రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం పై మండలాధికారులతో మండల సమన్వయ కమిటీ సమావేశం మరియు ఏ.ఎన్.ఎం.లు,ఆశా కార్యకర్తలకు, అంగన్వాడీ టీచర్లకు పోలియో కార్యక్రమం పై శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ సతీష్ కుమార్, ఎంపీడీవో చిరంజీవి, సుష్మ ఎంపీ ఓ, ప్రమీల సిహెచ్ఓ, శ్రీనివాస్ హెచ్ ఈ ఓ, శ్రీధర్ హెచ్ఎస్, రత్నమాణిక్యం హెచ్ ఎస్, మరియు ఏ.ఎన్.ఎం.లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లలు పాల్గొన్నారు.
రాయికల్ //జనం గొంతుప్రవీణ్. జి తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా DMHO గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమంలో జన జాగృతి కళావేదిక కళాబృందం రాయికల్ మండలంలోని గాంధీ చౌక్ వద్ద కళాకారులు పల్లె సుద్దులు పాటలు మాటలతో ప్రజల్ని చైతన్య పరిచారు కళాబృంద కళాకారులు గడ్డం రమేష్, గంగాధర్ నాయక్, కునమల్ల సుమన్,డప్పు స్వామి రూప ప్రదర్శన ఇచ్చారు సమాజంలో అన్ని మారుతున్న తరుణంలో మన ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వహిస్తున్నాము కచ్చితంగా ఐ సి టి సి కేంద్రానికి వెళ్లి అందరు పరీక్షలు చేయించుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని కళాకారులు తెలిపారు.
విద్యావంతుల నుంచి సామాన్య పౌరుల వరకు అందరూ శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణకు తగిన శాస్త్రీయ అవగాహనను కలిగి ఉంటేనే ప్రజారోగ్యం దేశాభివృద్ధికి దోహదపడుతుందని రెనీ ఆసుపత్రి అధినేత ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ లయన్ డా బంగారి స్వామి అన్నారు. ప్రపంచ ఆస్టియోపోరెసిస్ లేదా బోలు ఎముకల వ్యాధి దినం సందర్భంగా రెనీ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి, శాతవాహన లయన్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన ‘డా: బంగారి స్వామితో ముఖాముఖి’ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, నగర పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ పటిష్ట ఎముకల ఆరోగ్య పరిరక్షణకు కావలసిన విటమిన్-డి పొంగడానికి ప్రతి రోజు ఉషోదయాన సూర్య కిరణాలు పడేటట్లు ఎండలో అరగంట పాటు నడవడం, సూర్య నమస్కారాలు, యోగాసనాలు చేయడం మన జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. దీనికి తోడుగా 50 ఏండ్ల దాటిన వయోజనులు ఎముకల వ్యాధుల పట్ల తగు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. పురుషుల కన్న మహిళలకు ఎముకల ఆరోగ్య సమస్యలు అధికంగా నమోదు అవుతున్నాయని తెలిపారు. ఆస్టియోఫోరెసిస్ వ్యాధి పలు కారణాలతో వస్తుందని సవివరంగా వివరించారు. వయోవృద్ధులు బాత్ రాంలో, తడిగా ఉన్న నేలపై నడవడంతో జారి పడడంతో వెన్నెముక, తొంటి, చేతి మడిమల వద్ద ఫ్రాక్చర్లు జరుగుతాయని హెచ్చరించారు. సరైన పోషకాహారంతో పాటు పొగాకు, మద్యం లాంటి దురలవాట్లకు దూరంగా ఉన్నపుడే ఎముకల పటిష్టత, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తాయని తెలిపారు. రెనీ ఆసుపత్రి డైయటీషియన్ స్పూర్తి మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం నీళ్లలో నానబెట్టిన నీటిని ఒక గ్లాసు తాగడం, చిరు ధాన్యాలతో చేసిన అల్పాహారం తీసుకోవడం, భోజనంలో ఆకుకూరలు, అన్ని రకాల కూరగాయలు ఉండేలా ప్రణాళికాబద్దంగా ఆహారం తీసుకోవాలని వివరించారు. సమావేశంలో పలువురు అడిగిన ప్రశ్నలకు డా బంగారి స్వామి సరళ భాషలో సమాధానాలను ఇచ్చి అందరి ప్రశంసలు పొందారు. లయన్ కెప్టెన్ డా బుర్ర మధుసూదన్ రెడ్డి సమన్వయకర్తగా, లయన్ మేకల అరవింద్ రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రెండవ ఉప గవర్నర్ లయన్ సింహరాజు కోదండరామ్ మాట్లాడుతూ పలు సామాజిక సమస్యలకు స్పందించడమే కాకుండా పేదలకు అవసర సేవలతో పాటు నిత్యం అన్న ప్రసాద వితరణలు మారుమూల గ్రామీణ భారతంలో కూడా ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్బులు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో పిఆర్సీలు లయన్ నర్సింగ రావు, లయన్ ఇనుగుర్తి రమేష్, పిజెడ్సిలు, జెడ్సిలు లయన్ పి శ్రీహరి రెడ్డి, లయన్ సీతారాంరెడ్డి, లయన్ జగదీశ్వరాచారి, లయన్ మేచినేని సత్యనారాయణ రావు, కార్యదర్శి లయన్ మహేందర్, సంయుక్త కార్యదర్శి లయన్ డా ఎల్లలా లక్ష్మారెడ్డి, జిల్లా మెంటర్ లయన్ సింగమ రాజు, ప్రిన్సిపల్ లయన్ డా వి శ్రీనివాస్, లయన్ కోటేశ్వర్, లయన్ రామచంద్రం, ఆసుపత్రి సిబ్బంది, నగర క్లబ్బుల సభ్యులు, నగర పౌరులు హాజరై అవగాహన పొందారు. అనంతరం శాతవాహన లయన్స్ క్లబ్ సభ్యులు డా బంగారి స్వామిని సముచితంగా సన్మానించారు.
Your experience on this site will be improved by allowing cookies.