రామగుండంలో తాళం వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 10న పెట్రోలింగ్ సమయంలో పట్టుబడిన నిందితుల వద్ద నుంచి రూ.16 లక్షల విలువైన బంగారం, వెండి, బైకులు, ఫోన్లు, డీజే సిస్టం, నగదు స్వాధీనం చేసుకున్నారు. గోదావరిఖని, రామగుండం ప్రాంతాల్లో చేసిన 9 దొంగతనాల కేసుల్లో నిందితులపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.