రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు చంద్రశేఖర రావునీ తెలంగాణ ప్రజలు ఎన్నడు మర్చిపోరు మరియు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో 4 వ వార్డు కౌన్సిలర్ తురుగా శ్రీధర్ రెడ్డి, 5 వ వార్డు కౌన్సిలర్ వల్ల కొండ మహేష్ బిఆర్ఎస్ నాయకులు పటేల్ శివ , రావిన్, వంశీకృష్ణ, సూర్య, వినోద్, శివ, రవితేజ, ఇతరులు పాల్గొన్నారు.
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయికల్ మండలంలోని తాట్లవాయి ఉన్నత పాఠశాలలో విద్యార్థులు స్వయంగా తయారు చేసిన సైన్స్ పరికరాలతో ఎగ్జిబిషన్ నిర్వహించడమైనది. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా, వారు తయారు చేసిన పరికరాల గురించి, వాటి పని విధానం గురించి వివరించడం జరిగినది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బోగ రమేష్ మాట్లాడుతూ సైన్స్ కు మన జీవితంతో విడదీయరాని సంబంధం ఉందని, ఈరోజు మనం అనుభవిస్తున్న అన్ని రకాల సౌలభ్యాలు,సౌకర్యాలు సైన్స్ వల్లనేనని,అందుకు కృషిచేసిన శాస్త్రవేత్తలకు మనం రుణపడి ఉన్నామని, విద్యార్థులు మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరు శాస్త్రీయ అవగాహన కలిగి ఉన్నప్పుడే,సమాజంలోని మూఢత్వాన్ని తొలగించగలమని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏనుగు శ్రీనివాసరెడ్డి,పొత్తూరి రవీందర్, ఏలేటి లావణ్య, చంద సాగరిక, ఎనగండ్ల శ్రీధర్, పులిపాటి శ్రీదేవి, దువ్వ చంద్రకళ, చీర్నేని రవికుమార్, బింగి పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఇటిక్యాల ఆదర్శ పాఠశాలలో సర్ సివి రామన్ నేషనల్ సైన్స్ డే ను పురస్కరించుకొని పాఠశాలలో సైన్స్ ఫెయిర్ మరియు గణిత నమూనాలను ప్రదర్శించడం జరిగింది. విద్యార్థులు వివిధ రకాల నమూనాలను ప్రదర్శించి సైన్స్ పట్ల ఉన్న ఆసక్తిని ప్రదర్శించారు. మరియు వివిధ రకాల సైన్స్ పటాలను రంగురంగుల కలర్స్ తో నేలపై గీసి ప్రదర్శించడం జరిగింది. మరియు సాయంత్రం విద్యార్థి క్విజ్ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీధర్ తో పాటు గణిత మరియు సైన్స్ ఉపాధ్యాయులు సలావుద్దీన్, ప్రవీణ్ కుమార్, రజిత, ఉషారాణి, ప్రదీప, జ్యోతి మరియు రవళి, అఖిల తో పాటు మిగతా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.
దేశంలో అనేక సంఘ సంస్కరణలు ఆర్యసమాజ్ కేంద్రంగా అమలయ్యాయి. తద్వారా సాధారణ ప్రజల్లోనూ మూఢనమ్మకాలు, అసాంఘిక కట్టుబాట్లపై ఆర్యసమాజ్ కేంద్రంగా పలు ఉద్యమాలను నిర్వహించారు. ఆర్యసమాజాన్ని 10 ఏప్రిల్ 1875 న, బొంబాయి (ముంబాయి) లో మహర్షి స్వామి దయానంద సరస్వతి స్థాపించారు. హిందూ ధర్మాన్ని అన్ని మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, వేదాలకు దగ్గరగా తీసుకెళ్ళడమే ఆర్యసమాజం ముఖ్య ఉద్దేశ్యం. ముంబాయిలో ప్రారంభమైన సుమారు 50 ఏళ్ల అనంతరం, నల్లగొండ పట్టణంలో 1924 లో ఆర్యసమాజాన్ని షేర్ బంగ్లాలో ప్రారంభించారు. నల్లగొండలో జరిగిన నిజాం విముక్తిపోరాటంలో ఆర్య సమాజ్ ముందు వరసలో నిలిచింది. జిల్లాలోని ప్రముఖ కమ్యూనిస్టు యోధులైన ధర్మ బిక్షం కూడా ఆర్యసమాజ్ బాధ్యులుగా ఉన్నారు. అయితే, ఇంతటి ఘనమైన సంఘ సంస్కరణ, సమాజ పరివర్తన, హిందూ ధర్మ రక్షణ లో అత్యంత