ఫిబ్రవరి 12 (జనం గొంతు ): సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు.ఈ నెల 11వ తేదీ ఆదివారం వరంగల్ జిల్లా నర్సంపేటలో షోటో కాన్ జపాన్ కరాటే-డూ ఇండియా హోంబు, ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో జి హర్షవర్ధన్ కట 12 సంవత్సరాల విభాగంలో బంగారు పతకం,కుంత్త్ విభాగంలో బంగారు పతకం సాధించగా కరీంనగర్ జిల్లాలో జరిగిన ఇండో నేపాల్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో కటా 9 సంవత్సరాల విభాగంలో జి.రిషివర్ధన్ బంగారు పతకాలు సాధించారు.ఐపీఎస్ పాఠశాల డైరెక్టర్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ స్వీయ రక్షణకు,ఆత్మ రక్షణకు కరాటే అవసరమన్నారు.
Comments 0