|
modi add 1

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఆటోలు నడుపుకోవాలి పోత్కపల్లి ఎస్ఐ దికొండ రమేష్

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఆటోలు నడుపుకోవాలి పోత్కపల్లి ఎస్ఐ దికొండ రమేష్ జనం గొంతు /ఓదెల/ సతీష్ కుమార్ పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసులు మీకోసం లో భాగంగా ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు.. పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో ఈరోజు పోత్కపల్లి ఎస్సై దికొండ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు మీకోసం కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా SI మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు 18 సంవత్సరాలు పైబడిన వాళ్లే ఆటో నడపాలని నిబంధనలు పాటిస్తూ ఆటోలు నడపాలన్నారు. 1)ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలి 2)మద్యం తాగి ఆటో నడపరాదు 3)ఆటో పేపర్స్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి 4)ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదు 5)రోడ్లమీద ఆటోలో నిల్ప రాదు. 6) ఆటోలో అనుమాన వ్యక్తులు ప్రయాణం చేసిన యెడల పోలీసులకు తెలియజేయాలి 7) ఆటోలో మ్యూజిక్ సిస్టం పెట్టరాదు 8) మహిళల ప్రయాణికుల పట్ల వృద్దుల పట్ల గౌరవం చూపెట్టాలి, 9) పోలీసు స్టేషను లో ప్రతి ఒక్క ఆటోకు టాప్ నెంబర్ ను . తప్పకుండా ఆటో యజమానులు తమ ఆటోలకు టాప్ నెంబర్ ను వేసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించి ఆటోలు నడిపిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది పోత్కపల్లి ఎస్ఐ రమేష్ గారు తెలిపారు. అనంతరం వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న డ్రైవర్ ఆనంద్ ను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు..

By NYALAKONDA ANIL DESAI | December 28, 2024 | 0 Comments

నిజామాబాదు జిల్లా అడిషనల్ (అడ్మిన్ ) డీసీపీ గా బస్వారెడ్డి.

నిజామాబాదు జిల్లా అడిషనల్ (అడ్మిన్ ) డీసీపీ గా బస్వారెడ్డి. నిజామాబాదు : నిజామాబాదు జిల్లా అడిషనల్ డీసీపీ గా (అడ్మిన్ ) బస్వారెడ్డి నియమితులయ్యారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో భారీగా బదిలీలు అయ్యాయి. అందులో భాగబగా ఆయన్ను నిజజామాబాదు జిల్లా అడిషనల్ డీసీపీ గా (అడ్మిన్ ) నియమిస్తూ ఉత్తర్వులు జారిచేశారు.

By NYALAKONDA ANIL DESAI | November 27, 2024 | 0 Comments

హత్య కేసును నీరు కారుస్తున్నారు...

