కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం... తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ & మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల యూత్ ఇంచార్జ్ శ్రీ ధనసరి సూర్య గారు.... ఈరోజు మంగపేట మండల రమణక్కపేట గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్కా వెంకటేశ్వర్లు గారి కొడుకు ముష్కా గ్రిస్మoత్ ఇటీవలే ప్రమాదవశాత్తు గోదావరి లో పడి స్వర్గస్తుల అవ్వగా వారి దశదినకర్మలకు హాజరై వారి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించి అన్నివేళలా ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఏ సమయంలో అయినా మీకు అన్నివేళలా నేను తోడుంటానని భరోసా నిస్తూ తగు ఆర్ధిక సాయం చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు డాక్టర్ శ్రీమతి దనసరి అనసూయ సీతక్క గారి కుమారులు రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ & పార్లమెంట్ ఎన్నికల యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ ధనసరి సూర్య గారు.... ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వల్లిపల్లి శివప్రసాద్, జిల్లా ప్రచార కార్యదర్శి & సింగిల్ విండో డైరెక్టర్ కొడం బాలకృష్ణ, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రీ నాగేంద్రబాబు, మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కొంకతి సాంబశివరావు, గ్రామ అధ్యక్షులు ఇందారపు లక్ష్మణరావు, సీనియర్ నాయకులు.... పైయ్యావుల బాబురావు,వీర్ల సత్యనారాయణ, బోనుగు లవకుమార్, చదలవాడ సాంబాశివారావ్,బోనుగు చంద్రమోహన్, అనిల్, నాగసతీష్, సత్యనారాయణ, లష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు .....
కుటుంబ వ్యవస్థను సంరక్షించి, దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలని పలువురు మహిళా వక్తలు పిలుపునిచ్చారు. సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలో బుధవారం ఉదయం మహిళా సమ్మేళనం జరిగింది. స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకెళ్ళటం శుభ పరిణామం అని, సైన్యంలో సైతం నారీ శక్తి చాటబడినదని పేర్కొన్నారు. కుటుంబంలో స్త్రీలు ఇచ్చే సంస్కారాల వలన రాబోయే తరం జాతి నిర్మాతలు గా తీర్చిదిద్దబడుతారని అన్నారు. కుటుంబం అంటే సంబంధ బాంధవ్యాల నిలయమే కాదు, సమరసతా, సమానత ల ఆలయం అని వివరించారు. ప్రతి ఇల్లు అందరినీ ఆదరించే ధర్మ స్థలం అని చెప్పారు. పిల్లలకు మన ధర్మం, దేశం పట్ల అవగాహనను పెంపొందించాలని సూచించారు.
గోదావరిఖనిలోని 34 వ డివిజన్ జవహర్ నగర్ లో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన తోకల కళ్యాణి వాళ్ళ అమ్మ కీర్తిశేషులు తోకల లక్ష్మి సంవత్సరికం సందర్భంగా పెద్దదిక్కు లేని నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులను అందజేసిన శ్రీ సీతారామచంద్ర స్వచ్ఛంద సేవ సంస్థ. సంస్థ సభ్యులు అయిన గడ్డం వాసంతి వెంకటేష్ అన్నయ్య అయినటువంటి కీర్తిశేషులు గడ్డం నాగరాజు జ్ఞాపకార్ధంగా 50 కేజీల బియ్యం ఒక నెల సరిపడు నిత్య అవసర సరుకులు నిరుపేద కుటుంబానికి చెందిన తోకల కళ్యాణి కుటుంబానికి అందజేయడం జరిగింది. ఇంత చక్కటి కార్యక్రమానికి సహకరించిన గడ్డం వాసంతి వెంకటేష్ కుటుంబానికి శ్రీ సీతారామ చంద్ర స్వచ్ఛంద సేవా సంస్థ వారు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మాతంగి శివరాజ్ మిట్టపల్లి అశోక్ చందా చంద్రమోహన్ మద్దెల తిరుపతి పసునూటి నరేందర్ ఊటుకూరి రాజు శ్రీనివాస్ గడ్డం శివాజీ అలుగోజు రాజు చారి కాసర్ల సదా శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.