భారత స్వతంత్ర్య సమర జ్వాల... విప్లవోద్యమ భావుటా... తిరుగులేని కన్నడ రాజకీయ శక్తి... చెంగల్రాయరెడ్డి !! కర్ణాటక రాజకీయాల్లో తనదైన ముద్రను వేసిన చెంగల్రాయరెడ్డి... 1902, మే 5 న కర్ణాటక రాష్టం కోలార్ జిల్లా క్యాసంబెల్లిలో వొక్కలిగ రెడ్డి కుటుంబంలో జన్మించారు. ఊరిపేరుతోనే క్యాసంబెల్లి చెంగల్రాయరెడ్డిగా ప్రసిద్ధి గాంచి జన్మభూమి ఋణం తీర్చుకున్నాడు. ▪️ప్రజాపక్ష నేతగా....రైతు పక్షపాతిగా విద్యార్థి దశ నుండి విప్లవోద్యమ నాయకుడుగా ఎదిగాడు..న్యాయశాస్త్రంలో పట్టా పొందిన తరువాత రాజకీయ శక్తిగా అవతరిస్తూ...మైసూర్ రాచరిక రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రజా ప్రభుత్వాన్ని సాధించడమే లక్ష్యంగగా 1930 లో " ప్రజాపక్ష " పేరుతో (పీపుల్స్ పార్టీ) ను స్థాపించారు. రైతుల సమస్యలకు ప్రాముఖ్యత ఇవ్వడంతో ప్రజాపక్ష పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో రైతుల మద్దతు కూడగట్టుకుని రైతుల పార్టీగా వేళ్లూనుకుపోయింది. ఇట్లా రైతు పక్షపాతిగా కే.సి. రెడ్డి ఎదురులేని ప్రజాబలాన్ని కూడగట్టుకున్నాడు
Your experience on this site will be improved by allowing cookies.