హత్య కేసును నీరు కారుస్తున్నారు... కేసు నుండి నిందితులను తప్పించే ప్రయత్నం... డబ్ల్యూజేఐ నేతలతో కేంద్ర మంత్రిని కలిసిన ఇల్లందు బాధిత విలేకరి సుదర్శన్ కరీంనగర్, నవంబర్ 5:- తనను హత్య చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తులను అరెస్టు చేసే విషయంలో పోలీసులు విచారణ పేరిట కాలయాపన చేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల విలేఖరి నిట్ట సుదర్శన్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి తెచ్చారు. ఈ కేసులో తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేకుండా పోయిందన్నారు. తనపై జరిగిన హత్యోదంతంలో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టే విధంగా సంబంధిత ఉన్నతాధికారులకు సూచన చేయాలని సుదర్శన్ కేంద్ర మంత్రిని అభ్యర్థించారు. మంగళవారం బిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా నాయకులు న్యాలకొండ అనిల్ రావ్, తాడూరు కరుణాకర్, శివనాద్రి ప్రమోద్ కుమార్, టి సత్యనారాయణ, దారం జగన్నాథరెడ్డి, ఆడెపు లక్ష్మీనారాయణ, మొగురం రమేష్ తదితరులతో ఆయన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలిశారు. అక్టోబర్ 17న తనపై జరిగిన దాడికి సంబంధించి సూత్రాదారుల్లో స్థానిక ఎమ్మెల్యే అనుచరులు , రౌడీ షీటర్లు, డీఎస్పీ సమీప బంధువు ఉండడంతో కేసును నీరుగార్చేందుకు శత విధాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని సుదర్శన్ కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. స్థానిక డీఎస్పీ మొదటి నుండి కేసును నీరుగార్చేందుకు, నిందితులను కేసు నుండి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని సుదర్శన్ ఆరోపించారు. ఎమ్మెల్యేసమీప బంధువు నాగేశ్వరరావు, అనుచరుడు ఆముదాల ప్రసాద్ ఈ కేసులో ఏ-8 గా ఉన్న విషయాన్ని బాధితుడు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. తనపై దాడికి సంబంధి స్పష్టమైన ఆధారాలు వీడియో ఫుటేజ్ రూపంలో ఉన్నప్పటికీ,అందులో కొందరిని కేసులో పేర్కొనకుండా డీఎస్పీ కిందిస్థాయి పోలీసులపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని సుదర్శన్ ఆరోపించారు. తనపై దాడికి పాల్పడిన వారిపై హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కాగా, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణ బాధ్యత డిఎస్పీపై ఉన్నప్పటికీ, ఆయన ఆ బాధ్యతను విస్మరించారని అన్నారు. సమాజంలో జరిగే తప్పులను ఎత్తిచూపే జర్నలిస్టులపై ఏకంగా దాడులు, హత్యా యత్నాలు జరుగుతున్నా ... అందుకు సంబంధించిన వీడియోలు కళ్ల ముందు కనబడుతున్నా ... అధికార ఎమ్మెల్యే అండదండలు, పోలీసు ఉన్నతాధికారుల ఆశీస్సులతో తనపై జరిగిన హత్య కేసు నీరు కార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని సుదర్శన్ కేంద్రమంత్రికి తెలిపారు. కేసులో పేర్కొన్న నిందితుల ఫోన్ డేటా పరిశీలిస్తే ... వారికి అండగా ఉన్న రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారుల పాత్ర బయట పడుతుందని,కనుక ఆ దిశగా విచారణ జరిగేలా చూడాలని సుదర్శన్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో నిష్పాక్షిక విచారణ జరిగేలా చూసేందుకు, సంబంధిత అధికారులతో మాట్లాడతానని కేంద్ర మంత్రి బండి సంజయ్ సుదర్శన్ తో పాటు, డబ్ల్యూజేఐ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు.

By NYALAKONDA ANIL DESAI | November 05, 2024 | 0 Comments

బండి సంజయ్ కుమార్ ను కలసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జర్నలిస్ట్ నిట్ట సుదర్శన్.

బిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో మంగళవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జర్నలిస్ట్ నిట్ట సుదర్శన్. ఇటీవల తనపై జరిగిన పాశవికదాడి గురించి కేంద్రమంత్రికి వివరించిన సుదర్శన్. ఈ కేసులో ఇల్లందు పోలీసులు అసలైన నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని, మరో ముగ్గురిని అరెస్ట్ చేయకుండా కాపాడుతున్నారని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చిన సుదర్శన్. ఈ విషయంలో సంబంధిత జిల్లా ఎస్పీతో మాట్లాడతానని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి. బాధిత జర్నలిస్టుకు భరోసా కల్పించిన మంత్రి. కార్యక్రమంలో డబ్ల్యూజేఐ నాయకులు న్యాలకొండ అనిల్ రావు,తాడూరు కరుణాకర్, శివనాద్రి ప్రమోద్ కుమార్, టి సత్యనారాయణ, దారం జగన్నాథరెడ్డి, ఆడపు లక్ష్మీనారాయణ, మొగురం రమేష్ తదితర జర్నలిస్టు లు పాల్గొన్నారు

By NYALAKONDA ANIL DESAI | November 05, 2024 | 0 Comments

రెస్టారెంట్ ఫుడ్ తో ప్రాణగండం జర జాగ్రత్త!!

