర్ 'ఎస్' ఎస్. హిందూ ఐక్యతే ధ్యేయంగా దేశాన్ని బ్రిటిష్ వారి బానిసత్వం నుండి విముక్తి చేయడానికి అవిరళ పోరాట పటిమ ప్రదర్శించిన ఆర్ 'ఎస్ ఎస్ సమాజంపై గట్టి ప్రభావాన్ని చూపింది. చారిత్రిక తప్పిదాలను ఎండగడుతూ దేశమే మిన్న దేశమే సర్వస్వం అనుకోగల వ్యక్తుల సమూహాన్ని సమాజానికి అందిస్తుంది. సామాజిక సమరసతకు_ పెద్దపీట. సంఘ్ శాఖల్లో సామాజిక సమరతకు అధిక ప్రాధాన్యం ఇస్తారు.కుల జాడ్యానికి తావు లేకుండా స్వయం సేవకులను తయారు చేశారు. "ఆంధరం హిందువులం అందరం భారతీయులం " అనే ఆత్మీయ భావనను తీసుకువచ్చారు. సంఘ శిభిరాన్ని సందర్శించిన మహాత్మాగాంధీ' అంబేద్కర్ కులం గురించి ప్రశ్నిస్తే మేమంతా హిందువులం అని చెప్పడం వల్ల కులాల కుంపటి లేకుండా సామాజిక సమరసత వెళ్ళి విరియడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్ హెగ్డేవార్ ఒక చైతన్య శక్తి. డాక్టర్జీ హెగ్డేవార్ ఆశించిన ఫలితాలుసాకారమై కనపడుతున్నాయి. అలాంటి సంస్థకు అంకురార్పణ చేసిన మనిషి నిజమైన దృష్ట అటువంటి యుగ ప్రవక్తలలో అగ్రశ్రేణి కి చెందిన వ్యక్తి మాత్రమే కాదు హెగ్దేవార్ ఒక చైతన్య శక్తిగా సమకాలీన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు . డాక్టర్ హెగ్డేవార్_ జననం. హెగ్డేవార్ పూర్వీకులు తెలంగాణలోని మహరాష్ట్ర సరిహద్దు సమీపాన బోధన్ తాలూకాలోని కందకుర్తి అనే చిన్న గ్రామానికి చెందిన వారు 1889ఏప్రిల్ 1( ఉగాది పండుగ రోజున) బలిరాం పంత్ హెగ్డేవార్ 'రేవతి బాయి దంపతులకు కేశవరావు బలిరాం హెగ్డేవార్ జన్మించారు. కుందుర్తి గ్రామం వద్ద గోదావరిలో మంజీర హరిద్ర నదులు కలిసి త్రివేణి సంగమం ఏర్పడుతుంది. ఆర్.ఎస్.ఎస్. పేరు దేశ విదేశాల్లో కోట్లమంది ప్రజలకు తెలుసు. కాని ఆర్.ఎస్.ఎస్. స్థాపకులు డా||బలీరాం కేశవ హెడ్గేవార్ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది వింతగా కనిపించినా నిజం. ఆయన గురించి కొంత తెలిసిన వారికి కూడ వారి గొప్పదనం, వారి దూరదృష్టి గురించి తెలియక పోవచ్చు. గొప్ప సంఘసంస్కర్త _డాక్టర్ హెగ్డేవార్. డా||కేశవ్ బలీరాం హెడ్గేవార్ మన జాతికే కాదు యావత్ మానవాళికీ తోడ్పడ్డారు. హిందూ జాతి పునర్ వికాసానికి శక్తి వంతమైన జాతి నిర్మాణానికి బలమైన పునాదులు వేసిన గొప్ప సంఘ సంస్కర్త . నిత్యం జరిగే అర్ 'ఎస్ 'ఎస్ శాఖ ను వ్యక్తిత్వ నిర్మాణానికి వికాసానికి 'ఐక్యతా శక్తికి వేదికగా మార్చిన రూపశిల్పి. ధర్మ రక్షణ పునాదుల మీద దేశరక్షణకు అవిరళ కృషి చేసిన ఆదర్శ పురుషుడు హెగ్దేవార్. యుగ దృష్ట _డాక్టర్ హెగ్డేవార్ . కొంతమంది మహాపురుషులు భవిష్యత్తును గురించిన సత్యాన్ని అనుభవించి, తమ ధృడమైన ఆత్మ బలంతోను, ధృడ విశ్వాసంతోను ముందు తరాలకు మార్గదర్శనం చేస్తారు. ప్రతికూల పరిస్థితులలో సమాజానికి దారి చూపుతూ జీవిస్తారు. వారు మరణించిన తరువాత కూడా వారి దూరదృష్టి సమాజం అంతటికీ వెలుగునిస్తూ ఉంటుంది. అటువంటి వారు భౌతికంగా ప్రజలకు దూరమైనా, వారిని అనుసరించే వారు పెరుగుతూనే ఉంటారు. అటువంటి మహా పురుషులు తమకు ప్రజలలో పేరు ప్రఖ్యాతులు రావాలనీ, విస్తృత ప్రజానీకానికి తాము పరిచయం కావాలని కోరుకోరు. అటువంటివారినే 'యుగ ప్రవక్త' లేక 'యుగ ద్రష్ట' అంటారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్థాపకులు డా|| హెడ్గేవార్ అటువంటి యుగ ప్రవక్తలలో ఒకరు. ఆర్ 'ఎస్' ఎస్ పెద్ద సంఖ్యలో స్వచ్చంధ సేవకులను నిర్మాణం చేస్తుంది. దేశం సంక్షోభ సమయంలో దేశానికి సేవ చేయగల వ్యక్తులను మంచి తనం మానవీయత సమర్పణ భావం సంస్కారవంతమైన