|
modi add 1

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన రాయికల్ పట్టణానికి చెందిన గట్టుపెళ్లి రాంబాబు చికిత్స కోసం 1996-97 పదవ తరగతి స్నేహితులు రూ.1లక్ష 500 ఆర్థిక సాయాన్ని గురువారం కుటుంబ సభ్యులకు అందించారు.తోటి మిత్రుడు త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆర్థిక సాయం అందించిన పదవ తరగతి పూర్వ విద్యార్థులకు రాంబాబు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మచ్చ శేఖర్, రాచర్ల ఆంజనేయులు,సిలివేరి సురేష్, భూమి మహేష్,సాంబారు శ్రీనివాస్,బెజ్జంకి హరికృష్ణ, కడార్ల శ్రీనివాస్,మండ రమేష్,వాసం శివకుమార్,పురెల్లి శ్రీనివాస్,రాజేశం,బసవరాజు,శ్రీపతి సత్తయ్య,మారంపల్లి రమేష్,బండి రామకృష్ణ, మ్యాకల నరేష్,మచ్చ కృష్ణ,పడాల రమేష్, పిన్నం శెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 16, 2024 | 0 Comments

చేనేత ను ఆదుకోవాలని తుమ్మలకు వినతి

తెలంగాణ చేనేత :వ్యవసాయమార్కెంటింగ్ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరావు గారిని కలసి చేనేత కార్మికులకోసం ముఖ్యం గా ఆర్థికంగా వెనుక బడ్డ పద్మశాలి లఆర్టికలబ్ది పై పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తూ గత20ఏళ్ళు గా పద్మశాలి కులం అభివృద్ధి పై అవినీతి రాజకీయ ల పై అవినీతి నేత ల పై చట్టం ద్వారా న్యాయం ద్వారా పోరాటం చేస్తున్న నాకు పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తూ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించి మా చేనేత ల కి చేయూతఅందించాలని బెల్లంపల్లి ల్లో ఆప్కో షాప్ ఎత్తియడం లో ప్రధాన పాత్ర పోషించిన నేత లపై చర్య తీసుకోని చేనేత వస్త్రాలయం పై మంచి ర్యాల జిల్లా కలెక్టర్ గారికి ప్రజా వాణి లో ఇచ్చిన విజ్ఞప్తి పై మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరావు గారు వెంటనే చర్య తీసుకోని చేనేత లకి చేయూత ఇస్తూ ప్రతి నియోజకవర్గం కేంద్రం లో పద్మావతి కాలనీ పేరున ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చెయ్యాలి అని మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరావు గారినిశాలువా తొ. సన్మానం చేసి విజ్ఞప్తి చేసిన అఖిల భారత పద్మశాలి సంఘము జాతీయ ప్రతినీది కొలిపాక శ్రీనివాస్ హైదరాబాద్ ఒక ప్రకటన ద్వారా తెలియచేశార

By NYALAKONDA ANIL DESAI | March 01, 2024 | 0 Comments

రాయికల్ పట్టణ బంద్ కు సంపూర్ణ మద్దతు

బంగ్లాదేశ్ లో హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ దాడులలో మరణించిన హిందువులకు నివాళ్ళు అర్పిస్తూ బంగ్ల హిందువులకు మద్దతుగా హిందూ సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన రాయికల్ పట్టణ బంద్ తో మంగళవారం పట్టణంలోని హోటల్లు వ్యాపార సంస్థలు మూసివేశారు. విద్యా సంస్థలు, హోటల్లు, షాపింగ్ సెంటర్లు అందరూ స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నాయి. అయితే ఈ బంద్ లో అత్యవసర సేవలకు సంబంధించి మందుల దుకాణాలు, ఆస్పత్రులకు మినహించారు. హిందూ ఐక్యవేదిక నాయకులు పట్టణంలోని వ్యాపార వాణిజ్య కేంద్రాలలో కలియ తిరుగుతూ బందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు తీసుకోకుండా పోలీసు వారు కట్టుదిట్టమైన భద్రతకల్పించారు.

By Gantyala Praveen | August 13, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1