రామగుండం నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు మంగళ వారం వివిధ రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. కె సి ఆర్ కాలనీ కవిత థియేటర్ ప్రాంతంలో సాఫ్రాన్ మండి పేరుతో నిర్వహిస్తున్న ఒక రెస్టారెంట్ లో నిలువ ఉంచి నాణ్యతగా, పరిశుభ్రంగా లేని ఆహార పదార్థాలను గుర్తించారు. వాటిని ఉపయోగించకుండా ఫినాయిల్ పోసారు. నిర్వాహకుల నుండి ముప్పదివేల రూపాయలు జరిమానా గా వసూలు చేశారు. ఈ తనిఖీలలో హెల్త్ అసిస్టెంట్లు కిరణ్, వైకుంఠం, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | July 14, 2024 | 0 Comments

271 గ్రాముల గంజాయిని పట్టుకున్న పోలీసులు

సుల్తానాబాద్, జూలై 14 (జనం గొంతు) : సుల్తానాబాద్ పట్టణంలో 271 గ్రాముల గంజాయిని పట్టుకున్న పోలీసులు. పట్టణంలోని పూసాల రోడ్డులో ఎస్సై శ్రావణ్ కుమార్ పోలీస్ సిబ్బందితో కలిసి వాహనాలు నిర్వహిస్తుండగా పూసాల నుండి సుల్తానాబాద్ వైపు స్కూటీపై వస్తున్న ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో,ఆపి చెక్ చేయగా స్కూటీలో గంజాయి లభించింది. పంచాయతీ సెక్రటరీలు ప్రమోద్ కుమార్, పాపయ్య లు ఎస్సై శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి, విచారించగా నిందితుడు చంద్రపూర్ నుండి గంజాయి విక్రయించి తీసుకొచ్చి సుల్తానాబాద్ లో సప్లై చేస్తున్నట్టుగా అంగీకరించాడని, అతని వద్ద రైల్వే టికెట్ బస్సు టికెట్ మొబైల్ ఫోను బైక్ 271 గ్రాముల గంజాయి లభించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | July 14, 2024 | 0 Comments

ఆరు సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం చేసి, చంపిన నేరస్తున్ని అరెస్ట్.

నేరస్తుని పూర్తి వివరములు: వినోద్ మజ్హి / రాజ్ కుమార్, 28 yrs, గుసర్, రూప్నారయనాపూర్, కర్నది. విశాలి జిల్లా, బీహార్ రాష్ట్రం. *నేరవివరాలు: ఆరు సంవత్సరాల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో కాట్నాపల్లి లో జరిగింది. నేరస్తుడు బీహార్ రాష్ట్ర వాస్తవ్యుడు. సుల్తానాబాద్ మండలం లోని కాట్నపల్లి గ్రామం లోని ఒక రైస్ మిల్ లో హమాలిగా పనిచేస్తున్నాడు. తన దగ్గరలో ఒక రూమ్ లో మృతురాలు/మైనర్ పాప ఉండేది. తేది 13.06 2024 రోజున రాత్రి కరెంట్ పోవడంతో నేరస్తుడు బయటకు వచ్చి చూసే సరికి, మృతురాలి కుటుంబం వారి రూమ్ బయట పడుకున్నారు. వెంటనే నేరస్తుడు ఇదే అదునుగా భావించి నేరస్తుడు చుట్టూ పరిసరాలను గమనించి మృతురాలు /మైనర్ పాప దగ్గరకు వెళ్లి అట్టి పాప నోరు మూసి అక్కడి నుండి రైస్ మిల్ వెనకకు ఎత్తుకెళ్ళి బలత్కారం చేస్తూ గొంతు నులుముతూ తనను అత్యాచారం చేసి చంపి అక్కడి నుండి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో సుల్తానాబాద్ పోలీసులు రాత్రంతా గాలించి నిందితుని పట్టుకున్నారు.

By NYALAKONDA ANIL DESAI | June 14, 2024 | 0 Comments

భూ కబ్జా విషయం లో అధికారుల నిర్లక్ష్యం.* *రాష్ట్ర మానవ హక్కుల కమిషన్,* *రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ లలో ఫిర్యాదు

