తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రలతో కాషాయ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. 9వ రోజుకు చేరిన విజయసంకల్ప యాత్రలోనూ ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మంచి జోష్ కనపడింది. 5 క్లస్టర్లలో కొనసాగిన యాత్రలలో భాగంగా కార్నర్ మీటింగుల్లో బీజేపీ ముఖ్య నాయకులు నరేంద్ర మోదీ ప్రభుత్వంతో దేశంలో జరుగుతున్న సుపరిపాలనను ప్రజలకు వివరిస్తూ, బీజేపీకి మరింత మద్దతు కూడగడుతున్నారు. ప్రజలందరూ స్వచ్ఛంగా తరలివచ్చి దేశం కోసం మోదీ.. మోదీ కోసం మేం అంటూ నినదిస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో బీజేపీ కి వస్తున్న ప్రజాధరణ.. అత్యధిక మెజారిటీ సీట్లు సాధించేందుకు నిదర్శనంగా కనపడుతోంది. శ్రీరాముడిపై పట్ల విద్వేష వ్యాక్యలు చేసిన కాంగ్రెస్ పై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విరుచుకుపడ్డారు. రాముడే లేడని మాట్లాడిన కాంగ్రెస్ కావాలా? లేదా రాముడికి గుడి కట్టిన ప్రధాని నరేంద్ర మోడీ కావాలా? అని ప్రజలు ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు. ట్రిపుల్ తలక్ రద్దు చేసి ముస్లిం మహిళలకి అన్నగా నిలిచిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు అని అన్నారు. పాత బస్తీ బాగుపడాలంటే బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ విజయ సంకల్ప యాత్రలతో కమలదళం ముందుకెళ్తోంది. రాష్ట్ర నేతలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. నేడు డాక్టర్ కె. లక్ష్మణ్ గారు గౌలిపురాలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రలో భాగంగా పాత బస్తీ మొత్తం కాషాయ మయంగా మారింది. ఈ యాత్ర భాగ్యలక్ష్మి క్లస్టర్ హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్ పురా, మలక్ పేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగింది. ఈ యాత్రలో ఎమ్మెల్యే, రామారావు పటేల్ గారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారు, తదితరులు పాల్గొన్నారు. రాజరాజేశ్వరి క్లస్టర్ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొనసాగిన విజయసంకల్ప యాత్రకు జనం జేజేలు పలికారు. జహీరాబాద్ లో ప్రసిద్ధ కేతకి సంగమేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉగ్గెల్లి బైపాస్ నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. కార్యకర్తల్లో కిషన్ రెడ్డి గారు ఉత్సాహం నింపుతూ ముందుకెళ్లారు. నరేంద్ర మోదీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలనే సంకల్పంతో ప్రజలంతా ముక్తకంఠంతో తమ మద్దతు తెలిపారు. యాత్ర పొడవునా కాషాయ జెండాలతో ఎదురెళ్లి, అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ రథసారధి కిషన్ రెడ్డి గారు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ, అదేవిధంగా తెలంగాణ ప్రజలను మోసం చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం, 6 గ్యారంటీలతో మభ్యపెట్టి అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందిపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాన్ని ఎండగట్టారు. కృష్ణమ్మ క్లస్టర్ నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ శాసనసభ్యుడు పాల్వాయి హరీష్ గారి ఆధ్వర్యంలో అచ్చంపేట, దేవరకొండ, నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయసంకల్ప యాత్ర ఉత్సాహంగా కొనసాగింది. ఈ యాత్రలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి గారితో పాటు సీనియర్ నాయకులు చిత్తరంజన్ దాస్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండలంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దుతో మోదీజీ చరిత్రలో నిలిచిపోయారంటూ కొనియాడారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత తొమ్మిది సంవత్సరాలలో అవినీతిరహిత పాలనతో దేశ ఆర్థిక వృద్ధిరేటును ప్రపంచంలోనే ఐదో స్థానానికి ఎదగడానికి దోహదపడ్డారని వివరించారు. తెలంగాణలో అబద్ధపు మాటలు, అమలుకు నోచుకోని హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా......రేపు 10వ రోజున కొనసాగే బీజేపీ విజయసంకల్ప యాత్రలలో దేశ అభివృద్ధిలో నూతనోత్సాహాన్ని రగిలిస్తూ, దేశ పౌరులందరికీ ఉజ్వల భవిష్యత్తుకు హామీనిస్తూ సుపరిపాలన అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ గారికి హ్యాట్రిక్ విజయాన్ని అందించేలా మద్దతు తెలిపి.. కేంద్రంలో బీజేపీ సర్కారును సాధించుకునే మహాయజ్నంలో కలిసి నిలబడుతూ... ఆశీర్వాదం అందించాని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ గారు పిలుపునిచ్చారు.