సమాజాన్ని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం ఆర్ 'ఎస్' ఎస్ యొక్క లక్ష్యం నేను కాదు_ మనం అనే సమిష్టి భావన పరివ్యాప్తి_ ఆర్ 'ఎస్ 'ఎస్. నేను ఒంటరిని కాదు. నా చుట్టూ ఉన్న సమాజం నాది. ఆది నాతోనే ఉంటుంది అని హిందూ సమాజం నరనరాల్లో నేను కాదు మనం అనే భావన ఇంకిపోవాలనే ఆలోచించి స్థాపించిన ఆర్ ఎస్ ఎస్ వ్యక్తుల్లో సమష్టి భావన వ్యాప్తిలో కృతకుత్త మైందనీ చెప్పవచ్చు. భారత్ మాతాకీ జై నినాదం_ ఐక్యతా మంత్రం. సంఘ శాఖలో దేశంలో వేర్వేరు సాంప్రదాయాలు పాటించే వారు వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారైనప్పటికీ ముక్త కంఠంతో భారత్ మాతాకీ జై అని నినదిస్థారు. ఇది ఒక ఐక్యతా మంత్రం.తద్వారా భారతదేశం నాదేశం అనే భావన బలపడుతుంది. అంటరాని తనం 'భాషాబేధం 'ప్రాంత బేధం అంతరించి పోతుంది. అందరిని ఒకే విధంగా ప్రేమించడం .'సమానత్వం పాటించడం జరుగుతుంది. అధికార బోధ కాకుండా కర్తవ్య బోధజాగృతమౌతుంది. సంఘం పరిది _విస్తరణ. సంఘం తన కార్యక్రమాలు ప్రారంభించుకొని 99 సంవత్సరాలు పూర్తయింది. సంఘం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్ ఎస్ ఎస్ కార్యపరిధిని మరింత విస్తృత పరచడంకోసం సంఘ ఆలోచన పరివ్యాప్తి కోసం జాతీయవాద శక్తుల బలోపేతం ద్వారా దేశ రక్షణ ధర్మ రక్షణలో పౌరసమాజం క్రియా శీలక పాత్రను చోదక శక్తిగా తీర్చిదిద్దాలని సంకల్పంచడం జరిగింది. ఐదు అంశాలు ఎంపిక. సంఘ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని 5 అంశాలను ఎంపిక చేయడం జరిగింది. సామరస్యత_ సంస్కారం. 1)వ్యక్తిగత కుటుంబ సామాజిక వ్యవహారాలు సామరస్య పూర్వకంగా జరగాలి. అంటరాని తనం నిర్మూలించబడాలి. కుటుంబాల్లో సంస్కారం పెరగాలి పర్యావరణ రక్షణ. 2) పౌరసమాజం పర్యావరణ రక్షణ 'నీటి వినియోగం 'నీటి సంరక్షణ ప్రతి వ్యక్తి పుట్టిన రోజు ఒక మొక్కను నాటడం కాలుష్య నివారణ 'ప్లాస్టిక్ వినియోగం రద్దు. తప్పని సరి ఓటు హక్కు. 3)సామాజిక బాధ్యతలను నిర్వహించడం తప్పని సరి ఓటు హక్కును వినియోగించాలి. స్వదేశీ _స్వాభిమానం. 4) స్వదేశీ భావన పరివ్యాప్తి చేయడం స్వాభిమానం ఉపాధిఅవకాశాలను మెరుగుపరచడం. ప్రతి ఒక్కరు ఖద్దరు వస్త్రాన్ని ధరించడం. 5) సహజ వనరుల రక్షణ దేశ భాషల పట్ల స్వాభిమానాన్ని పెంచడం. భూకంపం వరదలు తుపాను అకాల ప్రకృతి విపత్తులు కుంభమేళాలు సంభవించినప్పుడు బాధితులకు సాయం చేయడానికి ముందుకు వచ్చే సమాజ సేవకులను ఆర్ ఎస్ ఎస్ తయారు చేస్తుంది మనం అనే భావనతో సేవాకార్యక్రమాలు. దేశంలో ప్రస్తుతం స్వయం సేవకుల ద్వారా మనం అనే భావన తో 160000సేవా కార్యక్రమాలు జరుగు తున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాలు భారత దేశానికే పరిమితం కాలేదు. హిందూ స్వయం సేవక్ సంఘ్ పేరుతో ప్రపంచములో 80 దేశాల్లో విస్తృతంగా పనిచేస్తుంది. సమాజంలో కర్తవ్య భావనను జాగృతం చేయడం జరుగుతుంది. కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలో వలస కూలీలకు ఆహారం నివాసం ఇచ్చి ఆదుకొని ఆపన్న హస్తం అందించిన సమస్త మానవ కళ్యాణం కోసం నిరంతర కృషి చేసే సంస్థ కార్యకలాపాల విస్థ్రరణకు స్ఫూర్తి దాతగా నిలిచిన హెగ్దేవార్ జయంతిని స్మరించుకోవడం వారి ఆశయాల సాధనకు పనిచేసే స్ఫూర్తిని మనలో నింపిన ఆధునిక యుగ ద్రష్ట ప్రవక్త గా నిలవడం భారత జాతికి గర్వకారణం. నేదునూరి కనకయ్య అధ్యక్షులు తెలంగాణ ఎకనామిక్ ఫోరం సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక 'తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం కరీంనగర్ 9440245771