*మీడియా సమావేశం *భూ కబ్జా విషయం లో అధికారుల నిర్లక్ష్యం.* *రాష్ట్ర మానవ హక్కుల కమిషన్,* *రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ లలో ఫిర్యాదు.* *న్యాయం కోసం బాధిత కుటుంబం పోరాటం.* ఈ సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం కు చెందిన మాజీ సర్పంచ్ పాత సత్యం కుటుంబ సభ్యులు మాట్లాడుతూ దళిత కులస్తులలైన వీరికి నాటి ప్రభుత్వం వీరి తండ్రి అయిన పాత రాజయ్య పేర తన జీవిత కాలంలో నాటి ప్రభుత్వ నిబంధనలను అనుసరించి 1989లో ధర్మారం, కొత్తపల్లి గ్రామా పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వే.నం.467/1లో 33×40 చదరపు గజాల స్థలాన్ని ప్లాట్. నం. 1గా నిర్ధారిస్తూ రెవెన్యూ పరంగా పట్టా, లొకేషన్ మరియు ఇంటి నిర్మాణం కోసం గ్రామ పంచాయతీ అనుమతి మంజూరు చేయటం జరిగింది. నాడు అందులో ఇంటి నిర్మాణం చేసుకుని ఉన్నాం. ఈ క్రమంలో మాయొక్క ప్లాట్ ను కబ్జా చేసేందుకు మా ప్లాట్ సమీపంలో ఉన్న గందె మురళిధర్, గందె జగదీశ్వర్ మరియు ఇతరులు నాటి మాజీ నక్సలైట్ అయిన బయ్యపు సమ్మిరెడ్డి ద్వారా 2004 లో మా ఇంటి నిర్మాణం కూల్చివేయించటం జరిగింది. ఈ విషయాన్ని మేము స్థానిక పోలీసులతో పాటు జిల్లా యస్.పి గారికి ఫిర్యాదు చేయడంతో సదరు వ్యక్తులు కబ్జా నుండి వైదొలిగారు. మరల మేము మా ప్లాట్ లో తాత్కాలిక నిర్మాణం చేసుకుని మా కుటుంబ అవసరాలకు వినియోగించు కుంటున్న క్రమంలో సదరు కబ్జా దారుల కుటుంబ సభ్యుడు అయిన ధర్మారం కు చెందిన గందె మధు అను వ్యక్తి మరలా మా ప్లాట్ ను కబ్జా చేసేందుకు తేదీ. 21-12-2023 రోజున అందులోని నిర్మాణాన్ని కూల్చివేసి ప్లాట్ హద్దులను చెరిపి వేయటం జరిగింది. ఇట్టి విషయమై మేము స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిర్లక్ష్యం వహించడం తో మేము తేదీ. 19-2-2024 రోజున జిల్లా కలెక్టర్ గారికి మరియు తేదీ. 22-2-2024 రోజున జిల్లా సి.పి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అయిన మా సమస్య పరిష్కారం కాక పోగా సంబంధిత కబ్జా దారుడికే స్థానిక పోలీసులు వత్తాసు పలకడంతో మేము తేదీ. 26-3-2024 రోజున రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మరియు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ లలో పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయటం జరిగింది. కాగా ఫిర్యాదును పరిశీలించిన సదరు కమిషన్ వారు మా ఫిర్యాదును విచారణకు స్వీకరించారు. తదనుగుణంగా బాధ్యులపై చర్యలు చేపడతామని తెలియచేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇకనైనా స్థానిక పోలీసు వారు ఉన్నత స్థాయి కమిషన్ లను మరియు ఉన్నత అధికారులను తప్పు దోవ పట్టించకుండా నిజ నిజాలను పరిశీలించి దళిత కుటుంబానికి చెందిన మాకు ప్రభుత్వ పరంగా కేటాయించబడిన మా ప్లాట్ ను కబ్జా దారుడి నుండి మాకు ఇప్పిస్తూ బాధ్యులపై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని మరియు మా కుటుంబ సభ్యులకు ఏలాంటి హాని జరిగిన అందుకు సదరు కబ్జా దారుడు మరియు స్థానిక పోలీసు వారు బాధ్యత వహించాలని లేని యెడల మేము బాధిత కుటుంబ సభ్యులుగా ఆమరణ దీక్షకు పూనుకోవడం జరుగుతుంది అని గౌరవ ప్రదమైన మీడియా ప్రతినిధుల ద్వారా డిమాండ్ చేస్తున్నాం. *ఈ మీడియా సమావేశంలో..* సామాజిక కార్యకర్త, షేక్ సాబిర్ అలి. మరియు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. *ఇట్లు...* పాత సత్యం, సెల్:9866950232.

By NYALAKONDA ANIL DESAI | March 31, 2024 | 1 Comments

చెంగిచర్ల గొడవలకు కారణాలు ఇవేనా ?

