పేరుకే బీసీల ప్రధాని.. వారికి చేసింది మాత్రం శూన్యం.. వారిని మోదీ ఎలా మోసం చేశారో చెప్పడానికి ఇదే సాక్ష్యం హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఈ ఉదాహరణలు చాలు బీసీలపై బీజేపీకి ఉన్న ప్రేమ తెలియడానికి. తాను బీసీ ప్ర ధానినని మోదీ చెప్పుకోవడానికే తప్ప.. బీసీలకు చేసిందేమీలేదని దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రధాని మోదీ నిర్ణయాలు, బీజేపీ చర్యలు దీనికి సా క్ష్యంగా నిలుస్తున్నాయి. బీసీ కులగణనపై బీ జేపీ అధికారంలోకి రాకముందు ఒక మాట మాట్లాడి, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. 2010లో బీజేపీ ఎంపీ గోపీనాథ్ ముండే పార్లమెంట్లో మాట్లాడుతూ.. ‘2011 జనాభా లెక్కల్లో బీసీ కులగణన చేయకపోతే వారికి సామాజిక న్యాయం చేయడం సాధ్యం కాదు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు అన్యాయం చేయడమే’ అని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. 2015లో అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ (దివంగత) మాట్లాడుతూ.. ‘2011లో కేంద్రం సేకరించిన కుల గణన డాటాను బహిర్గతం చేస్తాం’ అని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ బహిర్గతం కాలేదు. 2018 ఆగస్టు 31న అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘2021 జనాభా గణనలో కుల గణన నిర్వహిస్తాం’ అని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు చేపట్టలేదు. 2021 సెప్టెంబర్లో ‘జనగణనలో బీసీ కులాల గణన చేయడం సాధ్యం కాదు’ అని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచీ బీసీ కులగణన చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నది. 2021లో అసెంబ్లీలో బీసీ కులగణన తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఒక్క తెలంగాణ మాత్రమే కాదు బీహార్, మ హారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్ తదితర రాష్ర్టాలు కులగణన తీర్మానాలు చేశాయి. దేశవ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు వందలు, వేల వినతులు ఇచ్చాయి. డిమాండ్లు చేసినా, ధర్నాలు చేసినా పట్టించుకోలేదు. బీసీల కుల గణన జరుగక సామాజికంగా వెనుకబడిన తరగతులను గుర్తించడం సాధ్యం కావడం లేదని, వారికి విద్య, ఉద్యోగ రంగాల్లో అన్యా యం జరుగుతున్నదని నిపుణులు మొత్తుకొంటున్నారు. అయినా పట్టింపులేదు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించినా.. కుల జనాభా వివరాలు లేక లాటరీ పద్ధతిలో బీసీ స్థానాలు కేటాయిస్తున్నారని, దీంతో ఎక్కువ జనాభా ఉన్న కులాలకు అన్యాయం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నా వినిపించుకోవడం లేదు. బీసీ కులాల లెకలు లేకపోవడం వల్ల జనాభా ప్రకారం రిజర్వేషన్లు లేవని, సబ్ప్లాన్ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నా ప్రధాని చెవికి చేరడం లేదు. బీసీ జాబితాలోని కులాల సంఖ్యలో మార్పులు, చేర్పులు చేయాలన్నా కులగణనే ప్రాతిపదిక అని స్పష్టం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. బీసీ ఆత్మగౌరవ సభ అంటూ బుధవారానికి రాష్ర్టానికి వస్తున్న ప్రధాని మోదీ ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేస్తారా? అని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బీసీలకు మంత్రిత్వ శాఖ ఏది? దేశ జనాభాలో దాదాపు 56 శాతంగా.. అంటే 70 కోట్ల బీసీ జనాభా ఉన్నదని, కేంద్రంలో ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తొలి శాసనసభ సమావేశాల్లోనే ‘బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి’ అని 2014 జూన్ 14న రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీనిని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. తర్వాత లేఖలు, డిమాండ్లు, పార్లమెంట్ వేదికగా.. ఇలా వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. అయినా ఇప్పటివరకు కేంద్రం పట్టించుకోవడం లేదు. మోదీ వచ్చి బీసీ మంత్రిత్వ శాఖపై ప్రకటన చేసే అవకాశం ఉన్నదంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సోమవారం పేర్కొన్నారు. దీనిని బట్టి ఎన్నికలు వస్తే తప్ప బీసీలు గుర్తుకు రారా? అని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి.