కీలక పాత్ర వహించిన ఆర్య సమాజం విగ్రహారాధన, మూర్ఖపు మతాచారాలు, కుల, లింగ, భేదాలను తీవ్రంగా వ్యతిరేకించింది. అందరూ వేదాలు చదవాలని, ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా చదువుకోవాలని పాఠశాలలు ఏర్పాటు చేశాయి. మొట్టమొదటి 'స్వదేశీ' పదాన్ని వాడింది ఆర్య సమాజమే. కుల దురాచారాలను వ్యతిరేకించే వారంతా కూడా అప్పట్లో ఆర్య సమాజాన్ని సమర్ధించారు. కొమర్రాజు కోటేశ్వరరావు గారు నల్లగొండలో ఆర్య సమాజాన్ని నడిపించడంలో గొప్ప పాత్ర పోషించారు. . ఆర్య సమాజం షేర్ బంగ్లాలో ఉండేది. నల్లగొండ వాస్తవ్యులు బలిజ బొంతయ్య గారిని హరిద్వార్ పంపి సంస్కృతం, వేదాలు చదివించి పండిత భద్రదేవ్ గా నల్లగొండలో ఆర్య సమాజ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. 1922లోనే గ్రంధాలయం కూడా స్థాపించి పుస్తక పఠనానికి అవకాశం కల్పించారు. ఆడపిల్లలకు స్కూల్ నడిచేది. వాళ్ళక్కడ చదువుతో పాటు కర్రసాము, కత్తి సాము కూడా నేర్పేవారు. పండిత భద్రదేవ్, మాత వేదవతిలు కలిసి అనేక కార్యక్రమాలు చేసినారు. 1938లో ఆల్ ఇండియా ఆర్య సమాజ్ మీటింగ్ నల్లగొండలో పెద్ద ఎత్తున నిర్వహించారు.. 1965లో బాలికల పాఠశాల కోసం చందాలు కలెక్ట్ చేసి (1943లో రామగిరిలో పులిజాల రంగారావు గారి దగ్గర కొన్నభూమిలో) గదులు కట్టించారు. మొదట కట్టినవి గవర్నమెంట్ బాయ్స్ హైస్కూల్ కి ఇచ్చారు. తరువాత కట్టినవి గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ కి ఇచ్చారు. నల్లగొండ పట్టణానానికి చెందిన దివంగత దోమలపల్లి యాదగిరి రావు ఆర్యసమాజనికి,ఆర్య సమాజం ఆధ్వర్యంలో పేదలకు విద్య నందించేందుకు గాను ఈ కొనుగోలు చేసిన భూదానం చేశారు.అదే భూమిలో నల్లగొండ కు మేధావులనందించిన రామగిరి బాలుర మరియు బాలికల పాఠశాల లను ఏర్పాటు చేశారు. వెంకట నారాయణ గారు ప్రెసిడెంట్ గా ఉండగా రామగిరిలో ఆర్య సమాజం మందిరం నిర్మితమైనది. శ్రీ విశ్వామిత్ర , మాతల ఆధ్వర్యంలో పెండ్లిడ్లు, ఉపనయనాలు, సమావేశాలు, సత్సంగాల నిర్వహణ ప్రారంభమైనది. ఆర్యసమాజానికి కొమర్రాజు మురిదార్ రావు గారు దాదాపు 20 ఏళ్ల పాటు అధ్యక్షులుగా ఉంది విశేష సేవలందించారు. వీరి హయాంలో ఆర్యసమాజ్ భూములు, ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడారు. అవసరమైతే న్యాయస్థానాలకు సైతం వెళ్లారు. కొన్నేళ్లుగా నిలిచిపోయిన, పాత బస్తీ ఆర్యసమాజ్ నుండి రామగిరి ఆర్యసమాజ్ వరకు ప్రతీ దసరాకు జరిగే శోభాయాత్రను కొమర్రాజు మురళీధర్ రావు పునరుద్ధరించారు. మన రామగిగి కనకదుర్గ కాలనీకి చెందిన కొల్లోజు గోపయ్య గారి కుమారుడైన కొల్లోజు ప్రభాకరా చార్యులు ఆర్యసమాజ్ ఫాలోవర్ మాత్రమే కాకుండా క్రమం తప్పకుండా తన ఇంట్లో పాటు ఆర్యసమాజ్ కార్యకర్తల ఇళ్లలోనూ ప్రతీ వారం రెండు రోజుల పాటు యజ్ఞాన్ని నిర్వహించేవారు. ఆ తరువాత. బీద పిల్లలకు 5వ తరగతి దాకా పాఠశాల, కరాటే, వారం వారం యజ్ఞం, సమావేశాలు నిరంతరం జరిగేవి. ఫ్యూడల్ పాలనను వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం లోనూ ఆర్య సమాజం పాత్ర కీలక పాత్రనే పోషించింది.