రాయికల్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ జేఏసీ కార్యాలయంలో మంగళవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో అధ్యక్షులుగా చింతకుంట సాయికుమార్, ప్రధాన కార్యదర్శిగా సింగిడి శంకర్, కోశాధికారిగా కడకుంట్ల జగదీశ్వర్, ఉపాధ్యక్షులుగా యాచమనేని కిరణ్ బాబు, సింగని శ్యాంసుందర్, సంయుక్త కార్యదర్శిగా తిరుమల శంకర్, కార్యవర్గ సభ్యులుగా గంగాధరి సురేష్, కళ్ళెం శ్రీనివాస్, ఎద్దండి జితేందర్ రెడ్డి, తీగుళ్ళ గోపాల్ రెడ్డి, కనికరపు లక్ష్మణ్, గౌరవ అధ్యక్షులు సయ్యద్ రసూల్, ఎన్నికల పర్యవేక్షకులుగా గుర్రాల వేణు, పటేల్ నరేందర్, నాగమల్ల శ్రీకర్ లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు పాల్గొన్నారు.