By NYALAKONDA ANIL DESAI | June 21, 2025 | 0 Comments

రాఖీ పండుగ అంటే ఏంటి.. దీని విశిష్టత ఏంటి..?

పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కర కాలం పాటు యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు, తన పరివారం అంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడని , భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచించి రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించి ముందుకు పంపుతుంది. అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను అత్యంత భక్తితో పూజించి రక్షను దేవేంద్రుడు చేతికి కడుతుంది. ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా వెళ్ళిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం. అప్పటినుండి ఇప్పటివరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగగా మారింది. ఇక నాటి నుండే ఈ పండుగ ఆచారంగా కొనసాగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథ మాత్రమే కాదు రక్షాబంధనం గురించి ఇంకా బోలెడన్ని పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీకృష్ణుడు శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడు చూపుడువేలుకు గాయం కావడంతో అది గమనించిన ద్రౌపతి తన పట్టు చీర కొంగు చూపి కృష్ణుడి చేతికి కట్టు కట్టిందట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపతి హామీ అందుకు ప్రతిగా దుశ్శాసనుడు దురాగతం నుండి ఆమెను శ్రీకృష్ణుడు కాడా కాపాడారని పురాణాలు చెబుతున్నాయి. అంతే కాదు శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళలోకానికి వెళ్లిన ఉండిపోగా, విష్ణు తీసుకువెళ్లడానికి వచ్చిన లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రక్షాబంధనాన్ని కట్టి , రక్షాబంధనాన్ని కట్టిన తనకు రక్షణ కల్పించమని లక్ష్మీదేవి బలిచక్రవర్తిని కోరుతుంది. బలి చక్రవర్తి సోదరుడిగా తనకు రక్షాబంధనాన్ని కట్టిన సోదరికి బహుమానంగా విష్ణుమూర్తిని పంపుతాడు. దీంతో లక్ష్మీదేవి తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది. అంతటి శక్తివంతమైన బంధనం కాబట్టి రక్షాబంధనానికి ఇంతటి చరిత్ర ఉంది. ఈనాటికీ ప్రతి ఒక్కరు రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో జరుపుకునే ఈ పండుగను మన దేశ వ్యాప్తంగా సోదరులు సోదరీమణులు తమ మధ్య ఉన్న ప్రేమానురాగాలకు ప్రతీక గా జరుపుకుంటారు. రాఖీ పండుగ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని, రాఖీ కట్టడానికి సిద్ధమవుతారు సోదరీమణులు. సోదరులు కూడా తమ ప్రియమైన సోదరీమణులు కట్టే రాఖీలను స్వీకరించి వారిని సంతోష పెట్టేలా వారికి బహుమానం ఇవ్వడానికి రెడీ అవుతారు. "యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బద్నామి రక్ష మాచల మాచల" అనే శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు. ఆ తరువాత హారతి ఇచ్చి, నుదుటన బొట్టు పెట్టి స్వీట్ తినిపిస్తారు. చెల్లెలు అన్న ఆశీర్వాదాన్ని, అక్కలు తమ్ముళ్లకు ఆశీస్సులను అందిస్తారు. నిండు నూరేళ్లు సుఖంగా జీవించమని దీవిస్తారు. నీకు నేను ఎప్పుడూ రక్ష అని చెప్తూనే, నాకు నువ్వు రక్షణగా ఉండాలని ధర్మాన్ని రక్షాబంధనంతో బోధిస్తారు. ఇక రక్షా బంధనం రోజు సోదరులు ఇచ్చే బహుమతులంటే సోదరీ మణులకు ఎనలేని ప్రేమ . వారికి ఇచ్చే బహుమతి ఏదైనా ఎంతో ప్రేమగా దాచుకుంటారు. తీపి జ్ఞాపకంగా భావిస్తారు. రాఖీ పౌర్ణమి రోజు సోదర సోదరీమణులు రక్షాబంధనాన్ని కట్టుకున్న తరువాత ఈ పనులు చేస్తే విశేషమైన ఫలితాలను పొందుతారట. రాఖీ పండుగ రోజు సోదరుడు సోదరి తప్పనిసరిగా అన్నదానం చేస్తే, పది మందికి భోజనం పెడితే వారికి శుభం చేకూరుతుందని శాస్త్రం చెప్తుంది. అంతేకాదు మరణం తరువాత పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పెద్దలు చెప్తారు . పండుగ రోజు ఎవరైతే అన్నదానం చేస్తారో , అవసరమైన వారికి నగదు దానం చేస్తారో వారికి జీవితమంతా భోజనానికి డబ్బుకు కొదవ ఉండదని చెప్తుంటారు. రక్షా బంధన్ రోజున చంద్రుడు తో సహా నవగ్రహాలను పూజిస్తే జాతకంలో ఎలాంటి దోషాలు తొలగిపోతాయని ఆరోజు నవగ్రహాల శాంతి తో చేపట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయని చెప్తారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం, సోదర సోదరీమణులు ఉపాధ్యాయుల ఆశీర్వాదం తీసుకోవడం, పెద్దల పట్ల వినయ విధేయతలతో ప్రవర్తించడం వల్ల జీవితంలో సానుకూల ఫలితాలను చూస్తారని ప్రతీతి. రక్షాబంధనం అంటే ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమానురాగాలకే కాదు మానవ సంబంధాలకు, అనుబంధాలకు సంబంధించిన పండుగ. రాఖీ పౌర్ణమి రోజు సోదర సోదరీమణులు రక్షాబంధనాన్ని కట్టుకున్న తరువాత ఈ పనులు చేస్తే విశేషమైన ఫలితాలను పొందుతారట. రక్షాబంధన్.. సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ. రక్షాబంధన్ పండుగను రాఖీ పండుగ అని, రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. అన్నా చెల్లెళ్ళు , అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ. ఈ సంవత్సరం ఈ పండుగ ఆగస్ట్ 19 న వస్తుంది. ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారతదేశాలలోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీ కట్టి ఎప్పుడూ అన్నకు అండగా చెల్లెలు ఉంటుందని చెప్తుంది. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడూ చెల్లెలికి రక్షగా ఉంటానని ఈ పండుగ ద్వారా తెలియజేస్తారు.