ఒక వైపు మత మార్పిడిలను కట్టడి చేస్తూనే మరోవైపు సాంఘిక దురాచారలను రూపు మాపడం లోనూ ఆర్య సమాజం కృషి చేసింది. నల్లగొండలో ప్రతి దసరాకు షేర్ బంగ్లా ఆర్య సమాజం నుండి రామగిరి ఆర్య సమాజం మందిరం దాకా ఒక నగర ప్రముఖుడిని గుర్రంపై ఆసీనులు చేయించి శోభాయాత్ర నిర్వహిస్తారు. అదొక గొప్ప వేడుకగా నిలిచింది. నల్గొండ ఆర్యసమాజ్ శాత జయంతి ఉత్సవాలను మార్చి 1,2,3 తేదీలలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా స్వామి రాందేవ్ బాబాహాజరుకానున్నారు. ఇదే సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్య సమాజం వ్యవస్థాపకుడు మహర్షి దయానంద సరస్వతి ద్విశత జన్మ జయంతి వేడుకలను నిర్వహించనున్నారు. మహాసభల ప్రారంభం రోజున 200 కుండాలలతో జరుప తలపెట్టిన చారిత్రాత్మక మైన మహా యజ్ఞంలో స్వామీ ప్రణావానంద సరస్వతి పాల్గొననున్నారు...
రాయికల్ //జనం గొంతు //ప్రవీణ్. జి రాయికల్ పట్టణములోని 9వ వార్డులోని అంగన్వాడి కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించడం జరిగింది. వార్డు కౌన్సిలర్ శ్రీరాముల సువర్ణ గారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండి పిల్లల,తల్లుల ఆరోగ్యం పట్ల శ్రధ్ధ వహించాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో అంగన్వాడి సూపర్ వైజర్ జి.పద్మావతిగారు,టీచర్ లావణ్య, ఉమారాణి,ఆర్పీ శ్యామల, కోల రాధ వార్డు మహిళలు పాల్గొన్నారు.
గుడికోటలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు... అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాయికల్ పట్టణం లోని గుడికోట లో శివరాత్రి జాగరణలో భాగంగా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన శివతాండవం, భారత నాట్యం, మిమిక్రీ భక్తులను అమితాంగ ఆకట్టుకుంది. వేలాదిమంది భక్తులు తరలివచ్చి శివరాత్రి జాగరణలో పాల్గొన్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో రాయికలోని బాలికల ప్రభుత్య పాఠశాల,కృష్ణ వేణి టాలెంట్ స్కూల్, వివేకవర్ధిని హైస్కూల్, విశ్వశాంతి హైస్కూల్, గ్రీన్ వుడ్ విద్యార్థులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్,మే18(జనం గొంతు): సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ ఆవరణలో గల వాసవి మాత దేవాలయంలో శనివారం వాసవి మాత జయంతి... వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండువ గా జరిగాయి. ఉదయం గణేష్ పూజలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం అమ్మవారికి అభిషేకం అంతకు ముందు పెద్ద ఎత్తున హోమాలు కుంకుమ పూజలు జరిగాయి. సాయంత్రం అమ్మవారి శోభాయాత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.అమ్మవారి ఊరేగింపు వాసవి మాత దేవాలయం నుండి పోలీస్ స్టేషన్ మీదుగా వేణుగోపాలస్వామి దేవాలయం నుండి వాసవి మాత దేవాలయం వరకు శోభయాత్ర జరిగింది. పూజారులు చంద్రశేఖర్ శర్మ , సంతోష్ శర్మ పలువురు పూజారులు పాల్గొని అమ్మవారి జయంతి, వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరిపించారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, మహిళలు,యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
