రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ మండలం నుండి కోరుట్ల కు వెళ్లే రహదారిలో మైతాపూర్ బస్ స్టాప్ వద్ద గతంలో వర్షాల దాటికి ఆర్ అండ్ బి రోడ్డుకు వాహనదారుల భద్రత కోసం పోసిన మట్టి కొట్టుకుపోవడం వల్ల వాహనదారులు భయం గుప్పెట్లో ప్రయాణిస్తున్నారు. ఏమాత్రం వాహనం పట్టు కూలిపోయిన ప్రాణాలకే నష్టం కలుగుతుంది. ఇప్పటికైనా అధికారులు రోడ్డుకు ఇరువైపుల మట్టి పోసి భద్రత కల్పించగలరని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Comments 0