By Gantyala Praveen | August 17, 2024 | 0 Comments

వేదమత ఉద్ధారకులు… విజయనగర సామ్రాజ్య స్థాపకులు విద్యారణ్యులు

ఆదిశంకరుల తరువాత అంతటివారిగా పేరు పొందిరన మహనీయులు విద్యారణ్యస్వామి. మహాయోగి, మహామతి, కవి, తాత్వికుడు, ద్రష్ట, వేదత్రయ భాష్య కర్త, బ్రహ్మవిద్య పారంగతుడు, శ్రౌత స్మార్త క్రియాపరుడు, వేదాంత శాస్త్ర ఆది రచయిత, శతాధిక గ్రంథకర్త, విఖ్యాత పురుషుడు, ప్రత్యేకించి విజయనగర మహా హిందూ సామ్రాజ్య నిర్మాత, రాజ్య స్థాపకుడు, మహామంత్రి, హిందూ మతోద్ధారకుడు, విరూపాక్ష పీఠ స్థాపకుడు, శృంగేరీ పీఠాధిపతిగా పలు విధాలైన ప్రత్యేకతలతో విద్యారణ్యస్వామి జగత్‌ ప్రసిద్ధి పొందారు. 1267లో వైశాఖ శుక్ల సప్తమి నాడు జన్మించి, 1331లో సన్యాసం స్వీకరించి, శృంగేరి పీఠాధిపత్యం వహంచారు. ఉత్తర హిందూ దేశమంతా ముస్లింల వశమై, అన్యమతస్తుల ఆధిపత్యం అధికమైన పరిస్థితులలో, విద్యారణ్యులు విజయనగర సామ్రాజ్య నిర్మాత, సామ్రాజ్య రక్షకులు అయ్యారు. భరత జాతిని జాగృతపరిచేందుకు తీవ్రంగా శ్రమించి, విశేష కృషితో లక్ష్యాన్ని సాధించారు. దాడుల కారణంగా అన్యమతంలో చేరి… తిరిగి హిందూ మతంలోకి రావాలనుకునే వారికి విద్యారణ్యులు కల్పవృక్షమై నిలిచారారు. 1331లో ప్రజోత్పత్తి సంవత్సర కార్తిక శుద్ధ సప్తమి నాడు వీరు శృంగేరి పీఠాధిపత్యం వహించారు. తమకు పుర్వం ఉన్న శృంగేరి పీఠాధిపతులు, విద్యాతీర్థుల అనుమతితో శృంగేరి పీఠానికి అనుబంధంగా విరూపాక్ష, పుష్పగిరి, శివగంగ, ఆమని సంకేశ్వర్‌, కొల్లాపురంలలో స్థాపనలు గావించి, అన్య మతాల బాధితులకు ఆశ్రయం కల్పించారు. ”పరాశర మాధవీయం” అనే స్మృతి గ్రంథంలో తమ గూర్చి చెప్పుకున్నారు. కృష్ణ యజుర్వేది, బోధాయన సూత్రుడు, భారద్వాజ గోత్రుడు. మాధవ జన్మనామం కలిగి, సన్యాసి నుంచి ”విద్యారణ్య” నామధేయులైన స్వామివారి బాల్యమున విద్యాభ్యాసం నాటికి దక్షిణ భారతంలో ఆర్ష పరిస్థితి శోచనీయమైన పరిస్థితిలో ఉంది. వేదశాస్త్రాలు అడుగంటి, శ్రౌతస్మార్త విద్యలు భ్రష్టమై, ఉపనిషన్మతం పెడత్రోవలో పడి, మతం పలు శాఖలుగా చీలిన పరిస్థితులలో, విద్యారణ్యుడు అవతరించి వేదమతాన్ని ఉద్ధరించారు. మత త్రయాచార్యులు వేదాంత శాస్త్రాలను మాత్రమే విస్తరింపజేయగా, వేదార్థ విశదీకరణ కానరాని స్థితిలో విద్యారణ్యులు గాయత్రీ మంత్రోపాసకులై భువనేశ్వరీ మాత ప్రత్యక్ష ప్రసన్నతో హరిహర బుక్కరాయలచే రాజ్యస్థాపన గావించి, కొంతకాలము మంత్రిగా ఉండి, 1400 గ్రంథాలు రచించి 1380లో శృంగేరి పీఠాధిపతులయ్యారు. లౌకిక, వైదికాంశములలో అసమాన ప్రతిభులై, మత, రాజ్యోద్ధరణ గావించినట్లు చారిత్రక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. సర్వజ్ఞ విష్ణు అనే గురువు వద్ద వీరు వేదాంత శాస్త్రాలు అభ్యసించినట్లు సర్వదర్శన సంగ్రహంలో ఉంది. బ్రహ్మచర్యాశ్రమం నుండి మాధవుడు సన్యసించినట్లు చెబుతారు. అన్యమతాల ఆగడాలు కలత పెట్టగా, మాధవుడు తుంగభద్ర తీరాన భువనేశ్వరి అమ్మవారి కోసం గాయత్రి మంత్రంతో తీవ్ర తపస్సు చేయగా అమ్మవారు ప్రత్యక్షమైంది. అమ్మ వారు చెప్పిన ప్రకారం సన్యసించి శృంగేరి పీఠాధిపత్యాన్ని వహించగా, అప్పుడు, ఆ జగజ్జనని మూడు గడియల సేపు స్వర్ణ వృష్టి కురిపించిందట. భువనేశ్వరి మాత అనుగ్రహించిన అపార సంపత్తిని విరూపాక్ష పీఠం నెలకొల్పడానికి, విద్యానగరాన్ని పెంపొందించడానికి, విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడానికి వినియోగించారు. విజయనగర సామ్రాజ్య రాజధాని విజయనగరాన్ని నిర్మించి, శృంగేరి పీఠాన్ని అధిష్టించిన విద్యారణ్యులకు ధర్మపురి క్షేత్రంతో విడదీయలేని సంబంధం, అనుబంధం ఉన్నాయి. శాలివాహన శకం 1258 (క్రీస్తుశకం 1336) ధాత్రు నామ సంవత్సర వైశాఖ శుక్లపక్ష సప్తమి పుష్యమి నక్షత్ర సింహ లగ్నం సుముహూర్తాన, ”విజయనగర సామ్రాజ్య స్థాపన” సమయాన ధర్మపురికి చెందిన చతుర్వేద పండితులను, ఆహ్వానించినట్లు చెప్పబడుతున్నది. దక్షిణామ్నాయ శృంగేరి పీఠం 12వ అధిపతి అయిన విద్యారణ్యులు ధర్మపురిలో నివసించి, వేదాధ్యయనం చేసినట్లు తెలుస్తోంది. నవనారసింహ క్షేత్రాలలో అగ్రగణ్యమైన ధర్మపురి నరసింహ ఆలయంలో శివకేశవ అభేద తత్వాన్ని చాటుతూ, స్మార్త ఆగమ పూజ రీతులతో, శైవ వైష్ణవ ఆగమ విధానాలతో పూజాదికాలు కొనసాగే సత్సంప్రదాయం విద్యారణ్యులపై తీవ్ర ప్రభావం చూపినట్లు, అది యావత్‌ భారతానికి సైతం ఆదర్శప్రాయమైనట్లు భావించడానికి పలు ఆధారాలు బలం చేకూర్చుతున్నాయి. మన జాతిని ఉత్తేజపరిచిన మహనీయులలో అగ్రశ్రేణికి చెందిన విద్యారణ్యులను ఏడాదికి ఒకనాడైనా స్మరించుకోవడం మన కర్తవ్యం. 1386లో శుద్ధ త్రయోదశి నాడు విద్యారణ్యులు సిద్ధిపొందారు. విద్యారణ్య స్థాపిత పుష్పగిరి తదితర స్థలాలలో జ్యేష్ఠ శుక్ల త్రయోదశి నాడు ఆరాధనోత్సవాలు సాంప్రదాయ రీతిలో నిర్వహిస్తారు.