శనివారం రోజున రాయికల్ మున్సిపల్ పరిధిలోని 6 వార్డు మరియు 8 వార్డు అంగన్వాడి కేంద్ర పరిధిలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఐ సి డి ఎస్ సూపర్వైజర్ పద్మావతి ఆధ్వర్యంలో రాయికల్ మున్సిపల్ పరిధిలో గల 8,9, 10 అంగన్వాడి కేంద్రాలు కలిసి 7 నెలల పిల్లలకి అన్నప్రాసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతు గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు రక్తహీనత గురించి తెలుపుతూ ఎక్కువ మోతాదులో గవర్నమెంట్ హాస్పిటల్ లో డెలివరీలే జరగాలని పాప పుట్టిన వెంటనే బిడ్డకి తల్లిపాలు పట్టాలని ఆ పాలను ముర్రుపాలు అంటారని లేత పసుపు రంగులో ఉంటూ జిగుటగా ఉంటూ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని తల్లికి ఆపరేషన్ అయినా నార్మల్ అయినా బిడ్డకి తల్లిపాలు కచ్చితంగా పట్టాలని పట్టనీడల ఆ బిడ్డకి ఎలాంటి ఆపదలు వస్తాయో తెలియపరిచినారు తల్లి బిడ్డల సంరక్షణ కు మూల దారం గంటలోపు ఇచ్చే ముర్రుపాలే మూలమని మరియు తల్లికి రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుందని బిడ్డకి బిడ్డకి ఎడం పెరుగుతుందని మరియు తెలియపరుస్తూ ఏడు నెలలు నిండిన పాపకి అదనంగా బాలామృతం మరియు 16 కోడిగుడ్లు మరియు ఇతర సామాగ్రినిస్తూ ఇంట్లో వండిన ఆహారం జారుడుగా చేసి పెట్టాలని, కచ్చితంగా బిడ్డకి తల్లిపాలు పట్టాలని తెలియపరచడం జరిగింది.
రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో అంగన్వాడి కేంద్రాల ఆధ్వర్యంలో ఆగస్టు నెల మొదటి వారం రోజులు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజు గర్భిణీలకు బాలింతలకు తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యత మరియు వాటి వలన లాభాల గురించి వివరించి చెప్పడం జరిగింది. పాప పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టించాలని తెలియజేయడం, గర్భిణీలకు శ్రీమంతాలు ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసనలు మరియు మూడు సంవత్సరాల పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. మహిళా సాధికారత గూర్చి మరియు చైల్డ్ హెల్ప్ లైన్ మహిళల హెల్ప్ లైన్ గూర్చి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇటిక్యాల సెక్టార్ సూపర్వైజర్ పద్మావతి ఏఎన్ఎంలు భాగ్యలక్ష్మి రజిత, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజేష్, కారోబార్ కిషోర్, ఆశ వర్కర్లు వనిత, రమ, సుమలత, లక్ష్మి, అనురాధ,అంగన్వాడి టీచర్స్ సుజాత, బుజ్జమ్మ సహారా సువర్ణ, అనురాధ, వివో ఏ లు లావణ్య, రాధ మరియు గర్భిణీలు బాలింతలు తల్లులు పాల్గొన్నారు మహిళా సాధికారత గూర్చి మరియు చైల్డ్ హెల్ప్ లైన్ మహిళల హెల్ప్ లైన్ గూర్చి తెలియజేయడం జరిగింది.
కొత్తపెల్లి జయశంకర్ గారి జయంతి వేడుకలు రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు రాయికల్ మండలంలోని మైతాపూర్, భూపతిపూర్ఉన్నత పాఠశాలలో తెలంగాణ సిద్ధ్దాంతకర్త, ఉద్యమ భావ జాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జయశంకర్ గారి జీవిత విశేషాలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కై ఆయన చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. నీతి నిజాయితీ నిరాడంబరత నిబద్ధత సమయపాలన కార్యశూరత వంటి మంచి లక్షణాలను ఆయన స్ఫూర్తితో విద్యార్థులు పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునీలు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.