జనంగొంతు/గోదావరిఖని/అంబటి సతీష్ / భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారుల జాబితా సోమవారం సాయంత్రం ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ విడుదల చేశారు.పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన కాజీపేట శివాజీని ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించినారు. కాసిపేట శివాజీ గత 15 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ లో వివిధ బాధ్యతలో చురుకుగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి ఎంతో గాని కృషి చేసినందుకు గాను రాష్ట్ర కోశాధికారి నుండి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది అని శివాజీ తెలియజేశారు. ఈ బాధ్యతను అప్పగించినందుకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి మరియు రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
బీజేపీ చేపట్టిన విజయసంకల్ప యాత్రలో భాగంగా ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామానికి బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. విజయసంకల్ప యాత్ర విజయవంతంగా జరుగుతుండటంతో కాంగ్రెస్ నాయకులు వణికిపోతున్నారు. బీజేపీ తో పొత్తు పెట్టుకోవడ కోసమే ఫిబ్రవరి 22వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపణలు చేశారు. బీజేపీ ఇమేజ్ ను తగ్గించాలనే ఉద్దేశంతో మ్యానుఫ్యాక్చరింగ్ వార్తలు సృష్టించారు. మాజీ ముఖ్యమంత్రికి ఫ్లైట్ బుకింగ్ నుంచి మొదలు ప్రధాని అపాయింట్ మెంట్ వరకు.. వార్తలు సృష్టించారు. మ్యానుఫ్యాక్చరింగ్ వార్తలతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారం చెలాయించాలనుకుంటోంది. తప్పుడు వార్తలతో తెలంగాణలో అధికారం చెలాయించాలనుకుంటున్న కాంగ్రెస్ కు ఎలా బుద్ధిచెప్పాలో ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్-బీజేపీ ఒకటేనంటూ కాంగ్రెస్-బీఆర్ఎస్ తోలుబొమ్మల నాటకం ఆడుతున్నాయి. ఎల్ ఎల్ బీసీ టన్నెల్ పూర్తికాకపోవడానికి నాడు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిర్లక్ష్యమే. నల్లగొండకు నీళ్లు తీసుకురాలేకపోయిన అసమర్థుడు. కాంగ్రెస్ హయాంలో నల్లగొండ జిల్లాకు ఒక్క ఫ్యాక్టరీ నిర్మించలేని, ఎల్ ఎల్ బీసీ టన్నెల్ పూర్తిచేయించలేని అసమర్థ నాయకుడు కోమటిరెడ్డి. గతంలో కోమటిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో సూర్యాపేట, కోదాడ దగ్గర నాగార్జునసాగర్ ప్రాజెక్టులోని లిఫ్టులను బంద్ చేయించారు. మునుగోడు నియోజకవర్గంలో మంచినీళ్లు అందించిన ఘనత వాజ్ పేయి గారి హయాంలోని కేంద్ర ప్రభుత్వానిది. వాజ్ పేయి గారి హయాంలో రూ. 748 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యలకు పరిష్కారం చూపారు. కాంగ్రెస్ హయాంలో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాల్లో కనీసం ఒక్క టీఎంసీ ప్రాజెక్టు అయినా నిర్మించగలిగారా..? కోమటిరెడ్డి గారు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా బీజేపీ -బీఆర్ఎస్ ఒకటేనంటూ చేసే పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిపై, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బడి సంజయ్ కుమార్ గారిపై విచక్షణ మరిచి మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం. పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేదంటూ వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డికి... జాతీయ హోదా రావాలంటే నియమనిబంధనలు తెలుసా..? తెలంగాణలో అత్యంత వెనుకబడ్డ నియోజకవర్గం కొడంగల్. సొంత నియోజకవర్గ సమస్యలే పట్టించుకోలేని వ్యక్తి.. పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదా అంటూ మాట్లాడటం సిగ్గుచేటు. 100 రోజుల్లోగా 6 గ్యారంటీలు.. 