By NYALAKONDA ANIL DESAI | April 10, 2024 | 0 Comments

విశిష్టమైనది భారతీయ కాలగణన – ఉగాది ప్రత్యేకం

గ్రహ నక్షత్ర గణనే నిజమైన కాలగణన. కాలం దైవస్వరూపం, అనంతమైనది. ఈ సృష్టి అన్వేషణకు కాల గణనే మూలం. మనదేశంలో కాలగణన ఎంతో శాస్త్రీయమైనది. ‘అసు సృష్టి ప్రారంభమై ఇప్పటికి నూట తొంబై ఐదు కోట్ల యాభై ఎనిమిది ల‌క్ష ఎనబది ఐదువేల ఎనభై ఒక‌టి సంవత్సరాలు (195,58,85,083) అయినట్లు లెక్క తెలుపుతున్నది. ఆధునిక శాస్త్రపరిజ్ఞానం లెక్క ప్రకారం కూడా దాదాపు మన పూర్వులు చెప్పిన లెక్కకు దగ్గరగా ఉన్నది. మన కాలగణనలో మన్వంతరము, యుగాులు, సంవత్సరాలు, మాసాలు, పక్షము; రోజులు ఉంటాయి. అందులో 14 మన్వంతరాలు. ఆ మన్వంతరాల క్రమంలో ప్రస్తుతం 7వదయిన వైనస్వత మన్వంతరం నడుస్తున్నది. ఒక మన్వంతరము అంటే 71 మహాయుగాలు; ఒక మహాయుగము అంటే నాలుగు యుగాలు (కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలు). ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరం కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగము ప్రారంభమై ఇప్పటికి 5125 సంవత్సరము పూర్తి అయింది. ఈ ఉగాదితో 5126 సంవత్సరములోకి ప్రవేశిస్తున్నది. మన కాలగణనలో సంవత్సరము ఆవర్తము ఉన్నది. 60 సంవత్సరాు ఒక ఆవర్తము. ఈ అరవై సంవత్సరా ఆవర్తములో 37వ సంవత్సరమైన శుభ‌కృత్‌ నామ సంవత్సరంలో ఉన్నాము. ఈ ఉగాదితో 38 సంవత్సరమైన క్రోధి నామ సంవత్సరంలో ప్రవేశిస్తాము. కలియుగము ఎప్పుడు ప్రారంభమైంది ? మహాభారత సంగ్రామం తరువాత 36 సంవత్సరాలకు భగవాన్‌ శ్రీకృష్ణునిచే నిర్మింపబడిన ద్వారకపట్టణము సముద్ర గర్భంలో కలిసిపోయిన అర్థరాత్రి నుండి కలియుగం ప్రారంభమైంది. ఇప్పుడు ప్రచారములో ఉన్న క్రీస్తుకు పూర్వము; క్రీస్తు శకము లెక్కల ప్రకారం క్రీస్తుపూర్వము 3101 ఫిబ్రవరి 20వ తేదీ అర్థరాత్రి 2 గం. 27 ని॥ 30 సెకండ్లకు అంటే 3101+2024 = 5125 సంవత్సరాు ఇప్పటికే పూర్తి అయ్యి 5126 లో ఈ ఉగాది నాడు ప్రవేశిస్తుంది. ఏప్రిల్ 09 ఉగాది నుండి క్రోధి నామ సంవత్సరం ప్రారంభమౌతుంది. ఇంతటి శాస్త్రీయమైనది మన కాలగణన. దేశచరిత్రలో కొన్ని తిరుగులేని విజయాలను మనవాళ్ళు శకాలుగా పేర్కొన్నారు. అందులో ప్రసిద్ధమైనవి 1) యుధిష్ఠిర శకము, 2) విక్రమార్క శకము, 3) శాలివాహన శకము. భారతదేశానికి ఉత్తరభాగం వారు విక్రమార్క శకమును, దక్షిణాపథం వారు శాలివాహన శకమును చెప్పుకుంటూ ఉంటారు. ఈ దేశ చరిత్రల మలుపు త్రిప్పిన ఘట్టాను పదేపదే జ్ఞాపకం చేసుకొంటూ మనలో ధర్మనిష్టను; పౌరుష పరాక్రమాలను పెంపొందించుకోవటం ప్రధాన లక్ష్యం. ఆ శకాల గురించి సంక్షిప్తంగా తెలుసుసుకునే ప్రయత్నం చేద్దాం. యుధిష్ఠిర శకం యుధిష్ఠిర శకం కురుక్షేత్ర సంగ్రామం అనంతరం ద్వాపర యుగ అంతంలో ప్రారంభమైంది. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు విజయం సాధించారు. తరువాత ధర్మరాజుకు సామ్రాట్టుగా పట్టాభిషేకము జరిగింది. ఆ రోజు నుండి యుధిష్ఠిర శకం ప్రారంభం అయింది. అది జరిగి ఈ ఉగాదికి 5161 సంవత్సరాలు పూర్తయి, 5162వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నది. కురుక్షేత్ర సంగ్రామం తరువాత ధర్మరాజు 36 సంవత్సరాలు పరిపాలన చేసాడు. ఆ తరువాత కలియుగం ప్రారంభమైంది. అంటే కలియుగం ప్రారంభానికి 36 సంవత్సరాలకు పూర్వం యుధిష్ఠిర శకం ప్రారంభమైంది. యుధిష్ఠిర శకం మనకు ఇచ్చే సందేశం ఎప్పుడైనా అంతిమ విజయం ధర్మానిదే అని. మహాభారత సంగ్రామం ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన భీకర పోరాటం. అది ధర్మం జయించిన వేళ. విక్రమార్క శకం కలియుగంలో 3044 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇప్పుడు 2080 సంవత్సరాు పూర్తి చేసుకొని 2081వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నది. విక్రమార్కుని కాలం నాటికి భారతదేశం మీద శకుల, హూణుల దండయాత్ర‌ జరుగుతుండేవి. చిన్న వయస్సులోనే విక్రమార్కుడు ఈ దాడులను త్రిప్పికొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. 5 సంవత్సరాల వయస్సులోనే అరణ్యంలోకి వెళ్లి 12 సంవత్సరా పాటు సుదీర్ఘ సాధన చేసి అద్భుత శక్తులు సంపాదించాడు. అతను మాళవ ప్రాంతంలోని ఉజ్జయినీని రాజధానిగా చేసుకుని పరిపాలన ప్రారంభించాడు. జ్యోతిర్లింగాలలో ఉజ్జయిని ఒకటి. విక్రమాదిత్యుడు శకులు హూణులను జయించటానికి భయంకరమైన యుద్ధాలు చేశాడు. శకులు హూణుల భాధలు మనకే కాదు అరేబియా; బాబిలోనియా; పర్షియాకు కూడా ఉండేవి. విక్రమార్కుడు అక్కడకు కూడా వెళ్ళి శకులు హూణులను తరిమి కొట్టాడు. అరబ్బు ప్రజు విక్రమాదిత్యుడిని తమకు స్వేచ్ఛ స్వతంత్రం ప్రసాదించిన రాజుగా కీర్తించారు. అరేబియాలో మహాదేవుని మందిరం నిర్మాణం చేసారు. అట్లాగే విక్రమాదిత్య మహారాజు అయోధ్య పట్టణాన్ని అన్వేషించి అక్కడ రాముడు జన్మించిన స్థలము గుర్తించి అక్కడ భవ్యమైన రామమందిరం నిర్మాణం చేసాడు. ఈ విషయలు కాళిదాసు రచించిన గ్రంథాల ద్వారా మనకు తెలుస్తాయి. శకులు, హుణుల బారి నుండి ఈ దేశాన్ని కాపాడిన విక్రమాదిత్యుడి పేరుతో విక్రమార్క శకం ప్రారంభమైంది. శాలివాహన శకం ఇది కలియుగంలో 3179వ సంవత్సరంలో ప్రారంభమైనది. అంటే శాలివాహన శకం ప్రారంభమై ఇప్పటికి 1945 సంవత్సరాలు పూర్తి అయి, 1946 సంవత్సరంలో ప్రవేశిస్తున్నది. శాలివాహనుడు విక్రమాదిత్యుని మునిమనుమడు. శాలివాహనుడు విదేశీయులైన శకులను సంపూర్ణంగా నాశనము చేసి దేశ సరిహద్దులు దాటి వారి రాజ్యాలలోకి ప్రవేశించి వాళ్ళు దోచుకొని పోయిన సంపదనంతటిని తిరిగి ఈ దేశానికి తీసుకొచ్చాడు. ఈ దేశానికి మూడు రాజధానులను ఏర్పాటు చేసుకుని ఒకే ఛత్రం క్రింద దేశాన్ని పరిపాలించిన ధీరుడు. శకులపై విజయానికి చిహ్నంగా శాలివాహన శకం ప్రారంభమైంది. ఆయన కాలంలో ఈ దేశంపై దాడిచేసిన విదేశీయులను సంపూర్ణంగా నాశనం చేసి భారత్‌ను శక్తివంతం చేశాడు. ఆ విషయాలు జ్ఞాపకం చేసుకోవటానికి విక్రమార్క, శాలివాహన శకాలు ఏర్పడ్డాయి. ఈ శకాలు మనకు ఇప్పుడు ఇచ్చే సందేశం ఏమిటంటే శతాబ్దాల భావదాస్యాన్ని వదిలించుకొని వేయి సంవత్సరాల విదేశీ దాడులకు చరమగీతం పాడాలి. మన దేశం స్వాభిమానంతో నిలబడి, ప్రపంచానికి శాంతి బాటలు వేసి, మరో క్రొత్త శకం ప్రారంభం కావాలి. ఈ ప్ల‌వ నామ సంవత్సరం అందరికీ ఇటువంటి ప్రేరణ ఇవ్వాలని కోరుకుందాం. – రాంపల్లి మల్లికార్జునరావు

