|
modi add 1

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన రాయికల్ పట్టణానికి చెందిన గట్టుపెళ్లి రాంబాబు చికిత్స కోసం 1996-97 పదవ తరగతి స్నేహితులు రూ.1లక్ష 500 ఆర్థిక సాయాన్ని గురువారం కుటుంబ సభ్యులకు అందించారు.తోటి మిత్రుడు త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆర్థిక సాయం అందించిన పదవ తరగతి పూర్వ విద్యార్థులకు రాంబాబు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మచ్చ శేఖర్, రాచర్ల ఆంజనేయులు,సిలివేరి సురేష్, భూమి మహేష్,సాంబారు శ్రీనివాస్,బెజ్జంకి హరికృష్ణ, కడార్ల శ్రీనివాస్,మండ రమేష్,వాసం శివకుమార్,పురెల్లి శ్రీనివాస్,రాజేశం,బసవరాజు,శ్రీపతి సత్తయ్య,మారంపల్లి రమేష్,బండి రామకృష్ణ, మ్యాకల నరేష్,మచ్చ కృష్ణ,పడాల రమేష్, పిన్నం శెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 16, 2024 | 0 Comments

విశ్వశాంతి హైస్కూల్ లో ముందస్తు స్నేహితుల దినోత్సవం.

స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల.. స్నేహమేరా జీవితానికి నీడ నిచ్చే మల్లేరా.. ఆపదలోను, ఆప్యాయతలోనూ అడుగడుగునా అండ నిలిచేది స్నేహం ఒకటే,ఆస్తి పాస్తులు ఎన్ని వున్నా స్నేహం ఒకటే మిన్నరా..అంటూ రాయికల్ పట్టణంలోని స్థానిక విశ్వశాంతి పాఠశాలలో విద్యార్థులు ముందస్తు స్నేహితుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు స్నేహబంధం ముందు ఏ కులమతం అడ్డు లేదనీ,స్నేహం ఒకటే మేలంటు, అన్నిటిలోన తోడు నీడగా సోదర భావం తో అండగా ఉంటానని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపు కున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మచ్చ గంగాధర్ మాట్లాడుతూ సమాజంలో,బంధుత్వంలో స్నేహానికి గొప్ప విలువ ఉన్నదని,మన మంచి కోరే స్నేహం మనల్ని ఉన్నత శిఖరాలకు అధిరోహించేలా అండగా ఉంటుందని,అలాగే చెడు వ్యసనాలకు బానిసైన స్నేహం వ్యక్తిని సమాజంలో అవినీతిపరుడుగా దేశద్రోహిగా తయారయ్యేలా చేస్తుందని, విద్యార్థులు చెడు స్నేహాన్ని వదిలిపెట్టి,మంచి స్నేహాన్ని ఆస్వాదించి ఒకరికొకరు అండగా నిలిచి సమాజానికి, కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మచ్చ లలిత,విద్యాన్వేష్ మరియు ఉపాధ్యాయులు రంజిత్ ,మహేష్ సంజన ,శృతి ,మనీషా పాల్గొన్నారు.

By Gantyala Praveen | August 03, 2024 | 0 Comments

ప్రతీ క్షణాన్ని తీయని వెన్నెలలా మారుస్తూ మన తోడు ఉండే బంధం ఒక్కటే స్నేహం .

మన ప్రతీ కష్టంలో సుఖంలో జీవితాంతం మన వెన్నంటి ఉండి ప్రతీ క్షణాన్ని తీయని వెన్నెలలా మారుస్తూ మన తోడు ఉండే బంధం స్నేహం ఒక్కటే. అటువంటి బంధానికి గొప్ప పండగ స్నేహితుల దినోత్సవం. భారత దేశంలో ప్రతీ సంవత్సరం ఆగస్టు నెల మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. జీవితంలో ప్రతీ రోజును ఆనందంగా ఉంచే మిత్రులతో రాయికల్ పట్టణంలోని కేశవనగర్ పద్మశాలి యువజన సంఘం సభ్యులు ఆనందంగా ఆత్మీయంగా కలుసుకొని స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకొన్నారు. స్నేహితులు అంటే కేవలం ఒక్క పాఠశాలలో చదివేవారు మాత్రమే కాదు ఆపదలో, సంతోషంలో వెన్నటి ఉండి మనకు తోడునీడగా ఉండే ప్రతీ ఒక్కరూ మన స్నేహితులే అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘ అధ్యక్షులు ఎలిగేటి సత్యనారాయణ,ఉపాధ్యక్షులు బొమ్మ కంటి నాగరాజు , ప్రధాన కార్యదర్శి గంట్యాల ప్రవీణ్, సంఘ సభ్యులు మామిడాల రాజశేఖర్, రంజిత్, రమేష్, చిలివేరి శ్రీనాథ్, అను మల్ల వెంకటేష్, సాయి,కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | August 05, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1