13 వాగ్ధానాలు నెరవేరుస్తామన్నారు. మరి ఇప్పటివరకు... ఎందుకు నెరవేర్చలేదు..? మహిళలకు రూ.2500, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్, రైతుబంధు, రుణమాఫీ, రూ.4వేల పింఛన్లాంటి హామీలు ఎందుకు అమలు చేయలేదు..? బీజేపీ విజయసంకల్ప యాత్ర విజయవంతం అవుతుండటంతో జగ్గారెడ్డి గారు ఇష్టానురీతిగా మాట్లాడుతున్నారు. ప్రశ్నించే హక్కు బీజేపీ కి ఉంది.. సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. అది తెల్సుకొని మసలుకోవాలి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ గారు మాట్లాడిన ముఖ్యాంశాలు : **** పదేపదే కాంగ్రెస్ నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిపై చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఇచ్చిన బూటకపు హామీలను నెరవేర్చలేకనే, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు బీజేపీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి లోపాయికారీ ఒప్పందం ఉంది. అందుకే గత ప్రభుత్వ అవినీతిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మాజీ ప్రధాని అయిన స్వర్గీయ పీవీ నరసింహారావు గారికి కేంద్రంలోని మోదీ సర్కార్ భారత రత్న ఇచ్చి, గౌరవిస్తే... కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీన్ని బట్టి చూస్తే.. ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అనేది కుటుంబ పార్టీనేనని అర్దమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి తెలిసిందల్లా టికెట్లు అమ్ముకోవడమే. తప్పుడు హామీలతో ప్రజలను నమ్మించి, గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ... ఇచ్చిన హామీలను ఎప్పటిలోగా నెరవేరుస్తారో చెప్పే దమ్ముందా..? విజయ సంకల్ప యాత్ర పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకంటే ప్రచారంలో బీజేపీ ముందు ఉండి, దూసుకుపోతుండడంతో, చేసేదేమి లేకనే... కాంగ్రెస్ నేతలు బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. కోమటిరెడ్డి గారి లాంటి నాయకులు.. మంత్రి పదవిలో ఉండి బీజేపీ నాయకులపై ఏకవచనంతో విమర్శలు చేయడం తగదని హెచ్చరిస్తున్నాం. బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలవి ఫెవికాల్ బంధం.. టికెట్ల విషయంలో కలిసి పంపకాలు చేసుకుంటారు. కాంగ్రెస్ కూలిపోతుండటంతో, భయంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజస్థాన్ నుండి రాజ్యసభకు వెళ్లారు. రాయ్ బరేలిలో రాహుల్ గాంధీ యాత్రకు ఎదురుదెబ్బ తగలడంతో పాటు.. ప్రజలు నల్ల జెండాలతో గో బ్యాక్ అంటూ తరిమికొట్టారు. పదేండ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ.9.50 లక్షల కోట్లు నిధులు కేటాయించింది. గత కేసీఆర్ సర్కార్ భూములిచ్చేందుకు సహకరించకున్నా... ట్రైబల్ యూనివర్సిటీ, ఆర్ఆర్ఆర్ సహా ఎన్నో వాటికి అనుమతులతో పాటు, నిధులను మంజూరు చేసింది. గత ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అప్పులకుప్పగా మారిందంటున్న కాంగ్రెస్ పార్టీ.. ఇచ్చిన గ్యారంటీలు, హామీలు ఎలా అమలు చేస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు మాట్లాడిన ముఖ్యాంశాలు : **** కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 75 రోజులు గడిచిపోయింది. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబం ఏటీఎంగా మార్చుకుని వేలకోట్లు నిధులు కాజేసిందని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల వేల ప్రచారం చేశారు. మరి అధికారంలోకి వచ్చాక అవినీతి నాయకులపై ఎందుకు కేసులు నమోదు చేయడంలేదు..? లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా విపక్ష పార్టీలకు అయ్యే ఎన్నికల ఖర్చును మొత్తం తానే భరించేందుకు సిద్ధమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో చెప్పారు. అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి..? కాళేశ్వరం ప్రాజెక్టులో సంపాదించిన అవినీతి సొమ్మును స్పాన్సర్ చేసేందుకేనా..? తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కర్ణాటక నుంచి డబ్బులు జారగొట్టారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఖాళీ అయిపోతోంది. ఇండి కూటమి చెల్లాచెదురవుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్టీ అధ్యక్షులతో పాటు పాతతరం, కొత్తతరం నాయకులంతా ఇప్పటికే పార్టీ నుంచి వెళ్లిపోయారు. టచ్ చేస్తే బీజేపీని నామరూపాల్లేకుండా చేస్తామని కోమటిరెడ్డి అంటున్నరు.. అసలు మీ పార్టీనే ఖాళీ అవుతోంది. కాంగ్రెస్ ను టచ్ చేయాల్సిన అవసరమేముంది..? కాంగ్రెస్-బీఆర్ఎస్ రహస్య మిత్రులు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేసులను నిర్వీర్యం చేయాలని చూస్తోంది.
బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కు కౌంటర్ ఇచ్చిన ఎన్వీ సుభాష్ తెలంగాణకు ఏం నిధులు ఇచ్చామో చెప్పడానికి బహిరంగ చర్చకు మేము సిద్ధం. దమ్ముంటే... ప్లేస్, టైం చెప్పండి వేల కోట్ల రూపాయల నిధులను ఇస్తున్న బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తే... చూస్తూ ఊరుకోం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తన్ని, తరిమేసినా మీకు సిగ్గు రాకపోవడం విచారకరం. బీఆర్ఎస్ అంటేనే బందిపోట్ల రజాకార్ల సమితి. మీ హయాంలో కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. మేడిగడ్డ మునిగిపోయింది. మీ అవినీతికి అంతే లేదు... అందుకే ప్రజాక్షేత్రంలో ముద్దాయిగా నిలబడ్డారు. ఇవాళ కూడా ప్రధాని మోదీ దేశ వ్యాప్తంగా రూ.41000 కోట్లతో 554 రైల్వే స్టేషన్లు, 1500 ఆర్ఓబీ/అండర్ పాస్ లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. నరేంద్ర మోదీ తెలంగాణ అభివృద్ధి కోసం ఏ మాత్రం నిర్లక్ష్యం లేకుండా అంకితభావంతో పనిచేస్తున్నారు. మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఒక అడుగు ముందుకేసి తెలంగాణ రాష్ట్రానికి అత్యధికమైన నిధులు ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 9 లక్షల 50 వేల కోట్లు కేటాయించింది. దీనిపై మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో అన్ని వివరాలు క్లుప్తంగా ప్రజల ముందుంచారు. అది మీకు గుర్తులేదా..? రూ.1,153 కోట్ల ఖర్చుతో కూడిన ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులకు తన నిబద్ధతకు మించి నిధులు అందించి హైదరాబాద్ పౌరుల సుదీర్ఘ కలను సాకారం చేస్తోంది. ఆదర్శ్ పథకం ద్వారా రైల్వే స్టేషన్లను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తోంది. 15 స్టేషన్ల పునరాభివృద్ధి.. 48 ఆర్ఓబీలు/ అండర్ పాస్ ల నిర్మాణాలు జరిగాయి. రూ. 6,338 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేసింది బీఆర్ ఎస్ కు కనిపించడం లేదా? తెలంగాణలో గిరిజన విశ్వ విద్యాలయం మంజూరు చేసింది మీకు గుర్తులేదా..? రూ. 1,366 కోట్లతో భువనగిరి జిల్లా బీబీనగర్లో ఎయిమ్స్ ఏర్పాటు మీకు కనపడటం లేదా..? రూ. 715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధిచేస్తోంది. కాజీపేటలో రూ. 521 కోట్లతో వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ మ్యానుఫ్యాక్షరింగ్ యూనిట్ ను ప్రారంభించిన విషయం మీకు తెలియదా..? రూ.442.03 కోట్ల పెట్టుబడితో తెలంగాణలోని రామగుండంలో 100 మెగావాట్ల అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు మీకు కనపడటం లేదా..? చెప్పుకుంటూ పోతే.. ఇంకా ఎన్నో నిధుల విడుదలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి ఈసారి పార్లమెంట్ ఎన్నికలతో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం నడుస్తోంది గతంలో రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని, కలిసి పోటీ చేసిన చరిత్ర ఆ పార్టీలదే కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసే... బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి గత ఎన్నికల్లో ఇట్లాంటి ప్రచారం చేసి లబ్ది పొందాలని చూశారు ఈసారి మాత్రం ప్రజలు అన్నీ గమనిస్తున్నారు లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుంది మీ కారు సర్విసింగ్ కి కాదు, కంప్లీట్ గా షెడ్డుకి వెళ్ళింది. అటు నుంచి ఇక స్క్రాప్ కే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒంటిరిగానే 370 ఎంపీ స్థానాలను గెలుస్తుంది. ఎన్డీఏ కూటమి 400 సీట్లు కైవసం చేసుకుంటుంది.
