రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఆధార్ నమోదు కేంద్రాన్ని రాయికల్ మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ,మండల ప్రజలు ,విద్యార్థులు ఆధార్ నమోదు కేంద్రం లో అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆధార్ నమోదు కేంద్రం నిర్వాహకులు గంట్యాల ప్రవీణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.