చెంగిచర్ల గొడవలకు కారణాలు: పట్టణం విస్తరిస్తున్నకొద్ది హైదరాబాద్ పాత బస్తి లో నివశిస్తున్న STs లు ( షెడ్యూల్ తెగలు ST) కు చెందిన కొన్ని కుటుంబాలు ఉపాధి కొరకు చెంగిచెర్ల ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. దీంతో ప్రధానంగా పిట్టలోల్లు గా పిలవబడుతున్న (వీరు స్థానికంగా వేటాడం – పక్షులు, జంతువులను వేటాడి జీవనోపాడి పొందుతున్నారు. అలాంటి వారు 25 సం క్రితం ఇక్కడికి వచ్చారు. అప్పుడు ఈ ప్రాంతం అంతా అటవీ ప్రాంతం లాగా ఉండేది. ఈ సమయంలో 2004 లో ప్రభుత్వం ఇక్కడ జంతు వధశాలను ఏర్పాటు చేసింది. దీంతో ఈ కేంద్రం ఆధారంగా వ్యాపారం పెరగడం ప్రారంభం అయ్యింది. ఇక్కడికి మేకలను, గొర్రెలను తీసుకొని రావడం అమ్మకాలు చేయడం, ఇక్కడే వధించిన వాటిని పట్టణంలోని చాలా ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది. 2004 లో ప్రారంభం అయిన తరువాత ఈ జంతు వధ శాల దాదాపు 70 ఎకరాలలో విస్తరించి ఉంది. దీంట్లో ప్రధానంగా ఉపాధి కొరకు ముస్లింలు ప్రవేశించి ఉపాధి పొందుతుండడం జరుగుతుంది. ఇదే సమయంలో వారి కొరకు ఇక్కడ నివాసాలు సైతం ఏర్పాటు చేసుకున్నారు . అలాంటి ఒక నివాస సమూదాయమే ఈ పిట్టల బస్తికి మరో వైపు ఉంది..రోడ్డు ఒక వైపు పిట్టల బస్తి ఉంది , మరో వైపు ఇందిరమ్మ ఇండ్లు అనే ప్రభుత్వం కట్టించిన గృహ సముదాయం ఉంధి. దీంట్లో ముస్లిం వర్గానికి చెందిన ప్రజలు అధికంగా ఉన్నారు. వీరిలో అధికంగా బిహార్, బెంగాల్, మహారాష్ట్ర నుండి వచ్చి స్థిరపడిన వారె తప్ప స్థానికులు కారని చెబుతున్నారు. వారు ఎక్కువగా వధ శాలలో లో పని చేయడం జరుగుతుంది అన్నారు. దాంతో పాటు, ఈ వధ శాలలో ఏమి జరుగుతుందో బయటి సమాజనికి తెలువదు అని వారు అంటారు......దాంతో పాటు ఇక్కడ, మేకలు, గోర్రలే కాకుండా ఆవులను సైతం వదిస్తారు అనే అనుమానాలు ఉన్నట్టు కొంత మంది స్థానికులు అన్నారు. మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు (టీఎస్‌డబ్ల్యూబీ) మాజీ చైర్మన్ మహ్మద్ సలీమ్‌కు చెందిన సలీమ్ అండ్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ కబేళా నడుస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. నిజానిజాలు సంబంధిత శాఖల అధికారులకే తెలియాలి. ఏది ఏమైనప్పటికి , ఈ ప్రాంతం లో ముస్లిం సమాజం యొక్క ప్రభావం ఎక్కవుగా ఉంది. దాంతో పాటు వీరికి స్థానికంగా ఒక మసీదు ఉంది (స్థానికుల అభిప్రాయం ప్రకారం ఆ మస్జీద్ ను ప్రభుత్వ స్థలం ఆక్రమించి కట్టారు అని చెబుతున్నారు) దాంట్లో వాళ్ళు నమాజ్ (ప్రార్దన) చేస్తూ ఉంటారు. ఇస్లాం లో ముస్లిం లు కానీవారి ని కాఫిర్ గా పేర్కొనడం అందరికీ తెలిసిన విషయమే. దాంతో పాటు కాఫిర్ లతో ఒక ముస్లిం ఏ విధంగా ప్రవర్తించాలి అని నియమావళి పై ఎన్నో చర్చలు మనం గమనిస్తూనే ఉంటాము. ఇక్కడే నివసిస్తున్న ఈ హిందువులు, తమ సంప్రదాయానికి అనుగుణంగా వేడుకలు , పండుగలు చేసుకోవటం పరిపాటి. కానీ ముస్లిం జనాభా పెరుగుతున్న కొద్ది వీరి పై వారి అధిపత్యపు ధోరణిని కనబరుస్తూ వచ్చారు. ఈ విషయాన్ని పసిగట్టని అమాయక హిందువులు వీటిని భరిస్తూ నే ఉన్నారు. కానీ ఈ వేధింపులు మితి మీరడం సైతం కొన్ని సంధార్బల్లో జరిగింది. హిందూ అమ్మాయిలను వేధించడం జరగటం తో కొంత ఘర్షణ వాతావరణం ఉన్నప్పటికి , బస్తీ వాసులు ఇవన్నీ భరిస్తునే వస్తున్నారు. బస్తి వాసుల కథనం ప్రకారం రంజన్ మాసంలో హిందువులు పాటలు పెట్టడం అనేది ఒక సాకు మాత్రమే అని, ఈ దాడి వెనుక పెద్ద కుట్ర ఉందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగకుండా పోలీసులు అధికారులు చర్యలు తీసుకొవడంతో పాటూ బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

