|
modi add 1

విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ

జమాతి ఇస్లామిక్ హింద్ స్టూడెంట్ వింగ్ గర్ల్స్ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురువారం రోజు రాయికల్ పట్టణంలోని ప్రగతి ఉన్నత,పాఠశాల విశ్వశాంతి ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులంతా రాబోయే బోర్డు పరీక్షల్లో మంచి గ్రేడింగ్ సాధించాలని, యోగ, ధ్యానం ప్రతిరోజు చేయాలని, మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ రాయికల్ అధ్యక్షులు ఎం.డి . షంషేర్ ఉల్ హాక్ , సభ్యులు ఎం.డి. అబ్దుల్ నయీమ్ ,ఎం.డి.మజహర్ జి.ఐ.ఓ. సభ్యులు తుబా ఫాతిమా , సానియా ముస్కాన్ , రింశ ఫాతిమా పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 29, 2024 | 0 Comments

కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు రేవంత్ రెడ్డి చెక్కులు పంపిణీ

హైదరాబాద్ లోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ ప్రారంభోత్సవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మరియు రాష్ట్ర మంత్రివర్గంతో కలిసి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.అనంతరం కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల వారికి న్యాయం చేకూర్చే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించితే దాన్ని అమలు చేసే విషయంలో బాబు జగ్జివన్ రామ్ గారు ముఖ్య భూమికను పోషించారని,వర్గీకరణ విశయంలో కుడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్నారని,అదే విధంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అసైన్డ్ కమిటీ ద్వారా నిరుపేద ప్రజలకు మిగులు భూములను పంపిణీ చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరారు,దళితులకు న్యాయం చేకూర్చే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు,కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా తెలిపారు

By NYALAKONDA ANIL DESAI | March 07, 2024 | 0 Comments

హోటల్ యజమానులకు ప్లేట్స్ చెంచాల పంపిణీ

రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలోని వివిధ హోటల్స్ నందు చాలామంది ప్రజలు అల్పాహారంలో భాగంగా పచ్చి అటుకులు ఎక్కువగా తింటూ ఉంటారు. అల్పాహారంగా తీసుకునే అటుకులని న్యూస్ పేపర్ లో వేసి ఇస్తారు. న్యూస్ పేపర్ నందు ఉండే అక్షరాలను వివిధ రసాయనాలతో ముద్రిస్తారు. పచ్చి అటుకులను న్యూస్ పేపర్లో వేసి హోటల్స్ వారు వేశి ఇవ్వడం వలన రసాయనాలు పచ్చి అటుకుల ద్వారా శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యానికి దారితీస్తుంది అన్న విషయాన్ని గమనించి స్థానిక ఉన్నత పాఠశాలలో విద్యా బోధన చేస్తున్న భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు బొల్లె చిన్నయ్య హోటల్ యజమానులను కలిసి అటుకులను పేపర్లో పెట్టడం వల్ల జరుగుతున్న నష్టాన్ని చెప్పి స్టీల్ ప్లేట్ లో అటుకులు పెట్టే విధంగా ప్రోత్సహించడానికి ప్రతి హోటల్ యజమానికి ప్రధానోపాధ్యాయురాలు యు. వి రమణి,మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, మాజీ ఎంపిటిసి మహేశ్వరరావు, నాయకులు గుర్రం మహేందర్ చేతుల మీదుగా ఉపాధ్యాయులు బొల్లె చిన్నయ్య స్టీల్ ప్లేట్స్, చెంచాలు అందించారు. ప్రధానోపాధ్యాయురాలు రమణి మాట్లాడుతూ ఈకో ఫ్రెండ్లీ, ప్రకృతి సంరక్షణలో భాగంగా ప్లేట్స్,చెంచాలు అందజేసిన బొల్లె చిన్నయ్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురేష్,మహేష్, రాజగోపాల్,కమరుద్దీన్, భవాని, పుష్పలత, శైలజ,వేణుగోపాల్ పాల్గొన్నారు.

By Gantyala Praveen | August 12, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1