రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయికల్ పట్టణం లో భౌతిక మరియు జీవశాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో బొడ్డుపల్లి రక్షిత( భూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల) మొదటి స్థానంలో నిలిచింది . ఏ. దీక్షాయిని (రాయికల్ కస్తూర్బా పాఠశాల) ద్వితీయ స్థానంలో నిలిచింది . ఎంపికైన ఇద్దరు విద్యార్థులు ఈనెల 20వ తేదీన జగిత్యాలలో జరిగే జిల్లా స్థాయిపోటీలలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సైన్స్ ఉపాధ్యాయులు పొన్నం రమేష్,గాజింగి రాజేశం, కలవకోట కార్తీక్,పద్మ విజయకుమార్, రాజేందర్, రమేష్,రత్నాకర్,ఉమారాణి మండలం లోని ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్దడానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉపయోగపడుతుందని, క్రమశిక్షణ కూడా అలవడుతుందని,సమాజ నిర్మాణంలో స్కౌట్స్ పాత్ర కీలకమని రాయికల్ ఎస్సై టి.అజయ్ అన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమ రూపకర్త బెడెన్ పావెల్ జయంతి వేడుకలను గురువారం రోజు పట్టణంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ స్కౌట్ శిక్షణను విద్యార్థులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు మాట్లాడుతూ స్కౌట్ శిక్షణ ద్వారా విద్యార్థులలో చిన్నప్పటినుంచి దేశభక్తి, దైవభక్తి, క్రమశిక్షణ, సామాజిక సేవ అలబడుతుందని అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన భిన్నత్వంలో ఏకత్వం మూకీ అభినయం,పిరమిడ్స్ ప్రదర్శన ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్, అకాడమిక్ డైరెక్టర్ బాలె నిఖిల్ కుమార్,స్కౌట్ శిక్షకుడు తీగుల్ల గోపాల్ రెడ్డి, స్కౌట్ విద్యార్థుల బృందం,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్,ఫిబ్రవరి 26 (జనం గొంతు): సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు.ఈ నెల 25వ తేదీ ఆదివారం కరీంనగర్ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి ఓపెన్ కుంఫు,కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో జి హర్షవర్ధన్ కట,స్పారింగ్ విభాగంలో బంగారు పథకం సాధించగా ఎస్ సృజన్,ఏ విశ్వాస్ కట విభాగంలో బంగారు పతకాలు సాధించారు.ఐపీఎస్ పాఠశాల డైరెక్టర్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరాటే వలన మంచి క్రమశిక్షణ ఏర్పడుతుందని తమ స్వీయ రక్షణకు,ఆత్మ రక్షణకు కరాటే అవసరమన్నారు.
రాయికల్ పట్టణంలోని లక్ష్మి గార్డెన్ లో గ్రీన్ వుడ్ హై స్కూల్ అన్యువల్ డే మరియు వీడ్కోలు వేడుకను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తాహాసిల్దర్ మహమ్మద్ అబ్దుల్ ఖయ్యాం మాట్లాడుతు.. విభిన్నమైన విలువలతో కూడిన విద్య విధానం అవలంభిస్తు విద్యార్థులలో విద్యతో పాటు సామాజిక ,సాంఘిక ,సాంసృతిక ,ఆధ్యాత్మిక దేశం పట్ల భక్తి,భాధ్యత లతో విలువలను నేర్పుతూ విద్యార్థులకు క్రమ శిక్షణ తో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్ బంగారు బాటలు వేస్తున్న గ్రీన్ వుడ్ హై స్కూల్ యాజమాన్యం విద్యా విధానం అభినందనీయం అని అన్నారు. పట్టణ పురపాలక సంఘం చైర్మన్ మోర హన్మండ్లు మాట్లాడుతు పాఠశాల స్థాయి విద్యానే విద్యార్థులకు కీలకం అని చిన్నప్పటిని నుండి తల్లి తండ్రులు విద్యార్థులను శ్రద్దతో చదివి పించుకోవాలని ,మా అమ్మ నన్ను క్రమశిక్షణతో జీవితం అంటే ఏమిటో నేర్పింది అని నన్ను కష్ట పాడి చదివించడం వలన నేను లెక్చరర్ గా అనేక విద్యార్థులను జీవితాలను బంగారు మాయం చేశామని ,నా పిల్లలను ఇద్దరు డాక్టర్ లను ఒకరిని వ్యాపారవేత్తను చేశానాని ఇప్పుడు రాయికల్ పట్టణానికి చైర్మన్ ముందు మాట్లాడే అవకాశం లభించడం ఆనాడు మా అమ్మ చదివు చెప్పించడం వలననే అని అన్నారు తెలుగుకు ఆంగ్ల పాఠశాలలో ప్రాధాన్యత ఇవ్వాలి ప్రెవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ విద్యాతో పాటు తెలుగు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని భవిష్యత్ తారలతో తెలుగు అంతరించే అవకాశం ఉందని ఆంగ్ల మధ్యమ పాఠశాలలో తెలుగు భాషకు కూడ నేర్చాలని వైస్ చైర్మన్ రాయికల్ పురపాలక సంఘం గండ్ర రమాదేవి సూచించారు . ఈ కార్యక్రమంలో ఎంపిపి లావుడ్య సంధ్యారాణి , జెడ్పి టిసి అశ్విని జాదవ్, ప్రెస్ క్లబ్ జే ఏ సి అధ్యక్షులు వాసరి రవి, ఉపాధ్యక్షులు చింతకుంట సాయికుమార్ ,ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, సంయుక్త కార్యదర్శి గంగాధరి సురేష్ ,పాఠశాల కరస్పాండెంట్ మిట్ట పెల్లి మహేష్ , హెడ్మాస్టర్ సారాలా రాజేష్, డైరెక్టర్ కాకెర శ్రీనివాస్ ,ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
