రాయికల్ పట్టణంలోని ప్రగతి ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని రాయికల్ పట్టణంలోని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ప్రగతి యాజమాన్యం గొప్పదనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ అధ్యక్షులు సోహైల్ మతపెద్దలు సద్దాం సహబ్ మహెబూబ్ సహాబ్,రహీమ్ సాహబ్ నబి సబ్, మహమ్మద్ షకీల్, ముహమ్మద్ ఆన్సర్ అలీ,నాజీం సహాభ్ ,నయీం సహభ్ ముస్తాక్ అహెమధ్ మున్ను,సభీర్, ప్రగతి పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్, అకాడమిక్ డైరెక్టర్ నిఖిల్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments 0