By NYALAKONDA ANIL DESAI | April 09, 2024 | 0 Comments

వీలైతే చరిత్రను రక్షించుకుందాం... కాని చరిత్ర హీనులుగా మాత్రం మిగలవద్దు.

రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్.జి మన రావికంటి చరిత్ర రావికంటిలో 'మిట్టన గుళ్ళు వంపున చెరువు' నిర్మించిన స్వాభిమాని జైనరాణి లకుమాదేవి! జగిత్యాల్ జిల్లా కేంద్రానికి అటు కోరుట్ల పట్టణానికి కేవలం 15-20 కి మీ దూరంలోనున్నా ఒకప్పుడు రాయికల్ ను మారుమూల గ్రామం అనేవారు. నాటి కాలంలో రావికంటి,ప్రభాకరరావు పేట,గోవిందరాజు పేట, బద్దులాపురం( పద్మాపురం ), నందిపేట, నాగారం, కొండాపురం అను ఏడు గ్రామాలు కలిసి ఏర్పడడం వల్ల గ్రామీణులు దీన్ని ఇప్పటికీ 'రావికంటి' అనే పిలుస్తుంటారు. వేములవాడ చాళుక్యుల/ కాకతీయుల కాలంనాటి గుడి, ఒకప్పుడు దాని చుట్టూవున్న కోటను బట్టి 'గుడికోట' గా ప్రసిద్ధమైన ప్రస్తుతం 'శ్రీ కేశవనాథస్వామి ఆలయం'గా పిలువబడుతున్న ఇక్కడి త్రికూటాలయం రాయికల్ కు మాకుటాయామనం లాంటిది. కాకతీయ రెండవ ప్రతాపరుద్రుడు ( 1296-1325) రాజ్యం చేస్తున్న కాలంలో వారి సామంతుడు రుద్రదేవుడు,వారి సేవకుడు బెజగంగూలెంక శకవర్షం 1227 శ్రావణ బహుళ ద్వాదశి వడ్డవారం (క్రీశ1305 ఆగస్టు17మంగళవారం) నాటి దాన శాసనం ప్రకారం ఇది ఆనాడు రామనాథ లఖుమేశ్వర ( లక్ష్మణేశ్వర)ఆలయం. అయితే వేములవాడ రాజధానిగా కరీంనగర్ ప్రాంతాన్ని పాలించిన చాళుక్యుల కాలంలో ఇది 'జైనాలయం'గా వుండేదని ఈ ఆలయ పరిసరాల త్రవ్వకాల్లో లభించిన జైన తీర్థంకరుని శిరస్సును బట్టి అర్థమౌతుంది. అంతే కాదు ఇక్కడి స్థల చరిత్రలో ఆలయ నిర్మాత గా చెప్పబడే, వైశ్య వనితగా భావించబడే 'లకుమాదేవి 'జైన మతస్తురాలు కావడం విశేషం. ఈ రాణి స్వాభిమానం మహిళా లోకానికే గర్వ కారణం. లకుమాదేవి తన బిడ్డకు పాలిస్తున్న సమయంలో ఆమె మామగారు లోపలికి రావడం , అది ఆమె గమనించక పోవడం జరిగిందట. కోడలు తనను చూసి కూడా లేచి నిలబడలేదని, కుర్చీ పీట వేయలేదని ఆగ్రహించిన ఆ పెద్దాయన ' వంపున చెరువు - మిట్టన గుళ్ళు కట్టించిన రాణిలా మిడిసిపడుతున్నావని' అన్నాడట. ఆత్మభిమానం గల లకుమ బాధ పడుతూనే 'గర్వంతో కాదు మీ రాక గమనించకనే, అయితే మీ వాక్కుల్లో నాకు భవిష్యత్ వాణి వినబడుతుంది, మీరన్న పనులు నేను చేసి చూపుతా'నని ప్రతిన బూని తన తల్లిగారు పెట్టిన ఏడు వారాల నగలను కూడా అమ్మి 'మిట్టన ఈ గుళ్ళు - వంపున చెరువు' నిర్మించిందని చెబుతారు. చెరువు నిర్మాణం పూర్తి