2014:2018లొ తెరాస ఎన్నికలహామీ ఫై :2014:2019 లొ బీజేపీ ఎన్నికల వాగ్దానాలు ఫై అసెంబ్లీ లో చర్చిద్దాం అని మా సిఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు విసిరిన సవాల్ కి తెరాస మాజీ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారు బీజేపీ పార్టీ నుంచి శాసన సభ పక్షం నాయకుడు శ్రీ మహేశ్వరరెడ్డి చర్చ కి సిద్ధమా? అని రేవంత్ రెడ్డి సైన్యం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా డిమాండ్ చేస్తూ తెరాస పార్టీ తెలంగాణ పదం ని బీజేపీ మతం ని వాడుకొని లబ్ది పొందడం బీజేపీపార్టీ మే 12వారణాసి 2014 లొ మాకు అధికారం ఇబ్బండి?6నెలల లోపున విదేశాల్లో నుంచి నల్ల డబ్బులు రప్పించి ప్రతి పేద వాడి ఖాతాలో 15లక్షలు జమ ఫై ఇచ్చిన హామీ పది ఏళ్ళు ఐనను మాట నిల బెట్టుకోక పోవడం ప్రధాని శ్రీ మోడీ పరిపాలన మొత్తం కాంగ్రెస్ పార్టీ ని విమర్శలు చెయ్యడం కోసం ఉపయోగించడం ఫై బీజేపీ వారు మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చేసిన ఆరు గ్యారంటీ పథకంలొ గృహ జ్యోతి పథకం నేడు ప్రారంభం ఫై బీజేపీ mla లు మా సిఎం గారికీ శుభాకాంక్షలు చెప్పాలి అంతే కాదు ప్రజలు కష్టపడి కట్టిన పన్నులతొ కాళేశ్వరం ప్రాజెక్ట్ లొ ప్రజా ధనం దుర్వినియోగం వల్ల నేడు తెలంగాణ అప్పుల కుప్ప గా మారడం ఫై ప్రధాని శ్రీ మోడీ గారు తెరాస తొ జత గా లేము అంటే వెంటనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫై సిబిఐ విచారణ జరపాలని భారతీయుడు గా ప్రధాని ని (x)మద్యమం )ద్వారా డిమాండ్ చేస్తూ తెరాస పాలన లొ బాగు పడింది mla ఎంపీ లు మాత్రమే తెర నేతలు ప్రభుత్వం సింగరేణి భూములు వారి అబ్బ సొమ్ము అన్నట్టు గా అధికారులని ప్రళబోలకి గురి చేసి తమ అవినీతి వ్యవహారం ఫై కాంగ్రెస్ పార్టీ లోకి వద్దాం అనుకుంటున్న నేతలకి కాంగ్రెస్ పార్టీ లొ స్థానం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ అని పార్లమెంట్ ఎన్నికల్లో 17పార్లమెంట్ నియోజకవర్గం లొ 14స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నదని సెంట్రల్ లొ ఇండియా విపక్షాల పార్టీ అధికారం లోకి రావడం ఫై కాళేశ్వరం ప్రాజెక్ట్ లొ జరిగిన అవినీతి వ్యవహారం ఫై ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు సిబిఐ విచారణ ఫై విజ్ఞప్తి చేస్తున్న మీ కొలిపాక శ్రీనివాస్ ప్లాట్ నెంబర్ 4అభయఆంజనేయ స్వామి దేవాలయం వెనుక చంగి చెర్ల బొల్లిగూడ బోడుప్పల్ హైదరాబాద్ 9133135710
మల్కాజ్గిరి టికెట్ తనకు ఖరారు అయిందని చెబుతున్న ఈటెల.. రేపు పొద్దున్న శామీర్ పేట లోని ఈటెల నివాసంలో బ్రేక్ఫాస్ట్ కోసం బీజేపీ కార్యకర్తలను ఆహ్వానించారు. ఇప్పటి వరకు ఎవరికి టికెట్ ప్రకటించకుండా కేవలం ఈటెలకు మాత్రమే ఎలా ప్రకటిస్తారు అని అయోమయంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రలతో కాషాయ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. 9వ రోజుకు చేరిన విజయసంకల్ప యాత్రలోనూ ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మంచి జోష్ కనపడింది. 