మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ పట్టణంలో చౌటుప్పల్ కోర్ట్ అంబర్పేట్ అసోసియేషన్ ఎన్నికలలో చౌటుప్పల్ అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ గ్రంథాలయ కార్యదర్శిగా నర్ర స్వామి కుర్మ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చౌటుప్పల్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి మహంతి వైష్ణవి గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది మాజీ బార్ ఆసోసియేషన్ అధ్యక్షుడు అధ్యక్షుడు నరసింహా రెడ్డి గారు నర్రి స్వామి గారిచే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రస్తుత అధ్యక్షులు ఉడుగు శ్రీనివాస్ గౌడ్ గారు అధ్యక్షత వహించారు. చౌటుప్పల్ అడ్వకేట్ బార్ అసోసియేషన్ గ్రంథాలయ కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తెలంగాణ సామాజిక చైతన్యత రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, లాయర్స్ ఫోరం పర్ సోషల్ జస్టిండీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రముఖ హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి కురుమ గారు మాట్లాడుతు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టు లో ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ మాతృభూమి అన్న మా మునుగోడు నియోజకవర్గం లోని చౌటుప్పల్ బార్ అసోసియేషన్ గ్రంథాలయ కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషకరం అదృష్టంగా భావిస్తున్నాను. న్యాయవాదుల అందరికీ న్యాయ పరిజ్ఞాన్ని అందించే విధంగా గ్రంథాలయాన్ని అభివృద్ది చేసి న్యాయ పరిజ్ఞానాన్ని అందరికీ అదే విధంగా చూస్తామని కోర్టు విధులు సహజంగా నిర్వహించుటకు ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేయటం న్యాయవాద కుటుంబ సభ్యులందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యలను పరిష్కరించడానికి విచ్చేస్తానని నా జర్నలిస్టు లా బుక్స్ మరియు గ్రంథాలయాన్ని నిర్మాణం చేయించి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో ఎలక్షన్ ఆఫీసర్లుగా పనిచేసిన న్యాయవాదులు, కానుగ వెంకటయ్య , ఈసం శంకరయయ్య, రాధాకృష్ణ నూతనంగా ఎన్నికైన చౌటుప్పల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం, చౌటుప్పల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉడుగు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు తాడూరి పరమేశ్, ప్రధాన కార్యదర్శి రాపోలు వేణు, సంయుక్త కార్యదర్శి జెల్ల రమేష్, కోశాధికారి మైపాల్ రెడ్డి, మహిళా రిప్రజెంటేటివ్ స్వాతి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ శేఖర్ శ్రీశైలం సీనియర్ న్యాయవాదులు వెంకటాచలం, ఎలమొని శ్రీనివాస్, ఎస్. ఆర్. బిక్షపతి, శ్రీకాంత్ జ్యోతి రవీందర్ సత్తిరెడ్డి భుక్షమయ్య అనేక మంది న్యాయవాదులు పాల్గొన్నారు