జననం 1883 మే 28 బాగూర్,నాసిక్ జిల్లా, మహారాష్ట్ర, మహారాష్ట్ర, మరణం 1966 ఫిబ్రవరి 26 (జీవించిన వయసు 82) రాజకీయ పార్టీ అయిన హిందు మహాసభ తో పరిచయం జీవిత భాగస్వామి యమునాబాయి మరణం 1963 సావర్కర్ ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉండగానే తన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించాడు. పుణె లోని ఫెర్గూసన్ కళాశాలలో కూడా వీటిని కొనసాగించాడు. ఇతను తన సోదరుడితో కలిసి రహస్యంగా అభినవ భారత్ సొసైటీ అనే సంస్థను స్థాపించాడు. తర్వాత తన న్యాయవిద్య కోసం యుకెకి వెళ్ళినపుడు అక్కడ ఇండియా హౌస్, ఫ్రీ ఇండియా సొసైటీ సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించాడు. విప్లవం ద్వారా భారతదేశం సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని పొందాలని పుస్తకాలు రాశాడు. 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామాన్ని గురించి ఈయన రాసిన ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తకాన్ని బ్రిటిష్ వారు నిషేధించారు. 1910 లో విప్లవ సంస్థ ఇండియా హౌస్ తో సంబంధాలు కలిగి ఉన్నందున ఈయనను అరెస్ట్ చేసి భారత్ కు తరలించారు. భారత్ కు వచ్చే దారిలో ఫ్రాన్స్ లో తాను ప్రయాణించే ఓడ ఎస్ ఎస్ మర్సీలెస్ నుంచి సముద్రపు నీళ్ళలో దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఫ్రెంచి ఓడరేవు అధికారులు అతన్ని తిరిగి బ్రిటిష్ అధికారులకు అప్పగించారు. భారత్ కు రాగానే సావర్కర్ కు 50 ఏళ్ళ జైలు శిక్ష విధించిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను అండమాన్ దీవుల్లోకి సెల్యులార్ జైలుకు తరలించారు. తర్వాత ఆయన బ్రిటిష్ అధికారులకు ఎన్నో క్షమాపణ లేఖలు రాసిన తర్వాత 1924 లో ఆయన్ను విడుదల చేశారు. 1937 తర్వాత ఆయన విస్తృతంగా భారత దేశం పర్యటించడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే వక్తగా, రచయితగా మారి హిందూ జాతీయవాదాన్ని, సమాజంలో ఏకత్వాన్ని సమర్ధించాడు. 1938 లో మరాఠీ సాహిత్య సమ్మేళన్ కు అధ్యక్షుడిగా ఉన్నాడు. హిందు మహాసభకు అధ్యక్షుడిగా భారతదేశాన్ని ఒక హిందూ రాష్ట్రమనే భావనను తను బలంగా సమర్థించాడు. సావర్కర్ ను కాంగ్రెస్ తనలో కలుపుకోకపోవడం వలన ముస్లిం లీగ్ తో కూడా అనుబంధం ఏర్పరుచుకున్నాడు. అంతే కాకుండా రెండు దేశాలుగా ఏర్పడటాన్ని సావర్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు. 1948 లో సావర్కర్ ను మహాత్మా గాంధీ హత్యలో సహ కుట్రదారుగా చేర్చారు. అయితే ఆధారాలు లేకపోవడంతో కోర్టు అతన్ని విడుదల చేసింది.