2014:2018లొ తెరాస ఎన్నికలహామీ ఫై :2014:2019 లొ బీజేపీ ఎన్నికల వాగ్దానాలు ఫై అసెంబ్లీ లో చర్చిద్దాం అని మా సిఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు విసిరిన సవాల్ కి తెరాస మాజీ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారు బీజేపీ పార్టీ నుంచి శాసన సభ పక్షం నాయకుడు శ్రీ మహేశ్వరరెడ్డి చర్చ కి సిద్ధమా? అని రేవంత్ రెడ్డి సైన్యం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా డిమాండ్ చేస్తూ తెరాస పార్టీ తెలంగాణ పదం ని బీజేపీ మతం ని వాడుకొని లబ్ది పొందడం బీజేపీపార్టీ మే 12వారణాసి 2014 లొ మాకు అధికారం ఇబ్బండి?6నెలల లోపున విదేశాల్లో నుంచి నల్ల డబ్బులు రప్పించి ప్రతి పేద వాడి ఖాతాలో 15లక్షలు జమ ఫై ఇచ్చిన హామీ పది ఏళ్ళు ఐనను మాట నిల బెట్టుకోక పోవడం ప్రధాని శ్రీ మోడీ పరిపాలన మొత్తం కాంగ్రెస్ పార్టీ ని విమర్శలు చెయ్యడం కోసం ఉపయోగించడం ఫై బీజేపీ వారు మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చేసిన ఆరు గ్యారంటీ పథకంలొ గృహ జ్యోతి పథకం నేడు ప్రారంభం ఫై బీజేపీ mla లు మా సిఎం గారికీ శుభాకాంక్షలు చెప్పాలి అంతే కాదు ప్రజలు కష్టపడి కట్టిన పన్నులతొ కాళేశ్వరం ప్రాజెక్ట్ లొ ప్రజా ధనం దుర్వినియోగం వల్ల నేడు తెలంగాణ అప్పుల కుప్ప గా మారడం ఫై ప్రధాని శ్రీ మోడీ గారు తెరాస తొ జత గా లేము అంటే వెంటనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫై సిబిఐ విచారణ జరపాలని భారతీయుడు గా ప్రధాని ని (x)మద్యమం )ద్వారా డిమాండ్ చేస్తూ తెరాస పాలన లొ బాగు పడింది mla ఎంపీ లు మాత్రమే తెర నేతలు ప్రభుత్వం సింగరేణి భూములు వారి అబ్బ సొమ్ము అన్నట్టు గా అధికారులని ప్రళబోలకి గురి చేసి తమ అవినీతి వ్యవహారం ఫై కాంగ్రెస్ పార్టీ లోకి వద్దాం అనుకుంటున్న నేతలకి కాంగ్రెస్ పార్టీ లొ స్థానం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ అని పార్లమెంట్ ఎన్నికల్లో 17పార్లమెంట్ నియోజకవర్గం లొ 14స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నదని సెంట్రల్ లొ ఇండియా విపక్షాల పార్టీ అధికారం లోకి రావడం ఫై కాళేశ్వరం ప్రాజెక్ట్ లొ జరిగిన అవినీతి వ్యవహారం ఫై ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు సిబిఐ విచారణ ఫై విజ్ఞప్తి చేస్తున్న మీ కొలిపాక శ్రీనివాస్ ప్లాట్ నెంబర్ 4అభయఆంజనేయ స్వామి దేవాలయం వెనుక చంగి చెర్ల బొల్లిగూడ బోడుప్పల్ హైదరాబాద్ 9133135710
విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం. హాజరైన మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలయ్య.
రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొనే సమస్యలు తెలుసుకుని వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించడానికి వీలుగా రైతు నేస్తం కార్యక్రమం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చెప్పారు. కరువొచ్చినా, కష్టమొచ్చినా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికలను అనుసంధానం చేస్తూ వినూత్నంగా చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం తన నివాసం నుంచి ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి, కమిషనర్ శ్రీ రఘునందనరావు, డైరెక్టర్ శ్రీ గోపి, రైతు సంఘాల ప్రతినిధులు శ్రీ సుంకెట అన్వేష్ రెడ్డి, శ్రీ నల్లమల వెంకటేశ్వర రావు, శ్రీ వై వెంకటేశ్వరరావు సచివాలయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి పలువురు రైతులు ఇందులో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2601 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ విధానంతో అనుసంధానం చేసే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రయోగాత్మకంగా తొలి విడత 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను నెలకొల్పింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో రాష్ట్ర వ్యవసాయశాఖ రూ. 97 కోట్లతో ఈ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర అధికారులతో పాటు వ్యవసాయ నిపుణులు నేరుగా గ్రామాల్లో, పంట పొలాల్లో ఉండే రైతులతో ముఖాముఖి మాట్లాడి వాళ్ల సమస్యలను తెలుసుకోవడానికి ఈ సదుపాయం వీలుకల్పిస్తుంది. పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలతో పాటు వ్యవసాయ రంగంలో అధునాతన మెలకువలను వారికి అందిస్తుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు పాలుపంచుకున్నారు. ప్రతి సీజన్లో రైతులు ఎదుర్కొనే సమస్యలను దృష్టిలో పెట్టుకొని, ఎప్పటికప్పుడు వాళ్లకు సలహాలు సూచనలిచ్చేందుకు రైతు నేస్తం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. నేరుగా రైతులు వ్యవసాయ నిపుణులతో మాట్లాడేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్లాలని, అందులో భాగంగానే రైతుల సమస్యలను తెలుసుకోవాలనే ఆలోచనతో వ్యవసాయ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. రాష్ట్రంలో ఎదురవుతున్న కరవు పరిస్థితులను సమిష్టిగా ఎదుర్కోవలసిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 26 రకాల పంటలు పండటానికి అనుకూలమైన భూములు, వాతావరణం ఉందని, కేవలం వరి లేదా పత్తి, మిర్చీ పంటలకే పరిమితం కాకుండా ఇతర పంటలు సాగు చేయాలని, పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో అన్ని గ్రామాలకు విస్తరిస్తామని, రైతులందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క, మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు చేసిన సూచనలతో ప్రభుత్వం ఇటీవలే పంటల బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చిందని గుర్తు చేశారు. రైతులు ఏదైనా ఆపదతో చనిపోతే ఆ కుటుంబాన్ని రైతు బీమా పథకం ఆదుకుంటుందని అన్నారు. రైతులు ధీమాగా బతికేందుకు రైతు బీమా పథకంతో పాటు పంటల బీమా పని చేస్తుందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతులు ధైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం అన్నారు.
హైదరాబాద్ లోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ ప్రారంభోత్సవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మరియు రాష్ట్ర మంత్రివర్గంతో కలిసి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.అనంతరం కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల వారికి న్యాయం చేకూర్చే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించితే దాన్ని అమలు చేసే విషయంలో బాబు జగ్జివన్ రామ్ గారు ముఖ్య భూమికను పోషించారని,వర్గీకరణ విశయంలో కుడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్నారని,అదే విధంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అసైన్డ్ కమిటీ ద్వారా నిరుపేద ప్రజలకు మిగులు భూములను పంపిణీ చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరారు,దళితులకు న్యాయం చేకూర్చే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు,కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా తెలిపారు
ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారితో కలసి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ గారు మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా శాలువాతో సత్కరించారు.అనంతరం జ్ఞాపికను అందజేశారు.ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ గారిని ప్రకటింటించినందుకు సిఎం గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీ-పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్ గారు తదితరులు ఉన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.