5 క్లస్టర్లలో కొనసాగిన యాత్రలలో భాగంగా కార్నర్ మీటింగుల్లో బీజేపీ ముఖ్య నాయకులు నరేంద్ర మోదీ ప్రభుత్వంతో దేశంలో జరుగుతున్న సుపరిపాలనను ప్రజలకు వివరిస్తూ, బీజేపీకి మరింత మద్దతు కూడగడుతున్నారు. ప్రజలందరూ స్వచ్ఛంగా తరలివచ్చి దేశం కోసం మోదీ.. మోదీ కోసం మేం అంటూ నినదిస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో బీజేపీ కి వస్తున్న ప్రజాధరణ.. అత్యధిక మెజారిటీ సీట్లు సాధించేందుకు నిదర్శనంగా కనపడుతోంది. శ్రీరాముడిపై పట్ల విద్వేష వ్యాక్యలు చేసిన కాంగ్రెస్ పై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విరుచుకుపడ్డారు. రాముడే లేడని మాట్లాడిన కాంగ్రెస్ కావాలా? లేదా రాముడికి గుడి కట్టిన ప్రధాని నరేంద్ర మోడీ కావాలా? అని ప్రజలు ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు. ట్రిపుల్ తలక్ రద్దు చేసి ముస్లిం మహిళలకి అన్నగా నిలిచిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు అని అన్నారు. పాత బస్తీ బాగుపడాలంటే బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ విజయ సంకల్ప యాత్రలతో కమలదళం ముందుకెళ్తోంది. రాష్ట్ర నేతలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. నేడు డాక్టర్ కె. లక్ష్మణ్ గారు గౌలిపురాలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రలో భాగంగా పాత బస్తీ మొత్తం కాషాయ మయంగా మారింది. ఈ యాత్ర భాగ్యలక్ష్మి క్లస్టర్ హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్ పురా, మలక్ పేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగింది. ఈ యాత్రలో ఎమ్మెల్యే, రామారావు పటేల్ గారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారు, తదితరులు పాల్గొన్నారు. రాజరాజేశ్వరి క్లస్టర్ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొనసాగిన విజయసంకల్ప యాత్రకు జనం జేజేలు పలికారు. జహీరాబాద్ లో ప్రసిద్ధ కేతకి సంగమేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉగ్గెల్లి బైపాస్ నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. కార్యకర్తల్లో కిషన్ రెడ్డి గారు ఉత్సాహం నింపుతూ ముందుకెళ్లారు. నరేంద్ర మోదీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలనే సంకల్పంతో ప్రజలంతా ముక్తకంఠంతో తమ మద్దతు తెలిపారు. యాత్ర పొడవునా కాషాయ జెండాలతో ఎదురెళ్లి, అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ రథసారధి కిషన్ రెడ్డి గారు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ, అదేవిధంగా తెలంగాణ ప్రజలను మోసం చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం, 6 గ్యారంటీలతో మభ్యపెట్టి అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందిపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాన్ని ఎండగట్టారు. కృష్ణమ్మ క్లస్టర్ నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ శాసనసభ్యుడు పాల్వాయి హరీష్ గారి ఆధ్వర్యంలో అచ్చంపేట, దేవరకొండ, నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయసంకల్ప యాత్ర ఉత్సాహంగా కొనసాగింది. ఈ యాత్రలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి గారితో పాటు సీనియర్ నాయకులు చిత్తరంజన్ దాస్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండలంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దుతో మోదీజీ చరిత్రలో నిలిచిపోయారంటూ కొనియాడారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత తొమ్మిది సంవత్సరాలలో అవినీతిరహిత పాలనతో దేశ ఆర్థిక వృద్ధిరేటును ప్రపంచంలోనే ఐదో స్థానానికి ఎదగడానికి దోహదపడ్డారని వివరించారు. తెలంగాణలో అబద్ధపు మాటలు, అమలుకు నోచుకోని హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా......