తెలంగాణ రాష్ట్రం లో మహిళలకు పెద్దపీట మహాలక్ష్మిగా గుర్తింపు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు రవాణా సంస్థ కు చెందిన ప్రభుత్వ బస్సులో ఉచిత ప్రయాణం. అంత వరకు బాగానే ఉంది. నిజానికి ఈ పథక ఉద్దేశ్యం కూడా అద్భుతంగా ఉంది. తెలంగాణ లో రాష్ట్రం లో బస్సు ప్రయాణం ఖరీదు కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల లో బాగంగా ఉచిత బస్సు ప్రయాణం కూడా చేర్చి అధికారం లోకి కూడా రావడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే క్షేత్ర స్థాయిలో అమలు జరిపేది బస్సు కండక్టర్లు కాగా ఇది వారికి తల నొప్పి గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పల్లెల్లో ఎలాంటి సమస్యా లేనప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో మాత్రం కొత్త తలనొప్పులు తెస్తోంది. మహిళ ఉచిత ప్రయాణం చేయాలంటే తన వెంట కేవలం ఆదార్ కార్డు ఉంటే చాలు. అయితే ఇదే సావకాశంగా కొందరు మహిళలు ఆదార్ కార్డు లు చూపిస్తున్నప్పటికి అవన్ని కూడా ఫేక్ కావడం గమనార్హం. ఈ సందర్భంగా కండక్టర్లు చెప్పిన మాటలు వింటుంటే బిత్తర పోవడం తప్ప చేసేదేం లేదు అనే విషయం ఇక్కడ తేటతెల్లం అవుతుంది. రాష్ట్ర అధికారిక పట్టణం హైదరాబాద్ ( భాగ్యనగరం) లోనే ఈతరహ మోసాలు అదికంగా జరుగుతున్నాయని కండక్టర్లు చెబుతున్నారు. పట్టణంలో ని పాతబస్తీ, కార్వాన్, గోషామహల్,మహదీపట్నం,ఎల్ బి నగర్ ప్రాంతంలో అదికంగా ఇలా ఒకే ఆదార్ నెంబర్ తో పలువురు మహిళలు ప్రయాణం చేస్తున్నారని అదేమని అడిగితే కొట్టేంత పని చేస్తున్నారని తెలిపారు. పట్టణంలోని ఎల్ బి నగర్ ప్రాంతంలో ఇదే ఫేక్ ఆదార్ కార్డు ప్రయాణం చెల్లదనే విషయమై వారితో అనగా మూకుమ్మడిగా దాడి చేసారని తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ లో సంప్రదించగా ఇలాంటి సంఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు. అయినప్పటికీ సామాన్యులకు ఆర్దికంగా ఉపయేగపడాలనే ప్రభుత్వ ఆలోచనలు ఇలాంటి వారి మూలంగా మరిన్ని సమస్యలను తెస్తోంది. అయితే ఇలాంటి సంఘటనలు ఎక్కువగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు దబాయింపు దోరణిలో ప్రయాణం చేస్తున్నారని కండక్టర్లు చెప్పిన మాటలు బట్టి అర్థమవుతోంది. మహిళ ప్రయాణం తెలంగాణ లో పూర్తి ఉచిత మే కాబట్టి ఫేక్ ఆదార్ కార్డు తీసుకు రావాల్సిన అవసరం లేదు. అయితే అటువంటి అవసరం ఎవరికి ఉంటుంది. వారు ఇతర రాష్ట్రాల మహిళ లా లేక రోహింగ్యా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారా అనేది పోలీస్ వర్గాలు విచారించిన అంశంగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ వర్గాలు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
అంగన్వాడీ సెంటర్ లో అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాన్ని రాయికల్ మండలము భూపతిపూర్ అంగన్వాడి సెంటర్లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపిడిఓ చిరంజీవి మాట్లాడుతూ పిల్లల సంఖ్య ను అంగన్వాడీ లో పెంచే విధంగా కృషిచేయాలని సూచించారు.పిల్లలకి పోషకాలతో కూడిన సమతుల్య ఆహరం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ ,సెక్రటరీ హరికృష్ణ, సూపర్వైజర్ రాధ,అంగన్వాడీ టీచర్స్,కవిత,సుమలత ,సుగుణ ,ఆశా వర్కర్లు, వివోలు పాల్గొన్నారు
Your experience on this site will be improved by allowing cookies.