By NYALAKONDA ANIL DESAI | March 30, 2024 | 0 Comments

చెంగిచర్ల లో నిజాం కాలం నాటి రజాకార్ల అకృత్యాలు

చెంగిచర్ల లో నిజాం కాలం నాటి రజాకార్ల అకృత్యాలు హైదరాబాద్ బోడుప్పల్ లోని చంగిచర్ల లో పిట్టల( ST)సామాజిక వర్గానికి చెందిన హిందువుల పై రంజాన్ వేళ మతోన్మాదుల అరాచకాలు.. హోలీ వేడుకలకు సిద్దమవుతున్న హిందూ మహిళలు, పురుషులపై మూడువందల మంది పైగా ముస్లింలు మూకుమ్మడి గా కర్రలు, రాడ్ల తో తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడి లో గర్భవతి అయిన ఒక మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. పిట్టల బస్తి లో సంఘటన పూర్వాపరాలు ఈ బస్తీ లో గుడిసెల్లో ఒక 30 సంచార జాతి పిట్టల సామాజిక వర్గానికి చెందిన హిందు కుటుంబాలు గుడిసెల్లో వుంటాయి. ప్రక్కనే ఇందిరమ్మ ఇళ్లలో ఆరు ముస్లిం.కుటుంబాలు నివాసం వుంటాయి, గతం లో కూడా వినాయక నిమజ్జనం కూడా చెయ్యనియ్యకుండా అడ్డుకునేవారు పోలీస్ వాళ్ళు.కూడా వీరికి న్యాయం చేసే వారు కాదు అని విమర్శలు కూడా వున్నాయి శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజు కూడా అక్షతల వితరణ చెయ్యకుండా .అడుగడునా అడ్డుతగిలి ఘర్షణ వాతావరణం సృష్టించారు, ఆనాటి నిజాం పాలనలో రజాకార్ల లాగా బస్తీలోని మహిళ లుదారి వెంబడి వెళ్తున్నప్పుడు వారి పిరుదలపై కొడుతూ లైంగికంగా వేదించేవారు ముస్లిం యువకుల తల్లులు హిందు అమ్మాయిలను వాళ్ళ ఇందిరమ్మ ఇళ్లలోకి గుంజుకొని పొమ్మని ప్రోత్సహించేవారు ఇక్కడి బస్తీలో హిందువుగా జీవించడానికి నిజాం కాలం లో హిందువు ల్లా అడుగడుగునా సంఘర్షణ చెయ్యాల్సి వస్తుంది. ఈ విషయం.పై పోలీస్ స్టేషన్ కు పిర్యాదులు కూడా చేశారు కానీ ముస్లింల పై చర్యలు తీసుకోక పోగా పిట్టల సామాజిక వర్గాన్ని తిరిగి బెదిరించేవారు. హొలీ పండుగ రోజు కూడా హిందు పురుషులు అందరూ బయటకు వెళ్లారు బస్తీ లో ని మహిళలు కామదహనం చేస్తూ జై శ్రీరామ్ అనే పాట పెట్టుకొని నృత్యాలు చేస్తున్నారు ఆ మహిళలను కొద్దిమంది ముస్లిం యువకులు వీడియో లు తీస్తూ వెకిలిగా అరుస్తున్నారు దీన్ని గమనించిన ఒక హిందు యువకుడు వీడియో తీస్తున్న ముస్లిం లను వారించే ప్రయత్నం చేసాడు దాని కి గాని ఆ ముస్లిం యువకుడు హిందు యువకుడి పై దాడి చెయ్యడం జరిగింది వెంటనె ఆ దగ్గర్లో ఉన్న ఒక హిందు మహిళ ఎందుకు కొడుతున్నావు అని అడిగింది అప్పుడు ఆ ముస్లిం యువకుడు ఆ మహిళపై దాడి చేశారు వెంటనే ముస్లిం లు తమ వాళ్ళను మస్జీద్ నుండి పిలుచుకొని దాడి చెయ్యడం ప్రారంభించారు ఇస్లాం జిందాబాద్ నారా యే కి తగ్బీర్ అల్లహో అక్బర్ అనే యుద్ధ నినాదాలు చేసి ఈ భూమి మాది పాకిస్థాన్ భూమి అని గట్టిగా అరుస్తూ దాడి చెయ్యడం ప్రారంభించారు అప్పుడు గొడవ విషయం తెలుసుకున్న ఒక ఆరుగురు హిందు యువకులు గొడవ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు వెంటనే మస్జీద్ నుండి బయటకు వచ్చిన ముస్లిం లు సుమారుగా 3 వందలకు పై గా గుమిగూడి ఇండ్లల్లోకి వెళ్లి మరి మహిళలను బయటకు గుంజుకొని వచ్చి అత్యంత పాశవికంగా దాడి చెయ్యడం జరిగింది పెద్దపెద్ద రాళ్ల తో ముస్లింలు హిందువులపై దాడి చేసి చంపి వేసే ప్రయత్నం చేశారు ఈ దాడిలో ఒక.గర్భవతి అయిన మహిళ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ప్రాణాయామ స్థితిలో హాస్పిటల్ లో కొట్టుమిట్టాడుతోంది. పసిపిల్లలపై కూడా దాడి చేశారు ఈ దాడి లో గాయపడిన ఒక మహిళ కు చిన్న పిల్లలు వుండడం తో ఇంట్లో చూసుకునే వారు ఎవరు లేకపోతే హాస్పిటల్ లో వైద్యం తీసుకోకుండా గాయాల బాధను పంటిబిగువున భరిస్తూ ఇంటి దగ్గరే వుండి బాధపడుతుంది , గొడవ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న ఇద్దరు పోలీస్ లు కూడా ఆపే ప్రయత్నం చేయకపోగా హిందువులపైనే లాఠీ చార్జీ చెయ్యడం జరిగింది ముస్లిం లు పోలీస్ లపై కూడా దాడి చెయ్యడం జరిగింది ఆ సమయం లో ఒక పోలీస్ బాత్రూమ్ లో దాక్కొన్నాడు అతన్ని కాపాడడానికి ఒక హిందు యువకుడు ఆ బాత్రూమ్ కు గడియ పెట్టి రక్షించడం జరిగింది.ఆ బస్తి లో అంబేద్కర్ విగ్రహం ఉంది ఈయనకూడా హిందువే అని అరుస్తూ ముస్లిం మూకలు అంబేద్కర్ విగ్రహం యొక్క ముక్కు, కళ్ళ అద్దాలు విరగగొట్టడం జరిగింది . పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా పోలీస్ స్టేషన్ సాక్షిగా హిందువుల పై ముస్లిం లు దాడి చేశారు అంతలోనే అక్కడికి చేరుకున్న భజరంగ్దల్ RSS హిందువాహిని, బీజేపీ వంటి తదితర హిందు సంస్థలు బాధితులకు అండగా నిలబడ్డారు దానికి కారణముగా హిందువులు బ్రతికి బయట పడ్డారు ఇంత జరిగినా ఈ ఘటనలో ముఖ్య కారకులు అయినా ముస్లిం దుండగుడు కలీమ్ మరియు 20 మంది కారకులు అయిన దుండగులను అరెస్ట్ చెయ్యేకపోగా అమాయక హిందువుల నే అరెస్ట్ చేశారు . దాడి చేసిన ముస్లిం లు బాధితుల కళ్ళ ముందే తిరుగుతూ బాధితులను మీరు ఏమి చెయ్యలేరు అంటూ ఎగతాళి చేస్తున్నారు ఈ బస్తీ వాళ్ళు నిత్యం పని చేసుకుంటేనే గానీ బ్రతికేవాల్లు అలాంటిది ఈ దాడి తరువాత.బయంతో.కొద్దిమంది వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు ఇంకొంతమంది బిక్కు బిక్కుమంటూ ప్రాణ బయం తో వున్నారు ఈ భయానక పరిస్థితులలో బయటనుండి బాధిత కుటుంబాల ను వాళ్ళ బంధువులను కలవడానికి వస్తే పోలీస్ వాళ్ళు వాళ్ళను కలువనీయకుండ అడ్డుకుంటున్నారు . అక్కడి స్థానిక.BRS కార్పొరేటర్ బాధితుల కు దైర్యం చెప్పే.ప్రయత్నం చెయ్యకుండా ఈ సంఘటన ను కప్పిపుచ్చే ప్రయత్నం చేసాడు . ఈ పరిస్థితి లో వాళ్లకు కేవలం హిందూ సంస్థలు మరియు బీజేపీ మాత్రమే అండగా నిలబడ్డాయి సేవా సంస్థ అయిన సేవాభరతి ద్వారా వాళ్లకు దినసరి సరుకులు మందులు అందించడం జరిగింది ఈ ఘర్షణ లలో మీడియా పాత్ర ఇంత ఘర్షణ జరుగుతున్న కేవలం సోషియల్ మీడియా , యూట్యూబ్ ఛానెల్స్ ద్వారానే బాధితుల ఆర్తనాదాలు, ఆక్రోధనలు బయట సమాజానికి వినిపించాయి ఏ ప్రముఖ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా లో బాధితుల ఆక్రందనలకు చోటు లేకుండా పోయింది. ఏది ఏమైనా రాజకీయ నాయకుల ఓటు బ్యాంక్ రాజకీయాల.కారణముగా హిందువు లు బాధితులు అయినప్పుడు వారి రోదనలు ఈ ప్రభుత్వానికి అరణ్య రోధనలే అవుతున్నాయి. భావజాలమే ప్రధానం కానీ భాదితులు కాదా ముస్లిం మూకలు హిందు మహిళలపై విచక్షణ రహితంగా దాడి చేస్తే మహిళా సంఘాల నాయకురాలు అయిన సంధ్య, దేవి,విమలక్క లాంటి తదిర వామపక్ష కుక్షీల మహిళా నేతలు ఇప్పటివరకు నోరు మేధపలేదు బడుగు బలహీన వర్గాల కష్టాల పై మొసలి కన్నీరు కార్చే ఎర్ర చొక్కా కమ్మీలకు ఈ బడుగు హిందు జీవుల గాయలనుండి రక్తం ఎర్ర రంగులో కాకుండా కాషాయం రంగులో కనబడ్డదా అందుకనే స్పందించడం లేదా అంటే ఈ సంఘటనలో బాధితులు హిందువులు నిందితులు ముస్లిం లు కాబట్టే నోరుమెదపడం లేదు అని విమర్శలు వస్తున్నాయి గతం లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధితులు హిందువులు అయినప్పుడు ఎప్పుడు నోరుతెరవలేదు , జై భీమ్ జై మీమ్ అని నినాదం ఇచ్చే దళిత్ ముసుగు వేసుకున్న దళిత సంఘాలు ఈ సందర్బంగా ఎక్కడ మాట్లాడకపోవడం అత్యంత దురదృష్టకరమైనది ఇందులోబాధితులు హిందువులు నిందితులు ముస్లిం లు కావడం వలనే నోళ్లు పెగలడం లేదు అని అనిపిస్తుంది , కేవలం భారతీయ జనతాపార్టీ తప్ప మిగిలన రాజకీయ పక్షాలు ఎవరు కూడా ఈ విషయం పై స్పందించడం లేదు ఎందుకంటే వాళ్లకు ముస్లిం ల ఓట్లు పడవు అనే భయం ఉన్నది . ముస్లిం ఓట్లకోసం వెంపర్లాడే వివిధ రాజకీయ పక్షాలు ఎవరు హిందు బాధితు లకు అండగా నిలబడడం లేదు. ఇక్కడ వాళ్ళ వాళ్ళ భావజాలమే ప్రధానం అవుతుంది తప్ప బాధితుల ఆర్తనాదాలు అరణ్య రోదనాలు లే అవుతున్నాయి

By NYALAKONDA ANIL DESAI | March 29, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1