రేపు 10వ రోజున కొనసాగే బీజేపీ విజయసంకల్ప యాత్రలలో దేశ అభివృద్ధిలో నూతనోత్సాహాన్ని రగిలిస్తూ, దేశ పౌరులందరికీ ఉజ్వల భవిష్యత్తుకు హామీనిస్తూ సుపరిపాలన అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ గారికి హ్యాట్రిక్ విజయాన్ని అందించేలా మద్దతు తెలిపి.. కేంద్రంలో బీజేపీ సర్కారును సాధించుకునే మహాయజ్నంలో కలిసి నిలబడుతూ... ఆశీర్వాదం అందించాని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ గారు పిలుపునిచ్చారు.
పార్టీ మారుతున్న నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఇప్పటికే పార్టీకి అంటీముట్టనట్లుగా ఉంటున్న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత
సార్వత్రిక ఎన్నికల సమరంలో బరిలోకి దిగే అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ బీజేపీ ఖరారు చేసింది. గురువారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాల యంలో జరిగిన ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సుమారు 9 రాష్ట్రాల్లో అభ్యర్థుల కోసం కసరత్తు చేసి జాబితాను రూపొం దించింది. ఈ జాబితా నేడు విడుదల చేసే అవకాశం ఉంది. గురువారం రాత్రి జరిగిన సమావేశంలో ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కేరళ, తెలంగాణ, రాజస్థాన్, గోవా, గుజరాత్తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో అభ్యర్థులపై బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చర్చించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల బీజేపీ కోర్ కమిటీలను కమలనాథులు ఢిల్లీకి పిలిపించారు. తెలంగాణ నుంచి ఢిల్లీ చేరుకున్న నేతల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో పాటు.. జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు డా. కే. లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు న్నారు.
ఈరోజు రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డా. శిల్పారెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళా మోర్చా సమావేశం సిటీ కార్యాలయం బర్కత్పురాల్లో జరిగింది. ఈ సమావేశంలో గౌరవ మంత్రివర్యులు మరియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మార్చ్ 5వ తారీఖున సాయంత్రం 4:30 గంటల నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో జరుగునున్న ఏక్ భారత్ సారి వాకతాన్ కార్యక్రమం గురించి చర్చించడం జరిగింది. దానికి సంబంధించిన కరపత్రం ఆవిష్కరణ జరిగింది . మహిళలు ఎన్నో రంగాల్లో కృషి చేస్తున్నారు ఆ కృషిని అందరూ గుర్తించి వారి పనితనాన్ని అభినందించాలనే ఉద్దేశంతో కూడుకున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం థిమ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ వాకతాన్ నిర్వహిస్తున్నారని తెలియజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యురాలు డా. పద్మా వీరపనేని, రాష్ట్ర నాయకురాలు, కార్పొరేటర్లు, జిల్లా అధ్యక్షురాలు మరియు వారి ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు.