రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన రాయికల్ పట్టణానికి చెందిన గట్టుపెళ్లి రాంబాబు చికిత్స కోసం 1996-97 పదవ తరగతి స్నేహితులు రూ.1లక్ష 500 ఆర్థిక సాయాన్ని గురువారం కుటుంబ సభ్యులకు అందించారు.తోటి మిత్రుడు త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆర్థిక సాయం అందించిన పదవ తరగతి పూర్వ విద్యార్థులకు రాంబాబు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మచ్చ శేఖర్, రాచర్ల ఆంజనేయులు,సిలివేరి సురేష్, భూమి మహేష్,సాంబారు శ్రీనివాస్,బెజ్జంకి హరికృష్ణ, కడార్ల శ్రీనివాస్,మండ రమేష్,వాసం శివకుమార్,పురెల్లి శ్రీనివాస్,రాజేశం,బసవరాజు,శ్రీపతి సత్తయ్య,మారంపల్లి రమేష్,బండి రామకృష్ణ, మ్యాకల నరేష్,మచ్చ కృష్ణ,పడాల రమేష్, పిన్నం శెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ మండల పరిధిలోని రామాజీపేట్ గ్రామంలో శనివారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు దొబ్బల వేణు ఆధ్వర్యంలో కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జగిత్యాల డివిజన్ అధ్యక్షులు నక్క సతీష్ మాదిగ హాజరై మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ ను గ్రామ గ్రామాన బలోపేతంచేయడంలో భాగంగా గ్రామ కమిటీలు నియమించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులుగా కండ్లపెల్లి నరేష్ ,ఉపాధ్యక్షులుగా కండ్లపల్లి సాయికుమార్, ప్రధాన కార్యదర్శిగా మారంపల్లి రాజశేఖర్,కార్యవర్గ సభ్యులుగా బెక్కెం మనోజ్,బెక్కం సుశాంత్, కండ్లపల్లి అనిల్,మారంపల్లి నరసయ్య,లను నియమిస్తూ నియాకపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బెక్కెం వెంకటేష్,సీనియర్ నాయకులు పాలెపు బాలరాజు,రాజు,ప్రశాంత్,వినయ్ తదితరులు పాల్గొన్నారు.
12న తెలంగాణ స్థానిక పత్రికల డిమాండ్లపై రాష్ట్రస్థాయి సదస్సు అక్రిడిటేషన్లు, ప్రకటనల కేటాయింపులో స్థానిక పత్రికలకు తీరని అన్యాయం డబ్ల్యూజేఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో స్థానిక పత్రికల పట్ల వివక్ష కొనసాగుతోందని బిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ అన్నారు. అక్రిడిటేషన్లు, రేట్ కార్డ్ విషయంలో తెలంగాణ స్థానిక పత్రికల యాజమాన్యాలకు అన్యాయం జరుగుతూ వచ్చిందని ఆరోపించారు. బుధవారం కరీంనగర్ డబ్ల్యూజేఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్వరాష్ట్రం ఏర్పడితే తమకు న్యాయం జరుగుతుందని స్థానిక పత్రికల యాజమాన్యాలు భావించాయని, అయితే గడచిన పదేళ్ల కాలంలో స్థానిక పత్రికల పరిస్థితులు మరింత దిగజారి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రాపకంతో, పైరవీలతో కొందరు మాత్రమే పెద్ద పత్రికల ముసుగులో లబ్ధి పొందారని, విలువలతో నిత్యం పత్రికలు వెలువరిస్తున్న వారికి మాత్రం తీరని అన్యాయం జరిగిందని అన్నారు. 12 న స్థానిక పత్రికల హక్కుల సాధనకై సదస్సు ఈనెల 12వ తేదీన హైదరాబాద్ నాగోల్ లోని శుభం కన్వెన్షన్ హాలులో 'తెలంగాణ స్థానిక పత్రికల యాజమాన్యాలు- అక్రి డిటేషన్లు- రేటు కార్డు' విషయంలో జరుగుతున్న అన్యాయాలపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సదస్సులో స్థానిక పత్రికల యాజమాన్యాల నుండి సలహాలు, సూచనలు తీసుకొని వాటిని క్రోడీకరించి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోనున్నట్లు చెప్పారు. స్థానిక పత్రికల యాజమాన్యాలకు గుర్తింపు, గౌరవం దక్కేంతవరకు డబ్ల్యూజేఐ పోరాడుతుందన్నారు. స్థానిక పత్రికలకు జరుగుతున్న అన్యాయాలను సరిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అనునిత్యం ప్రభుత్వంతో ప్రాతినిధ్యం జరుపుతామని స్పష్టం చేశారు. 12వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే తెలంగాణ స్థానిక పత్రికల యాజమాన్యాల సదస్సుకు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో పత్రికలు నిర్వహిస్తున్న ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ లోకి... వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, అక్రిడికేషన్ సమస్యల పరిష్కార కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా తాడూరు కరుణాకర్, యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా,అక్రిడిటేషన్ కమిటీ రాష్ట్ర సభ్యునిగా శివనాద్రి ప్రమోద్ కుమార్, రాష్ట్ర జాయింట్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బెజ్జంకి నరేష్ లను నియమిస్తూ నియామక ఉత్తర్వులు అందజేశారు.
జనంగొంతు//గోదావరిఖని //ఆదివారం రోజు ఉదయం పద్మావతి కాలనీవాసులు సుమారు వంద మంది కుటుంబ సమేతంగా గత పది సంవత్సరాల నుండి పరిష్కారం కానీ రోడ్లు మరియు డ్రైనేజీ సమస్యలపై స్థానిక రామగుండం శాసనసభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాగూర్ క్యాంప్ ఆఫీస్ లో కలిసి వినతి పత్రం అందిచారు, రాజీవ్ రహదారి స్కూప్స్ (కవిత టాకీస్) ఐస్ క్రీమ్ పార్లర్ నుండి కోర్టు వెనకాల వరకు గల మెయిన్ రోడ్డు ను తవ్వి మట్టి తీసి ఉంచడం వల్ల కాలనీకి స్కూల్ వ్యాన్సు మరియు ఆటో మరియు అండర్ గ్రౌండ్ కుండీలు పగిలి నీరు రోడ్డు మీదకు రావడం వల్ల పలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఎమ్మెల్యే కి విన్నవించుకోవడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే వాటి పరిష్కారము అయ్యేవిధంగా చూస్తానని కాలనీవాసులకు హామీ ఇవ్వడం జరిగింది. దీనికి పద్మావతి కాలనీవాసులు అందరూ కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినారు.
Your experience on this site will be improved by allowing cookies.