ఫిబ్రవరి 12 (జనం గొంతు ): సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు.ఈ నెల 11వ తేదీ ఆదివారం వరంగల్ జిల్లా నర్సంపేటలో షోటో కాన్ జపాన్ కరాటే-డూ ఇండియా హోంబు, ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో జి హర్షవర్ధన్ కట 12 సంవత్సరాల విభాగంలో బంగారు పతకం,కుంత్త్ విభాగంలో బంగారు పతకం సాధించగా కరీంనగర్ జిల్లాలో జరిగిన ఇండో నేపాల్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో కటా 9 సంవత్సరాల విభాగంలో జి.రిషివర్ధన్ బంగారు పతకాలు సాధించారు.ఐపీఎస్ పాఠశాల డైరెక్టర్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ స్వీయ రక్షణకు,ఆత్మ రక్షణకు కరాటే అవసరమన్నారు.
సుల్తానాబాద్,ఏప్రిల్ 5 (జనం గొంతు) : సుల్తానాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ తన మానవత్వాన్ని చాటుకున్నారు.సమాజంలో పోలీసులు పాత్ర చాలా ముఖ్యమైనది.ఒకవైపు తన కుటుంబాన్ని చూసుకుంటూ,ప్రజలకు రక్షణ కల్పిస్తు,శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను కూడా పరామర్శించి ఆదుకుంటున్నారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ వాసి ఇటీవల రోడ్ ప్రమాదం లో మరణించిన తెలుకుంట్ల హన్సిక (17) కుటుంబాన్ని ఎస్సై శ్రవణ్ కుమార్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించి వారి కుటుంబానికి 1 క్వింటాల్ బియ్యాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ఆదుకోవడం మానవ ధర్మం అని యువత కూడా వృధా ఖర్చులు పక్కన బెట్టి ఇలాంటి సేవ కార్యక్రమాలలో పాలుపంచుకోవాలని పిలుపు ఇచ్చారు.వీరి ఆర్థిక పరిస్థితి గురించి సమాచారం ఇచ్చిన తాళ్ళపల్లి అగయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మనోజ్ గౌడ్ ని ఎస్ఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో మనోజ్ గౌడ్, ఆటో యూనియన్ సభ్యులు, స్థానిక యువత పాల్గొన్నారు.
సుల్తానాబాద్,జులై 22 (జనం గొంతు ): లయన్స్ క్లబ్,ఐపీఎస్ పాఠశాల ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలో సోమవారం జాతీయ పతాక ఆమోద దినోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా మొదటి ఉప గవర్నర్ లయన్ సింహరాజు కోదండరాములు,సీఐ సుబ్బారెడ్డి జెండా ఊపి జాతీయ పతాక ర్యాలీని ప్రారంభించారు.లయన్స్ క్లబ్ ప్రతినిధులతో పాటు ఇండియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా 100 మీటర్ల భారీ త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని పట్టణ పురవీధుల గుండా దేశభక్తి నినాదాలతో,ఆట పాటలతో నృత్యాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యాన్ని పొందిన మన దేశ పౌరులకు స్ఫూర్తినిస్తూ జాతీయ సమైక్యతను పెంపొందించడంలో భాగంగా పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని 1947 జూలై 22వ తేదీన మన భారత రాజ్యాంగం ఆమోదం తెలిపిందని దాని యొక్క గొప్పతనాన్ని పవిత్రతను కాపాడడంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను విధేయతను చూపాలని సభ్య దేశాలలో అది సగర్వంగా ఎగిరేటట్లు చూడాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్,జి ఎల్ టి మిట్టపల్లి ప్రవీణ్ కుమార్,జిల్లా కో ఆర్డినేటర్లు వలస నీలయ్య, మాటేటి శ్రీనివాస్,జూలూరి అశోక్ సభ్యులు పిట్టల వెంకటేశం,పూసాల సాంబమూర్తి,గజబీంకర్ జగన్, నాగమల్ల ప్రశాంత్, చకిలం వెంకటేశ్వర్లు,పూసాల రామకృష్ణ,తూర్పాటి భార్గవ్ కృష్ణ, ఎస్సై శ్రవణ్ కుమార్, ఐపీఎస్ పాఠశాల డైరెక్టర్ మాటేటి క్రిష్ణ ప్రియ ,విద్యార్థినీ విద్యార్థులు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.