జమాతి ఇస్లామిక్ హింద్ స్టూడెంట్ వింగ్ గర్ల్స్ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురువారం రోజు రాయికల్ పట్టణంలోని ప్రగతి ఉన్నత,పాఠశాల విశ్వశాంతి ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులంతా రాబోయే బోర్డు పరీక్షల్లో మంచి గ్రేడింగ్ సాధించాలని, యోగ, ధ్యానం ప్రతిరోజు చేయాలని, మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ రాయికల్ అధ్యక్షులు ఎం.డి . షంషేర్ ఉల్ హాక్ , సభ్యులు ఎం.డి. అబ్దుల్ నయీమ్ ,ఎం.డి.మజహర్ జి.ఐ.ఓ. సభ్యులు తుబా ఫాతిమా , సానియా ముస్కాన్ , రింశ ఫాతిమా పాల్గొన్నారు.
గోదావరిఖని బృందావన్ గార్డెన్ లో ఈ రోజు మహర్షి డిగ్రీ కళాశాల వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాన్ని ముఖ్య అతిథులుగా కళాశాల డైరెక్టర్లు దాసరి రాంమోహన్ మరియు రఘుపతిలు హాజరై మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో అత్యుత్తమైన విద్యతోపాటు విద్యార్థి ఉద్యోగ సాధనకు అవసరమైన నైపుణ్యాన్ని అత్యుత్తమైన ఉపాధ్యాయులచే అందించడం జరుగుతుందని వారు తెలియజేశారు. సీనియర్ మరియు జూనియర్ విద్యార్థులు తమ ఆటపాటలతో ఈ సమావేశాన్ని హుషారెత్తించారు.
సుల్తానాబాద్,మే 2 (జనం గొంతు ):విద్యార్థులు క్రీడల్లో రాణించాలని రేగడి మద్దికుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాధాస్వామి, టెన్నికాయిట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గండు కృష్ణమూర్తి అన్నారు.సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్ అథారిటీ ఆదేశాల మేరకు పి ఈ టి దాసరి రమేష్ ఆధ్వర్యంలో వేసవికాల టెన్నికాయిట్ క్రీడా శిబిరమును పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాధాస్వామి, టెన్నికాయిట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గండు కృష్ణమూర్తి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు, క్రీడల్లో పాల్గొని మంచి క్రమశిక్షణ అలవర్చుకోవాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి,శారీరిక ధారుఢ్యనికి దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓదెల మండల ఎస్ జి ఎఫ్ కన్వీనర్ ప్రణయ్, టెన్నికాయిట్ జాతీయ క్రీడాకారుడు బలరాం, రేగడి మద్దికుంట గ్రామ పంచాయతీ సెక్రెటరీ, అల్లిపూర్ గ్రామపంచాయతీ సెక్రెటరీ లలిత, సతీష్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
రాయికల్ పట్టణ కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో సోమవారం రోజు ఆడిటోరియం,మినరల్ వాటర్ ప్లాంట్,ఐ.ఎఫ్.పి ప్యానెల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు,రాయికల్ ఎస్సై అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...పాఠశాలలో ఇలాంటి వసతులు ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని,విద్యార్థులంతా ఇష్టపడి చదివి తమ లక్ష్యాన్ని సాధించాలని విద్యార్థులకు సూచించారు.విద్యార్థులలో దాగి ఉన్న కళలను వెలికి తీయడానికి ఆడిటోరియం ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇలాంటి వసతులు ఏర్పాటుచేసిన పాఠశాల యాజమాన్యాన్ని అతిధులు యాజమాన్యాన్ని అతిధులు అభినందించారు.అనంతరం పాఠశాల యాజమాన్యం ఎస్సై అశోక్ ని,ఆర్టిస్ట్ మారుతిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బాలె జయశ్రీ శేఖర్, అకాడమిక్ డైరెక్టర్ నిఖిల్ కుమార్,ప్రెస్ క్లబ్ జేఏసీ ప్రధాన కార్యదర్శి కడకుంట్ల జగదీశ్వర్, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.