అయినా వర్షాభావం వల్ల అది నిండకపోవడాన్ని కొందరు పండితులు తన దోషంగా చెబుతూ చెరువు నరబలి కోరుతుందనడంతో స్వయంగా తానే ఒక అర్ధరాత్రి లేచి సర్వాలంకార భూషితయయి వెళ్లి చెరువులో ఒక గుండు దగ్గర ఊరి కోసం ప్రాణత్యాగం చేసిందన్నది బహుళ ప్రచారంలోనున్న కథ. ఈ మహాసాధ్వి పేరుతో ఇప్పటికీ అది 'లకుమాదేవి గుండు 'గానే పిలువబడుతుంది. కాకతీయుల కాలం నాటి 'బెజగంగూలెంక దాన శాసనాన్ని' లెక్కలోకి తీసుకున్నా రాయికల్ దాదాపు ఏడున్నర శతాబ్దాల నాటి చారిత్రక గ్రామం. 'మాధవ చరిత్ర(అముద్రితం) 'కర్త తిరునగరి నర్సింహదాసు, రామశతక కర్త వరకవి భూమగౌడు (వీరి జీవిత ఆధారంగా నేను రచించిన నవల ఇదే పేరుతో 2017 లో వెలువడింది. కీ శే వేముల పెరుమాళ్ళు గారు రాయికల్ మండల మొదటి అధ్యక్షులు(1987-1993)కావడమే కాకుండా 'శ్రీ కేశవనాథ స్వామి ఆలయ' చరిత్రను వెలికితీసి దీని అభివృద్ధికి విశేషంగా కృషి చేసినారు. కానీ ఇప్పుడు అభివృద్ధి పేరుతో కొంతమంది స్వలాభం కోసం చరిత్రను కించపరుస్తూ చరిత్ర హీనులగా గుర్తుండిపోతారు. మీ జనం గొంతు..

By NYALAKONDA ANIL DESAI | November 04, 2023 | 0 Comments

కనుమరుగవుతున్న రాయికల్ చరిత్ర

కనుమరుగవుతున్న రాయికల్ చరిత్ర రాయికల్//జనం గొంతు //ప్రవీణ్. జి రాయికల్ కు చారిత్రక ప్రాచీన నేపథ్యం ఉన్న పట్టణంగా పేరు ఉంది.దానికి చిహ్నంగా శ్రీ చెన్నకేశవ నాథ ఆలయం అనేక సంవత్సరాలు నుండి ఆలయ ప్రాంగణంలో ఉన్న శిలాశాసనాలు విగ్రహాలు కట్టడానికి వినియోగించిన శిల్పాలను, రాళ్ళను గతంలో చరిత్రను సమాధి చేస్తూ అదే గుడికోట ప్రాంగణంలో పూడ్చి వేశారు. మరోసారి అదే తప్పు చేస్తూ నూతనంగా నిర్మాణం చేస్తున్న షెడ్డు తవ్వకాలలో బయట పడ్డా గుడి కోట రాతి విగ్రహాలను రాతి శిల్పాలను బండలను,అదే విధంగా మరల పూడ్చి పెడుతూ గొప్ప చారిత్రక ప్రాచీన కాలం నాగరికతను సమాధి చేస్తున్నారు, దేవదాయ శాఖ వైపల్యంతో పాటు దీనిపై సంబంధిత ఇంజనీర్ అధికారి పరివెక్షణా వైఫల్యం, కొందరు గుత్తే దారుల విమర్శలకు దారితీస్తుంది. చరిత్రక ఆధారాలను సమాధి చేస్తున్న వారిపై పురావస్తు దేవాదాయ ధర్మాదాయ శాఖ లు ఎలాంటి చర్యలు తీసుకోక ఇష్టారీతిన వ్యవహరిస్తున్న తీరు పట్ల రాయికల్ పట్టణ వాసులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చరిత్రను కాపాడాలని ప్రభుత్వనికి విజ్ఞప్తి చేస్తున్నారు.

By NYALAKONDA ANIL DESAI | November 03, 2023 | 0 Comments

Hot Categories

2
1
6
1